Saturday, October 8, 2016

కాశ్మీర్ పై బాలగోపాల్

కశ్మీర్ అనగానే  ఈ రోజు మతోన్మాదం , హింస స్ఫురించే వాతావరణం నెలకొనింది గానీ సగటు కశ్మీరీలో ఇవేవీ కనిపించవు. 'మేము వేరు, మా బతుకు వేరు . మా పాటికి మమ్మిల్ని ఉండనివ్వండి అంటే మీకెందుకు అర్ధం కాదు? అని స్నేహంగానే విస్మయం వ్యక్తం చేస్తారు. వాళ్ళ భావాలతో నిమిత్తం లేని వేరే ఏవేవో విషయాలకు కశ్మీర్ ప్రతీక అయిపోవడం వల్ల ఈ ప్రశ్న ఎవరికీ వినిపించదు. నెహ్రూ భ్రాండు లౌకికవాదులకు  కాశ్మీర్ ఆధునిక భారత లౌకికతకు ప్రతీక. అద్వానీ భ్రాండు దేశభక్తులకు కశ్మీర్  అఖండ భారత్ కు ప్రతీక. పాకిస్థానీ పాలకులకు అనంతమైన జిహాద్ కు ప్రతీక. కశ్మీర్  గురుంచి ఆలోచించడమంటే కశ్మీరీల కోసం ఆలోచించడమని మనమెప్పుడు  అర్థం చేసుకుంటాం?
                                                                      - బాలగోపాల్    
  బుర్హాన్ వాణి  కాల్చివేత తర్వాత కశ్మీర్ లోయ మరోసారి భగ్గుమనడం చూశాం . యువకుల నుండి పెద్దఎత్తున రాళ్ల దాడులు, సైన్యం నుండి పెద్దఎత్తున పెల్లెట్ల ప్రయోగమూ, కాల్పులూ జరిగి ఈ మూడు నెలలలో ఇప్పటికే 88 మంది దాకా కశ్మీరీలు చనిపోయారు. 1989 నుండి కశ్మీర్ చరిత్రంతా ఒక సంఘర్షణ నుండి మరో సంఘర్షణకు ప్రయాణమే. ఒక రక్తపాతం నుండి మరో రక్తపాతానికి ప్రయాణమే. ఇది ఈ  రోజూకి తాజాది. మరోటి జరగదన్న నమ్మకం లేదు.





ప్రతులకు, వివరాలకు : హైదరాబాద్ బుక్ ట్రస్ట్ ,

ప్లాట్ నెం.85. బాలాజీ నగర్,

గుడిమల్కాపూర్, హైదరాబాద్- 500006

ఫొన్ నెం:23521849

పేజీలు; 140, వేల ,120/-

Tuesday, September 27, 2016

చరిత్ర మార్చిన మనిషి : బొజ్జ అప్పలస్వామి , బొజ్జ తారకం

శతాబ్దాలుగా వెట్టి చాకిరితోనూ  పాలేరుతనాలతోనూ దీనంగా దుర్భరంగా నిస్సహాయంగా జీవితాలు గడుపుతూ ఆత్మగౌరవం అనే మాటకు ఆమడ దూరం పెట్టబడిన వర్గాలను గురించీ -ఆ వర్గాలను పురోగమన మార్గంలో ప్రధాన స్రవంతి దిశగా నడిపించిన ఉద్యమ శక్తుల గురించీ - ఎంత చెప్పుకున్న అది ఎప్పటికీ అంతులేని కథనమే అవుతుంది . హిందూ సమాజపు సామాజిక నిర్మితి పైన ,మతమౌఢ్యపు దౌర్భల్యాలపైనా సమరం సాగించిన ఉద్యమ శక్తుల సమాహారం అది  రుదాంద్ర మహోద్యమం . ఆ మహోద్యమంలో ఎన్నో వెలుగు రవ్వలు. ఈ చరిత్రను  ఎప్పటికప్పుడు మననం చేసుకుంటూ స్ఫూర్తి  పొందుతూ ముందుకు సాగవలసి వుంది.
ఆ సంఘర్షణాత్మ వికాస క్రమంలో బొజ్జ అప్పలస్వామి గారు , డా . అంబేడ్కర్ బాటలో పయనించారు. అంబేడ్కర్ స్థాపించిన ఆలిండియా షెడ్యూలు క్యాస్ట్ ఫెడరేషన్ పార్టీలో క్రియాశీల సభ్యలు. ఆయన వ్యవహాశైలి,ఆలోచన రీతి, సాహాసము , నిర్భీతి ఆయనను ఉత్తమ ప్రజా నాయకునిగా నిలిపాయి. ఒక జాతికి మార్గదర్శకునిగా ఒక ఉద్యమకారునిగా ఆయన రాజకీయ సామాజిక గమనాన్ని వివరిస్తూ ... ఆ ఆశయాలతో ఉద్యమిస్తున్న యువతరానికి జవసత్యాలను అందించే ప్రయత్నమే ఈ పుస్తకం.


Friday, July 22, 2016

మానసిక వ్యాధులనేవి సర్వసాధారణమైనవే అయినప్పటికీ ప్రపంచమంతటా తీవ్ర ఆందోళనకు కారణమవుతున్నాయి . మానసిక జబ్బుల చికిత్స విషయంలో చాలామంది అసౌకర్యానికి గురవుతుంటారు . మానసిక జబ్బులు కూడా శారీరక జబ్బుల్లాంటివే . వీటికీ చికిత్స వుంది. ఇవి కూడా పూర్తిగా నయమవుతాయి. మానసిక బాధపడే వ్యక్తులకు మంచి చికిస్తాను పొందే హక్కు వుంది.
ఈ పుస్తకమే ఇప్పటికీ 15 భాషల్లోకి అనువాదమయినది . 



