Tuesday, July 4, 2017

బొజ్జా తారకం 'నలుపు వ్యాసాలు '

బొజ్జా తారకం 'నలుపు వ్యాసాలు


తెలుగు రాజకీయాలకు సంబంధించినంతవరకు 1989-1995 మధ్యకాలం - అంటే కారంచేడు మారణకాండ అనంతరం జన చైతన్యం ఉవ్వెత్తున ఎగసిపడిన కాలం.  సామాజిక, రాజకీయ, సాహిత్య, సాంస్కృతిక రంగాలన్నీ ఒక కుదుపునకు గురైన కాలం. అన్ని ముఖ్యమైన సమస్యలపై ఆ రోజుల్లో విస్తృతమైన చర్చలు జరిగేవి. అదే కాలంలో నలుపు పత్రికలో బొజ్జా తారకం ఎంతో సాహసోపేతంగా, లోతైన పరిశీలనతో, ప్రత్యక్ష పోరాటానుభవంతో రాసిన సంపాదకీయాలు, వ్యాసాలు ఆనాటి తరానికి ప్రశ్నించడం, సంఘటితమవడం, ఎదురుతిరగడంలో మార్గనిర్దేశనం చేశాయి. మతోన్మాదం, కులోన్మాదం మళ్లీ పడగవిప్పి బుసకొడుతున్న ఈ రోజుల్లో వాటి ఆవశ్యకత మరింత వుంది.
--------------------------------------------------------------------------------------------------------------------------

అగ్రకుల దౌష్ట్యానికీ, వర్గ దోపిడీకీ గురవుతున్న ప్రజల పక్షాన జీవితాంతం రాజీలేని పోరాటం సల్పిన బొజ్జా తారకం (1939-2016) వృత్తి రీత్యా సీనియర్‌ న్యాయవాది.
ఆయన నిరంతరం అధ్యయన శీలి, బహుముఖ ప్రజ్ఞాశాలి.
అపారమైన న్యాయశాస్త్ర వైదుష్యంతో అటు న్యాయ పోరాటాలనూ, ఇటు ఉద్యమ సారధ్యాన్నీ శక్తివంతంగా నిర్వర్తించారు.
భారత రిపబ్లికన్‌ పార్టీ రాష్ట్ర శాఖ అధ్యక్షుడిగా వ్యవహరించారు.
కారంచేడు, చుండూరు, లక్షింపేట మారణకాండల ప్రతిఘటనలలో రాజీలేని పోరాటం సల్పారు. దళితులను సంఘటిత పరిచే కార్యక్రమాలకే పూర్తికాలం వెచ్చించిన ఆయన ఆంధ్రప్రదేశ్‌ దళిత మహాసభ స్థాపనలో కీలక పాత్ర పోషించారు.
మానవ హక్కుల పౌర హక్కుల పరిరక్షణకై విస్తృతంగా కృషి సల్పిన ఆయన తన ప్రసంగాలు రచనల ద్వారా తన భావజాలాన్ని ప్రచారం చేశారు.
ఆయన రచనల్లో పోలీసులు అరెస్టు చేస్తే (1981),
నది పుట్టిన గొంతుక (1983),
కులం వర్గం (1996),
నాలాగే గోదావరి (2000),
దళితుడు-రాజ్యం (2008),
నేల నాగలి మూడెద్దులు (2008),
ఎస్సీ ఎస్టీలపై అత్యాచారాలు (2012),
ఎస్సీ, ఎస్టీ నిధులు విదిలింపు మళ్లింపు (2012),
పంచతంత్రం (2012),
చరిత్ర మార్చిన మనిషి (2016) వీరి రచనల్లో ముఖ్యమైనవి.


ప్రతులకు, వివరాలకు : హైదరాబాద్ బుక్ ట్రస్ట్ ,

ప్లాట్ నెం.85. బాలాజీ నగర్,

గుడిమల్కాపూర్, హైదరాబాద్- 500006

ఫొన్ నెం:23521849

పేజీలు; 283, వేల ,200/-



No comments:

Post a Comment

హైదరాబాద్‌ బుక్‌ ట్రస్ట్‌