Wednesday, December 30, 2015

వ్యవస్థను కాపాడిన రాముడు - డా.బి.విజయభారతి రచన - పునర్ముద్రణ ...

వ్యవస్థను కాపాడిన రాముడు 
- డా.బి.విజయభారతి 


ప్రకృతిలోని రంగులను పరిచయం చేసే పసి వయస్సులోనే -

'' ఏనుగు ఏనుగు నల్లన
ఏనుగు కొమ్ములు తెల్లన
ఏనుగు మీద రాముడు
ఎంతో చక్కని దేముడు...''

అంటూ పిల్లలకు రాముని దైవత్వాన్ని నూరిపోస్తున్న వ్యవస్థ ఇది. చిన్నప్పటి నుంచే వారికి రాముడంటే ఒక ఇష్టం - ఆరాధనా భావం ఏర్పడిపోతాయి.

మత విషయాలను ప్రశ్నించటం పాపం కాబట్టి, రామాయణం చెప్పిన విషయాలను గానీ రామాయణ సంఘటనలను గానీ ఎవరూ ప్రశ్నించరు. ఆలోచించరు. వాటిని నమ్ముతూ ఆదర్శంగా గ్రహిస్తూ వుంటారు.

రామాయణం ప్రవేశపెట్టిన సామాజిక ధర్మాల వల్ల నష్టపోతున్న వారు కూడా అంతే. అలా ఆలోచించటం నేరం అనుకుంటారు. ఈవిధంగా నష్టపోతున్న అధిక శాతం ప్రజల గురించి ఆలోచించేవారు మాత్రమే ఈ సమస్యను విశ్లేషించారు.

ఆధునిక యుగంలో మహాత్మా జోతిరావ్‌ ఫూలే, డా.బి.ఆర్‌.అంబేడ్కర్‌ లు ఈ సామాజిక వ్యవస్థ గురించి తపన పడ్డారు. అసమానతల మూలాలను అన్వేషించే క్రమంలో పురాణాల నేపథ్యాన్ని అధ్యయనం చేశారు.

సమ సమాజం కోసం, మానవతా విలువల కోసం వారు చేసిన అన్వేషణ- అందించిన సమాచారం అనంతర తరాలకు వెలుగు బాటలయ్యాయి.

ప్రాచీన కాలం నుంచీ భారతీయ వేదాంతులు - తత్వవేత్తలు, సంస్కర్తలు - రాజకీయ నాయకులు ఈ సామాజిక ధోరణులను సరిచేస్తున్నామంటూనే ఆ చిక్కుముడులను మరింత బిగిస్తూ వచ్చారు. పురాణాలు - రామాయణ మహాభారతాలు చెప్పిన ధర్మాలను అతిక్రమించే సాహసం చేయలేకపోయారు.

ఈనాటికీ రామాయణం జనంపై ప్రభావం చూపుతూనే వున్నది. ప్రజల జీవనాన్నే కాక దేశ రాజకీయాలనూ, రామాయణ కథాంశాలు నిర్దేశిస్తున్నాయి.

ఈ నేపథ్యంలో రామాయణం గురించి తెలుసుకోవలసిన అవసరం ఎంతైనా వుంది.

రామాయణం చాలా పెద్ద గ్రంథం. దాన్ని చదవటం కష్టం అనుకునే వారికి రామాయణంలోని అంశాలను పరిచయం చేయటం ఈ రచన లక్ష్యం.
(రచయిత్రి తొలిపలుకుల నుంచి)



వ్యవస్థను కాపాడిన రాముడు 

- డా.బి.విజయభారతి

270 పేజీలు; వెల రూ. 150/-

ప్రతులకు వివరాలకు:

: హైదరాబాద్‌ బుక్‌ ట్రస్ట్‌,
ప్లాట్‌ నెం. 85, బాలాజీ నగర్‌, గుడిమల్కాపూర్‌,
హైదరాబాద్‌ - 500006

ఫోన్‌ : 040 2352 1849

ఇమెయిల్‌ : hyderabadbooktrust@gmail.com

No comments:

Post a Comment

హైదరాబాద్‌ బుక్‌ ట్రస్ట్‌