ప్రతులకు, వివరాలకు : హైదరాబాద్ బుక్ ట్రస్ట్ ,

ప్లాట్ నెం.85. బాలాజీ నగర్,

గుడిమల్కాపూర్, హైదరాబాద్- 500006

ఫొన్ నెం:23521849

పేజీలు :280
ధర : 250/- 

ఓడి గెలిచిన మనిషి ,మల్లారెడ్డి : సంపాదకురాలు : శోభాదేవి

మానసిక అనారోగ్యం గురించి చర్చించడానికి చాలామంది నేటికీ సిగ్గు, భయం చేత దాన్ని అవమానకరమైందిగా భావిస్తారు. ఇటువంటి వాతావరణంలో ఈ పుస్తకం మనకు అరుదైన, అర్ధవంతమైన వాస్తవాన్ని గ్రహించే జ్ఞానాన్ని అందిస్తుంది. ప్రజలకు మానసిక ఆరోగ్యం గురించి అవగాహన కలిగించి, వారికి సహాయపడటానికి  రచయిత తన సమయాన్ని ఇందు కోసం వినియోగించాడని నా నమ్మకం. మానసిక వ్యాధిగ్రస్తుని ఆలోచన దృక్పథం  నుంచి చూస్తే ఈ పుస్తకం వెలకట్టలేనిది.ఎందుకంటే, ఇందులో స్కిజోఫ్రీనియా లాటి  మానసిక జబ్బు ఎంతటి వేదనకు గురిచేస్తుందో మనకు కొత్తగా తెలుస్తుంది. భారతదేశంలోని మానసిక ఆరోగ్యం పరిరక్షణాలోని నాణ్యత, సంఘంలో ఈ వ్యాధి వలన ఉత్పన్నమయ్యే సిగ్గు , భయం, అవమానాలను ఈ వ్యాధిగ్రస్తుడు స్వయంగా తన అనుభవాలతో ఈ పుస్తకంలోని గొప్పతనం.
ఇందులో, భారతదేశంలో మనకు   లభించే మానసిక ఆరోగ్యానికి సంబంధించిన వైద్య సౌకర్యాల ప్రశ్న సందర్భోచితంగా వుంది. నిజమే, మనం ఈ వ్యాధిగ్రస్తులను ఆశ్రమాలలో వుంచడమో  లేక ఒంటరిగా నిర్భమధించడమో చేసే రోజుల నుండి చాలా దూరమే వచ్చాం. సంఘంలో ఇముడ్చుకోడానికి మెల్లగా అంగీకరిస్తున్నాం. ఇపుడు మెరుగైన వైద్యం అందుబాటులో వుంది .మానసిక వేదనకు గురైన సామాన్యులందరికీ చేరాలంటే మనమింకా చాలా దూరం ప్రయాణించవలసి ఉంది. మూఖ్య0గా గ్రామ ప్రాంతాలలో ఈ వ్యాధి గురించిన అవగాహన కలిగించడం అత్యంత ఆవశ్యకం. ఇది ఒక జాతీయ కార్యక్రమంగా దేశమంతటా చేపట్టవలిసి వుంది .
ఈ పుస్తకం  మానసిక ఆరోగ్యం రూపకర్తలు, వైద్యులు, మానసిక అనారోగ్యంతో బాధపడే వ్యక్తులు, వారి కుటుంబ సభ్యులు మరియు సాధారణ ప్రజలుకు ,  చాలా ఉపయోగపడుతుంది.

ప్రతులకు, వివరాలకు : హైదరాబాద్ బుక్ ట్రస్ట్ ,

ప్లాట్ నెం.85. బాలాజీ నగర్,

గుడిమల్కాపూర్, హైదరాబాద్- 500006

ఫొన్ నెం:23521849

ధర :120/- పేజీలు, 148

Wednesday, July 20, 2016

అశుద్ధ భారత్ - రచన; భాషా సింగ్ ,తెలుగు అనువాదం: సజయ



అనేజ్ గణాంకల కంటే కూడా అతి సామాన్యమైన పదాలతో భాషా సింగ్ భారతదేశ పాకీ పనివారి సామార్థ్యలను శక్తివంతంగా ఈ పుస్తకంలో వివరించారు. ఎంతో సున్నితత్వంతో వారి జీవితాల్లోన్ని అనేక బాధాకరమైన కోణాలను ఆవిష్కరించారు.అది వర్షకాలంలో పనిలో వారుపడే దుర్భర పరిస్థితి కావొచ్చు.లేదా వారిలో కొంత మంది తమ పనినే "వ్యాపారం"గా ఎలా మార్చకున్నారో కావొచ్చు. వీటిన్నిటికంటే కూడా క్రూరమైన  కులవ్యవస్థలో వారి జీవితాలు ఎలా బందీ అయ్యాయో  ఈ కథనాలు సూటిగా వివరిస్తాయి.మనమిప్పటివరకూ వినని,కనని, ఆలోచించని భారతదేశపు మరో పార్శ్వాని మనముంధుకు తీసుకువచ్చి మన కళ్ళు తెరిపిస్తంది.
                           - జాన్ డ్రెజ్  (ప్రముఖ అంతర్జాతీయ ఆర్థికవేత్త)
"మనం సగర్వ భారతీయులం అని చెప్పుకోవటం అంటేనే, అత్యంత అవమానకరమైన పరిస్థితుల్లో  మన ప్రజలు అమానవీయమైన పాకీపని చేస్తూ తమ చేతులతో తోటిమనుషుల పెంటలను ఎత్తతున్నారనే వాస్తవాన్ని గుర్తించ నిరాకరించటమే. ఒక పక్కన చంద్రయానాలు  చేస్తూ, మరోపక్కన ఐటి రంగంలో దూసుకెళ్తున్న తరుణంలో ఇది కొనసాగటం దిగ్ర్బాంతికరమైన  విషయం. ఈ పుస్తకం అనేక గొంతులను ముందుకు తీసుకువచ్చింది. వీటిని మనం తప్పనిసరిగా విని సహానుభూతిని ప్రకటించాలి. తద్వారా ఈ అమానవీయమైన విధానాన్ని మన గత చరిత్రగా మార్చివేయాలి".    
                                                                                                                - మల్లికా సారాభాయ్
                                                                                               (ప్రముఖ నాట్యకళాకారిణి, సామాజిక కార్యకర్త .)
కేవలం పుట్టుక ద్వారా తోటి మనుషుల  పియ్యిపెంటలను ఎత్తి పారబోసే  పాకీ పనిచేసే వ్యక్తుల, సమూహాల వాస్తవ పరిస్థితి  బయటపెట్టంది అన్ సీన్ పుస్తకం. ఈ పనిని చాలా మంది ఊహించటానికి  కూడా ఇష్టపడరు
                                                                                                          ఎమ్ . వి . రమణ
                                                                                              (   ప్రిన్స్ టన్  యూనివర్సిటీలో ఫిజిసిస్ట్.)

" ద పవర్ ఆఫ్ ప్రామిస్: ఎగ్జామినింగ్ న్యూక్లియర్ ఎనర్జీ ఇన్ ఇండియా పుస్తక రచయిత    

ధర. : రూ. 150

మొదటి  ముద్రణ :జులై 2016
ఆంగ్లమూలం      : Unseen: The Truth about India's Manual Scavengers, Bhasha Singh, 2014, Penguin India
ప్రతులకు, వివరాలకు : హైదరాబాద్ బుక్ ట్రస్ట్ ,

ప్లాట్ నెం.85. బాలాజీ నగర్,

గుడిమల్కాపూర్, హైదరాబాద్- 500006

ఫొన్ నెం:23521849

Monday, April 18, 2016

హిందువులు - ఒక ప్రత్యామ్నాయ చరిత్ర, రచన: వెండీ డోనిగర్‌, తెలుగు : టంకశాల అశోక్‌

హిందువులు - ఒక ప్రత్యామ్నాయ చరిత్ర
ఇటీవలి కాలంలో వెలువడిన సుప్రసిద్ధ గ్రంథాల్లో ఇదొకటి.
కానీ, దీనిపై భారతదేశంలో చాలా దృష్ప్రచారం జరిగింది. ''ఒక మతం వారి మనోభావాలను దెబ్బతీస్తోందంటూ'' 2014 ఫ్రిబ్రవరిలో కొందరు కోర్టుకు వెళ్లటంతో ఈ రచనను ప్రచురణకర్తలే భారత మార్కెట్‌ నుంచి ఉపసంహరించుకున్నారు. దీంతో భారతదేశంలో వాక్‌స్వాతంత్య్రం పట్ల విస్తృత స్థాయిలో ఆందోళన వ్యక్తమైంది.
తరువాత మరో ప్రచురణకర్త పూనుకుంటేనే గానీ మళ్లీ ఇది వెలుగులోకి రాలేదు. అయితే అంతటా ప్రచారం జరిగినట్లుగా ఈ పుస్తకం వివాదాల పుట్ట కాదు.

పుట్టుకతోనో, ఆచరణరీత్యానో హిందూ మతాన్ని అనుసరిస్తున్న మనలో చాలామందికి - ఈ పుస్తకం హిందూ మతాన్ని మరో కోణం నుంచి, ప్రత్యామ్నాయ దృక్కోణం నుంచి పరిచయం చేస్తుంది.

ఇందుకోసం జానపద, మౌఖిక, భక్తి సంప్రదాయాల నుంచి విరివిగా స్వీకరించే ఈ రచన స్త్రీలు, నిమ్నకులాలు, నిరక్షరాస్యుల వంటి వారెవ్వరినీ వదిలిపెట్టకుండా అసాధారణ రీతిలో అందర్నీ కలుపుకుపోయే సమత్వ ధోరణిని బలంగా ముందుకు తెస్తుంది.
.. ... ...

''నాలుగు వేదాలు, ఉపనిషత్తులు, బ్రాహ్మణాలు, పురాణాలు, అరణ్యకాలు, శాస్త్రాలతో పాటు రామాయణ మహాభారత ఇతిహాసాల కావ్య సంప్రదాయంతో డోనిగర్‌కు క్షుణ్ణమైన పరిజ్ఞానం ఉన్నట్లు ఈ రచన ద్వారా మనకు అర్థమవుతుంది. లిఖిత సంప్రదాయానికి, మౌఖిక సంప్రదాయానికి మధ్య నిరంతర సంబంధాలు, ఆదాన ప్రదానాలు ఉంటాయని వాదించిన ఆమె, హిందూ మతం తన అంతర్గత తిరుగుబాట్లు, ఇతర మతాల వత్తిడుల కారణంగా ఏ విధంగా పరివర్తన చెందుతూ వస్తున్నదో తెలియచెప్పారు. రామాయణం అనేక రూపాంతరాలకు గురై, చివరకు దానిని మొట్టమొదట రచించిన వాల్మీకి రామాయణ రూపంతో స్థిరపడింది. మారుతున్న చారిత్రక పరిస్థితులను స్వీకరిస్తూ దానిని పలువురు మళ్లీమళ్లీ రాసారు. మహాభారతం విషయంలోనూ అదే జరిగింది.

    హిందూ దేవతలను డోనిగర్‌ 'కల్పనల' స్థాయికి తగ్గించినట్లు అతివాదులు ఆరోపిస్తున్నారు. కాని విభిన్నమైన నిర్వచనాలే హిందూ సంప్రదాయపు బలమైనట్లు ఈ గ్రంథం నిరూపిస్తుంది.''
............................................................................................- ప్రియంవద గోపాల్‌, ద గార్డియన్‌
.....

వెండీ డోనిగర్‌ -
సంస్కృత భాషలో, భారతదేశ అధ్యయనంలో హార్వర్డ్‌, ఆక్స్‌ఫర్డ్‌ విశ్వవిద్యాలయాలనుంచి రెండు డాక్టరేట్లు చేసారు. అనేక సంస్కృత కావ్యాలను, హిందూ మతంపై పలు రచనలను ఇంగ్లీషులోకి అనువదించారు. లండన్‌ విశ్వవిద్యాలయంలోని స్కూల్‌ ఆఫ్‌ ఓరియెంటల్‌ అండ్‌ ఆఫ్రికన్‌ స్టడీస్‌లో, బర్కిలీలోని యూనివర్సిటీ ఆఫ్‌ కాలిఫోర్నియాలో బోధించారు. ప్రస్తుతం షికాగో యూనివర్సిటీలో మిర్సియా ఎలియేడ్‌ డిస్టింగ్విష్డ్‌ సర్వీస్‌ ప్రొఫెసర్‌గా మతాల చరిత్రను బోధిస్తున్నారు.
...

టంకశాల అశోక్‌ -
 హైదరాబాద్‌, ఢిల్లీలో చరిత్ర, రాజకీయ శాస్త్రం, అంతర్జాతీయ వ్యవహారాల్లో విద్యాభ్యాసం జనధర్మ, నవ్యాంధ్ర, ఈనాడు, ఆంధ్రభూమి, ఉదయం, ఆంధ్రప్రభ, వార్త, హన్స్‌ ఇండియా పత్రికలలో ఉద్యోగం ప్రస్తుతం ఫ్రీలాన్స్‌ జర్నలిస్ట్‌.
...

తెలుగు ప్రచురణకు రచయిత్రి ప్రత్యేక ఉపోద్ఘాతం

'ద హిందూస్‌ : ఏన్‌ ఆల్టర్నేటివ్‌ హిస్టరీ' రచన తెలుగులో వెలువడుతుండటం నాకు సంతోషాన్ని, సంభ్రమాశ్చర్యాలను కూడా కలిగిస్తున్నది. అందుకు పలు కారణాలున్నాయి. నా రచనలు ఏదైనాసరే ఒక భారతీయ భాషలో వెలువడడం ఇది మొదటిసారి. నా రచనలలో ఈ విధంగా ఎక్కువమందికి అందుబాటులోకి రావాలని నేను కోరుకునేది ఏదైనా ఉంటే అది ఈ పుస్తకమే.

 పెంగ్విన్‌ సంస్థ 2010 లో ప్రచురించిన ఈ గ్రంథం ఎడిషన్‌ కోర్టు వివాదంలో చిక్కుకోవటం వల్ల నాకిట్లా అనిపిస్తున్నది. ఈ రచనను స్పీకింగ్‌ టైగర్‌ సంస్థ సాహసించి తిరిగి ఇంగ్లీష్‌ ఎడిషన్‌ వేయటం, ద హైదరాబాద్‌ బుక్‌ ట్రస్ట్‌ అదే సాహసంతో  దీనిని శ్రమపడి తెలుగులోకి అనువదించి మరింతమంది భారతీయ పాఠకులకు అందుబాటులోకి తేవటాన్ని బట్టి, భారతదేశంలో వాక్స్వాతంత్య్రం పట్ల నాకు గొప్ప ఆశాభావం కలుగుతున్నది.

తెలుగు ఎడిషన్‌ పట్ల నాకు మరొకందుకు కూడా సంతోషం కలుగుతున్నది.
దక్షిణ భారతదేశం గురించి నేను రాయటం ఇది మొదటిసారి. (కొన్ని సంకలనాలలో రాసిన వ్యాసాలలో దక్షిణ భారతదేశ ప్రస్తావనలున్నాయి. వాటిలో ఆ ప్రాంత భాషా రచనల అనువాదాలను స్వీకరించాను. ఉదాహరణకు ఇటీవల వెలువడిన 'నార్టన్‌ ఆంథాలజీ ఆఫ్‌ వరల్డ్‌ రెలిజియన్స్‌' లో హిందూమతం గురించిన సంపుటికోసం రాసిన వ్యాసంలో తమిళ, కన్నడ, మలయాళ, తెలుగు మూలాల నుంచి కొన్ని భాగాలు తీసుకున్నాను. వాటి గురించి అంటున్న మాట కాదిది.)

హిందూ మతం గురించి వెలువడిన ప్రధాన గ్రంథాలు అనేకం వదిలివేసిన కొన్ని వర్గాలవారరి స్వరాలను, ముఖ్యంగా స్త్రీలు, దళితులు, జంతుజాలాల స్వరాలను వినిపించేందుకు నా ఈ ప్రస్తుత రచనలో ప్రయత్నించాను. అదే విధంగా, నేను దక్షిణ దేశంపై సరైన విధంగా దృష్టి సారించటం ఎట్టకేలకు ఈ విధంగా మొదలవుతున్నది. అందువల్ల, ఈ రచనను తెలుగు పాఠకులు కూడా చదవనుండటం నాకు ఆనందాన్ని కలిగిస్తున్నది.
. ...............................................................................................................వెండీ డోనిగర్‌
...............................................................................................షికాగో, డిసెంబర్‌ 25, 2015

హిందువులు - ఒక ప్రత్యామ్నాయ చరిత్ర
రచన: వెండీ డోనిగర్‌
తెలుగు :  టంకశాల అశోక్‌

342 పేజీలు , వెల    : రూ. 275/-


ఆంగ్లమూలం    : The Hindus : An Alternative History, Penguin 2009 © Wendy Doniger 

ప్రథమ ముద్రణ    :    మార్చి 2016,

ప్రతులకు, వివరాలకు    :  
 హైదరాబాద్‌ బుక్‌ ట్రస్ట్‌,
ప్లాట్‌ నెం. 85, బాలాజీ నగర్‌, గుడిమల్కాపూర్‌, 
 హైదరాబాద్‌ - 500 006.
ఫోన్‌ : 040 2352 1849
E Mail ID:      hyderabadbooktrust@gmail.com

.
 

Saturday, April 9, 2016

హిందువులు - ఒక ప్రత్యామ్నాయ చరిత్ర పుస్తకావిష్కరణ నేడు ( 9 ఏప్రిల్ 2016 ) సాయంత్రం 4-30 హైదరాబాద్ లామకాన్ లో

అమెరికన్ ఇండాలజిస్ట్ వెండీ డోనిగర్ రాసిన,
టంకశాల అశోక్ తెలుగులోకి అనువదించిన
హిందువులు - ఒక ప్రత్యామ్నాయ చరిత్ర  పుస్తకావిష్కరణ నేడు ( 9 ఏప్రిల్ 2016 ) సాయంత్రం 4-30 హైదరాబాద్ లామకాన్ లో


ఆంధ్ర జ్యోతి 9 ఏప్రిల్ 2016  సౌజన్యంతో  



Friday, April 1, 2016

హిందువులు : ఒక ప్రత్యామ్నాయ చరిత్ర - రచన : వెండీ డోనిగర్ - తెలుగు అనువాదం : టంకశాల అశోక్ - పుస్తకావిష్కరణ - రచయిత్రి తో ఆన్ లైన్ లో ఇష్టాగోష్టి

హిందువులు : ఒక ప్రత్యామ్నాయ చరిత్ర -
రచన : వెండీ డోనిగర్ -
తెలుగు అనువాదం : టంకశాల అశోక్ -
పుస్తకావిష్కరణ - రచయిత్రి తో ఆన్ లైన్ లో ఇష్టాగోష్టి  -

09ఏప్రిల్ 2016 సాయంత్రం 4-30 కి లామకాన్ లో

Monday, February 29, 2016

మరణ రాహిత్యానికి ప్రతీక జీనా హైతో మర్ నా సీఖో - టంకశాల అశోక్

మరణ రాహిత్యానికి ప్రతీక "జీనా హైతో మర్ నా సీఖో "  -  టంకశాల అశోక్



(నమస్తే తెలంగాణ 28 ఫిబ్రవరి 2016 ఆదివారం అనుబంధం బతుకమ్మ సౌజన్యంతో )



.

Monday, February 22, 2016

బహుజన కోణంలో పురాణాలు - చందు తులసి - ఆంద్ర జ్యోతి 21-2-2016

బహుజన కోణంలో పురాణాలు - చందు తులసి - ఆంద్ర జ్యోతి 21-2-2016

" దేశంలో భక్తి రసం తెప్పలుగా పారుతోంది 
...డ్రైనేజీ స్కీము లేక డేంజరు గా మారుతోంది "

అప్పుడెప్పుడో గజ్జెల మల్లారెడ్డి చెప్పినట్లు ... దేశంలో భక్తి  రసం చాలా ఎక్కువైంది. వేదాలు, పురాణాల పట్ల రోజు రోజుకూ ఆసక్తి పెరిగిపోతోంది ....

పురాణాలు - మరోచూపు -
పుస్తక సమీక్ష
- చందు తులసి - ఆంద్ర జ్యోతి 21-2-2016


Sunday, February 21, 2016

A Humanist Publisher

A Humanist Publisher

Realising the importance of intellectual revolution, former politician and founder of Hyderabad Book Trust, CK Narayana Reddy published good books at affordable price to spread greathuman values. ...

http://epaper.thehansindia.com/727892/SUNDAY-HANS/SUNDAY-HANS#page/15/1


Tha Hans India 21-2-2016

నినాదమై నిలిచిన జార్జి - వి శ్రీనివాస్ , ఆంద్ర జ్యోతి 21 ఫిబ్రవరి 2016

నినాదమై నిలిచిన జార్జి - వి శ్రీనివాస్ , ఆంద్ర జ్యోతి 21 ఫిబ్రవరి 2016


Saturday, February 20, 2016

Ode to a rebel star- Jeena hai to marna seekho - Book Review by - K. Venkateshwarlu - The Hindu 20 Feb 2016


ODE TO A REBEL STAR
- Jeena hai to marna seekho - 
Book Review by - K. Venkateshwarlu - The Hindu 20 Feb 2016
...

It’s been 44 years since a young man from Osmania University was murdered on the steps of Hostel 1, obviously for his political leanings. As a new biography revisits the life of George Reddy, nothing appears to have changed in these four decades, as Indian universities are in turmoil over the very same issues and ideas.

What made George Reddy, the legendary stormy petrel and a brilliant student described by his admirers as “Che Guevara of Osmania University”, take on a society that was so insensitive and indifferent ?

Apart from the happenings around the world in the late 1960s – from student revolt in Paris, liberation struggle in Vietnam, US military incursions in Central America, the Palestine-Israel face-off, killing of Che Guevara to the Naxalbari movement in India – that influenced him a lot, it could be denial of admission into Osmania Medical College. It may sound odd for a strong persona that George came to represent, but a new biography appropriately titled, “ Jeena hai tho marna seekho ” (learn to die if you want to live) authored by Gita Ramaswamy, brings out this lesser known fact.

A voracious reader of books, George was inspired by A.J. Cronin’s The Citadel and Somerset Maugham’s Of Human Bondage early in his life and wanted to become a doctor. He thought doctors had immense power in relieving people of their suffering and he could do good to others, the modest philosophy that remained etched all through his life that was cut short cruelly at just 25 in a murderous attack by “right-wing goons” in April 1972.

Having secured second rank in his PUC (Pre-University course) in 1964 and passing with distinction from Nizam College, he was absolutely sure of getting admission into OMC in the first list itself. But he could not make it. “When he hadn’t made in the second list, his heart sank… it hurt him a lot…he felt short changed and cheated,” the biographer says, quoting his batchmates. The reason given was his non-local status, but the unfair opaque system that denied a medical seat to a deserving candidate, “may have triggered the process of questioning society and its mores.”

Unlike the present generation of students who turn out to be either good union leaders or brilliant scholars, George excelled in both. Even while building a progressive and democratic student movement in the Osmania Univesity campus and its affiliated colleges, and taking on the ABVP one of whose leading lights Ch. Vidyasagara Rao is now the Maharashtra Governor, he never neglected his studies. A gold medallist in M.Sc, he got admission into prestigious institutions like IIT, Indian Institute of Science and Physical Research Laboratory but preferred to stay back at Osmania University, as the author says, “to play bigger part in the revolutionary fight for just and a better society”.

George’s angst is visible in Fali Billimoria’s documentary, Crisis on the campus, in 1971: “Our society has become rotten. And this rottenness has spread into every facet of our lives including into our universities. Today, we have no other course left to us open now. We have raised our voices in protest. Our protest has remained unheard. We have marched in processions. Our processions have been broken up by police. We have erupted in violence. And our violence has been met with a greater violence. Today, what is left to us but to organise ourselves and meet violence with violence?”

Reconstructing and recapitulating a series of 44- year-old episodes that shaped the life and times of a complex person like George, contextualising them could be a tough task. But Gita did it admirably based on long interviews with his comrades. George was indeed complex. He was not just a revolutionary thinker but academic scholar, a pugilist, militant activist, amateur poet, comrade in arms, and defender of the rights of the poor, all rolled into one.

For many in Hyderabad, there will be a feeling of déjà vu. Is it wrong to be a socially conscientious student and take up social causes on university campus? Should he be oblivious to the happenings around him? Is it wrong to show dissent, lead and motivate students to a progressive, secular and democratic path on campus? A reader of this inspirational book and the Telugu one written by Katyayini in a much more interesting format is sure to find answers to these questions.


A voracious reader, George Reddy was inspired by A.J. Cronin’s The Citadel and Somerset Maugham’s Of Human Bondage early in his life

Tuesday, February 16, 2016

Vemula Rohith's death is a throwback to earlier era of dissent


Vemula Rohith's death is a throwback to earlier era of dissent



Courtesy: The Deccan Chronicle, Chennai Editon, dt.15-2-2016

Wednesday, January 13, 2016

జార్జి, నాకు కేవలం అన్నయ్య మాత్రమే కాదు - సంరక్షకుడూ, మిత్రుడూ కూడా - సిరిల్ రెడ్డి

జార్జి పోరాటాన్ని మరింత ముందుకు తీసుకుపోదాం
-  సిరిల్ రెడ్డి 

నలభైమూడేళ్ళ కిందట హత్యకు గురైన జార్జి, ఇప్పుడు జీవించి వుంటే అరవై తొమ్మిదేళ్ళ వయసులో ఉండేవాడు. జార్జి, నాకు కేవలం అన్నయ్య మాత్రమే కాదు - సంరక్షకుడూ (తల్లీ, తండ్రీ, సోదరుడూ - అన్నీ తానే అయిన వ్యక్తి), మిత్రుడూ కూడా. నాకు ఎనిమిదేళ్ళుండగా 1956లో తంగస్సేరి, క్విలోన్‌ లోని హాస్టల్లో చేర్చినప్పటి నుండి, 1965 లో నిజాం కాలేజిలో పియుసి పూర్తి చేసేంతవరకూ అతడు నాకు సహచరుడూ, రక్షకుడూ కూడా.
... ... ...
జార్జి మరణానంతరం జంపాల ప్రసాద్‌, మధుసూదన్‌రాజ్‌ యాదవ్‌, జనార్దన్‌ వంటి ఎందరో యువకులు ప్రజల కొరకు పోరాటంలో నేలకొరిగారు. బొజ్జా తారకం వంటి కొందరు దళిత మేధావులు కుల సమస్యపై పోరాటాలు చేశారు.
ఇన్ని పోరాటాల అనంతరం, ఈనాడు హిందూత్వ, బ్రాహ్మణీయ శక్తులు దేశ వ్యాప్తంగా మరింత బలపడటమూ, మరొక వైపున ప్రజల కొరకు పోరాడ వలసిన మార్క్సిస్టు - లెనినిస్టులూ, అంబేడ్కర్‌ వాదుల నడుమ అనైక్యత నెలకొనటమూ స్పష్టంగా కనబడుతున్నది.
... ... ...
మార్క్సిజాన్ని గురించి మాట్లాడేవారు అంబేడ్కర్‌ను తోసిపుచ్చటమూ, అంబేడ్కర్‌ను అనుసరించేవారు మార్క్సిజాన్ని వ్యతిరేక భావనతో చూడటమూ జరుగుతూ వచ్చింది.
భారతదేశంలోని ప్రత్యేకమైన సంక్లిష్ట సమాజంలో ప్రజా పోరాటాలను నిర్మించటమూ, అభివృద్ధి చెయ్యటమూ జరగాలంటే కేవలం మార్క్సిజాన్నో లేక అంబేడ్కరిజాన్నో అనుసరిస్తే సరిపోదు.
భారతదేశంలోని సంక్లిష్టమైన సామాజిక వ్యవస్థను అర్థం చేసుకునేందుకు మార్క్సిస్టులు అంబేడ్కర్‌ను అధ్యయనం చెయ్యటం ఎంత అవసరమో పేదలూ, అట్టడుగు వర్గాల వారూ అయిన సామాజిక శక్తులను సంఘటితం చెయ్యాలనుకునే అంబేడ్కర్‌ వాదులు మార్క్స్‌ను అధ్యయనం చెయ్యటమూ అంతే అవసరం.

- సిరిల్ రెడ్డి (ముందుమాట నుంచి)

జీనా హైతో మర్‌నా సీఖో 
- జార్జిరెడ్డి జీవన రేఖలు
రచన: కాత్యాయని
112 పేజీలు , ధర : రూ.60/- 
కవర్ ఫోటో : క్రైసిస్ ఇన్ ది కాంపస్, డాక్యుమెంటరీ బై ఫాలి బిల్లిమోరియా, 1971, అక్షరాలు : సృజన్

ఈ పుస్తకం కావలసిన వారు తమ పోస్టల్ చిరునామా పేర్కొంటూ హైదరాబాద్ బుక్ ట్రస్ట్ పేరిట మనీ ఆర్డర్ లేదా  డీడీ పంపిస్తే పోస్టల్ ఖర్చులు మేమే భరించి పుస్తకాన్నిమీకు అందిస్తాం.
మా చిరునామా :
హైదరాబాద్ బుక్ ట్రస్ట్,
ప్లాట్ నెం. 85, బాలాజీ నగర్, గుడిమల్కాపూర్,
మెహదిపట్నం, హైదరాబాద్ 500006

ఈ కింది బాంక్ అకౌంట్ కు ఆన్ లైన్ లో కూడా డబ్బు పంపించవచ్చు :
Oriental Bank of Commerce
1. Account Number - 15642191000616
2. Account Type - Savings bank
3. Account Name - Hyderabad Book Trust
4. Bank and Branch Name - Oriental Bank of Commerce, Attapur, Hyderabad.
5. IFSC Code.  - ORBC 0101564

ఇంకా ఏమైనా వివరాలు కావలిస్తే ఈ కింది నెంబర్ కు ఉదయం 10 నుంచి  సాయంత్రం 5 మధ్య ఫోన్ చేయండి:
Phone No. 040-2352 1849

లేదా ఈ కింది చిరునామాకు ఇమెయిల్  చేయవచ్చు :
Email ID : hyderabadbooktrust@gmail.com


ఈ పుస్తకం ఇంగ్లీష్ లో కూడా లభిస్తోంది:

Jeena hai to marna seekho : 


The Life and Times of George Reddy, 


Gita Ramaswamy, 

154 pages, Rs. 100

.


Tuesday, January 12, 2016

జార్జిరెడ్డి హత్యకు గురయ్యేనాటికి నేను స్కూలు విద్యార్థిని....- కాత్యాయని


కొన్ని ప్రశ్నలతో... మరికొన్ని సందేహాలతో...

జార్జిరెడ్డి హత్యకు గురయ్యేనాటికి నేను స్కూలు విద్యార్థిని.
హైదరాబాద్‌కు దూరంగా ఒక పల్లెటూళ్ళో పుట్టి పెరిగినదాన్ని.
అందువల్ల ఆయన గురించి ప్రత్యక్షంగా తెలుసుకునే అవకాశం నాకేమాత్రమూ లేదు.
ఆ తరువాత, విద్యార్థుల ఉద్యమాల గురించి తెలుసుకుంటూ ఉన్నప్పుడు, ముఖ్యంగా హైదరాబాద్‌లో నివసించటం మొదలయ్యాక, జార్జికి సంబంధించిన అనేక విషయాలు విన్నాను.
జార్జిరెడ్డితో కలిసి పనిచేసిన కొందరు సహచరుల జ్ఞాపకాలను వినటం ఉత్తేజకరమైన అనుభవం.
- కాత్యాయని (ముందుమాట నుంచి)
,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,

జీనా హైతో మర్‌నా సీఖో 
- జార్జిరెడ్డి జీవన రేఖలు
రచన: కాత్యాయని

112 పేజీలు , ధర : రూ.60/- 

కవర్ ఫోటో : క్రైసిస్ ఇన్ ది కాంపస్, డాక్యుమెంటరీ బై ఫాలి బిల్లిమోరియా, 1971, అక్షరాలు : సృజన్




Monday, January 11, 2016

జీనా హైతో మర్‌నా సీఖో - జార్జిరెడ్డి జీవన రేఖలు, (తెలుగులో) రచన: కాత్యాయని, హెచ్‌బిటి ప్రచురణ, ధర రూ.60/-


జీనా హైతో మర్‌నా సీఖో - కదమ్‌ కదమ్‌ పర్‌ లడ్‌నా సీఖో

జార్జి రెడ్డి పోరాటస్ఫూర్తికి ప్రతిరూపమైన నినాదమిది.
అతడు జీవించినది పాతికేళ్ళే.
కానీ, నిండైన వ్యక్తిత్వంతో జీవించటం ఎలాగో, జీవితాన్నొక ఆధిపత్య వ్యతిరేక పోరాటంగా మలచుకోవటం ఎలాగో, ఒక నమూనాను నెలకొల్పి వెళ్ళాడు జార్జి.

అతడి జీవితం నిజంగా అడుగడుగునా పోరాటంగానే సాగింది.
తన వ్యక్తిగత, సామాజిక జీవితాల్లో ఎదురయిన ప్రతికూల పరిస్థితులను ఎదుర్కొంటూ జార్జి సాగించిన ప్రయాణం అతడినొక విలక్షణమైన వ్యక్తిగా తీర్చిదిద్దింది.

ప్రపంచవ్యాప్తంగా యువతరాన్ని ఉరకలెత్తించిన అరవయ్యవ దశాబ్దపు విప్లవ చైతన్యానికి స్పందించిన జార్జి, ఆ స్ఫూర్తితో విద్యార్థి ఉద్యమాన్ని నిర్మించేందుకు పూనుకున్నాడు.

ఉస్మానియా యూనివర్సిటీ కేంద్రంగా జార్జి, అతడి సహచరులు సాగించిన పోరాటం తెలుగు నేలపై విప్లవ ప్రజాస్వామిక విద్యార్థి ఉద్యమాల చరిత్రలోనే ఒక విశిష్టమైన అధ్యాయాన్ని రచించింది.
భారతదేశంలోనూ, రాష్ట్రంలోనూ బలపడుతున్న విప్లవోద్యమ చైతన్యాన్ని విద్యార్థి ఉద్యమంలో ప్రవేశపెట్టేందుకు జార్జి విలువైన కృషి చేశాడు.
ఆనాటి విద్యా సంస్థలపై పెత్తనం సాగిస్తుండిన అభివృద్ధి నిరోధక శక్తులపై అతడి సహచర బృందం పోరాటానికి సిద్ధపడింది. విద్యారంగ సమస్యలను సామాజిక సమస్యలతో అనుసంధానం చేసిన ఈ విద్యార్థి సంఘం సామాజిక మార్పులో విద్యార్థులు నిర్వహించాల్సిన పాత్రను స్పష్టంగా నిర్వచించింది.

అన్ని రకాల ఆధిపత్య వ్యవస్థలకూ ఎదురు నిలిచి పోరాడే క్రమంలో జార్జి నెలకొల్పిన విలువలు అతణ్ణి యువతరానికి సన్నిహితం చేశాయి. ఫ్యూడల్‌ పెత్తందారీ శక్తులకు ఎదురు నిలవాల్సిన ఉద్యమం ఎంత ప్రజాస్వామికంగా, పారదర్శకంగా, నిర్భయంగా సాగాలో అతడు ఆచరించి చూపాడు. అందుకు తన ప్రాణాలనే పణం పెట్టాడు.

జార్జి హత్యతో యువతరంలో రేగిన ఆగ్రహం, అలజడి బలమైన విద్యార్థి ఉద్యమానికి ప్రేరణగా నిలిచాయి. సంస్థాగతంగా ఎన్ని పాయలుగా ప్రవహించినా, వ్యవస్థను సమూలంగా మార్చాలనే విప్లవ చైతన్యం ఈ ఉద్యమాలన్నిటికీ స్ఫూర్తిగా నిలిచింది.
జార్జి మరణానంతరం ఉస్మానియా యూనివర్సిటీ నుండి తయారైన ఎందరో విప్లవ విద్యార్థులు భారత విప్లవోద్యమానికే నాయకులుగా ఎదిగారు.

ఇన్ని ఉద్యమాలు వికసించిన అనంతరం, ఇవాళ మళ్ళీ సమాజంపై మతోన్మాద రాజకీయాల పట్టు బిగుస్తున్నది. హేతువాద, ప్రజాస్వామిక శక్తులపై పెరుగుతూ వచ్చిన అసహనం భౌతిక దాడులుగా, హత్యలుగా పరిణమిస్తున్నది. ఈ పరిస్థితికి కారణాలను లోతుగా అన్వేషించాల్సి ఉన్నది. ప్రజాజీవనంలో మతానికున్న పాత్రనూ, మతోన్మాద రాజకీయాల పట్ల నిర్లిప్తంగా ఉండిపోయే వైఖరినీ విశ్లేషిస్తూ ప్రత్యామ్నాయ దృక్పథాన్ని నిర్మించాల్సి ఉన్నది. మతోన్మాద శక్తులపై జార్జి చేసిన పోరాటాన్ని తెలిపే ఈ పుస్తకం అందుకు సహకరించగలదని మా ఆశ.

భావ ప్రకటనా స్వేచ్ఛను కాలరాస్తున్న ఆధిపత్య శక్తులపై నిరసన స్వరాలను విన్పిస్తున్న ప్రజాస్వామిక వాదులతో గొంతు కలుపుతూ ఈ పుస్తకాన్ని మీ ముందుకు తెస్తున్నాం.
- హెచ్‌బిటి 

జీనా హైతో మర్‌నా సీఖో 
- జార్జిరెడ్డి జీవన రేఖలు
రచన: కాత్యాయని
112 పేజీలు , ధర : రూ.60/- 
కవర్ ఫోటో : క్రైసిస్ ఇన్ ది కాంపస్, డాక్యుమెంటరీ బై ఫాలి బిల్లిమోరియా, 1971, అక్షరాలు : సృజన్

ఈ పుస్తకం కావలసిన వారు తమ పోస్టల్ చిరునామా పేర్కొంటూ హైదరాబాద్ బుక్ ట్రస్ట్ పేరిట మనీ ఆర్డర్ లేదా  డీడీ పంపిస్తే పోస్టల్ ఖర్చులు మేమే భరించి పుస్తకాన్నిమీకు అందిస్తాం.
మా చిరునామా :
హైదరాబాద్ బుక్ ట్రస్ట్,
ప్లాట్ నెం. 85, బాలాజీ నగర్, గుడిమల్కాపూర్,
మెహదిపట్నం, హైదరాబాద్ 500006

ఈ కింది బాంక్ అకౌంట్ కు ఆన్ లైన్ లో కూడా డబ్బు పంపించవచ్చు :
Oriental Bank of Commerce
1. Account Number - 15642191000616
2. Account Type - Savings bank
3. Account Name - Hyderabad Book Trust
4. Bank and Branch Name - Oriental Bank of Commerce, Attapur, Hyderabad.
5. IFSC Code.  - ORBC 0101564

ఇంకా ఏమైనా వివరాలు కావలిస్తే ఈ కింది నెంబర్ కు ఉదయం 10 నుంచి  సాయంత్రం 5 మధ్య ఫోన్ చేయండి:
Phone No. 040-2352 1849

లేదా ఈ కింది చిరునామాకు ఇమెయిల్  చేయవచ్చు :
Email ID : hyderabadbooktrust@gmail.com

ఈ పుస్తకం ఇంగ్లీష్ లో కూడా లభిస్తోంది:
Jeena hai to marna seekho : 
The Life and Times of George Reddy, 
Gita Ramaswamy, 
154 pages, Rs. 100 

.

Saturday, January 9, 2016

JEENA HAI TO MARNA SEEKHO : The Life and Times of George Reddy, Gita Ramaswamy



JEENA HAI TO MARNA SEEKHO

The Life and Times of George Reddy

- Gita Ramaswamy

George Reddy died very young – he was barely twenty-five years old. 
Only three years of his short life were in the public gaze.  
And yet, he inspired entire generations of students and young people. 

What unknown wellsprings brought forth that first flush of radicalism, the dedication, the clarity of purpose, the commitment to struggle against odds, the courage to turn back on a promising career and tread a difficult path? 

What significance does it hold for the students and youth of today? 
This, a short biography of George attempts to address these questions.

"Our society has become rotten. 
And this rottenness has spread into every facet of our lives including into our universities. 
Today, we have no other course left to us open now. 
We have raised our voices in protest. 
Our protest has remained unheard. 
We have marched in processions. 
Our processions have been broken up by police. 
We have erupted in violence. 
And our violence has been met with a greater violence. 
Today what is left to us but to organize ourselves and meet violence with violence?"
- George Reddy
(Speaking in the documentary, 'Crisis on the Campus', 1971, Fali Billimoria)

If you would like to order the book, please send us an MO/DD 
(to the address at the bottom - pl scroll down) or pay online to:

 Oriental Bank of Commerce

1. Account Number - 15642191000616
2. Account Type - Savings bank
3. Account Name - Hyderabad Book Trust
4. Bank and Branch Name - Oriental Bank of Commerce, Attapur, Hyderabad.

5. IFSC Code.  - ORBC 0101564



JEENA HAI TO MARNA SEEKHO

The Life and Times of George Reddy (English)

- Gita Ramaswamy 


154 pages, Rs. 100 



Hyderabad Book Trust,

Plot No. 85, Balaji Nagar, Gudi Malkapur,

Hyderabad - 500 006


Phone : 040 2352 1849


Email ID : hyderabadbooktrust@gmail.com

.





హైదరాబాద్‌ బుక్‌ ట్రస్ట్‌