Friday, April 4, 2014

చెట్లు నాటిన మనిషి - జా జియోనో- పునర్ముద్రణ

చెట్లు నాటిన మనిషి 

సుప్రసిద్ధ ఫ్రెంచ్‌ రచయిత జా జియోనో 1954లో రాసిన ఈ కధ        ( The Man Who Planted Trees ) ప్రపంచ వ్యాప్తంగా అనేక భాషల్లోకి అనువదించబడింది. 
లక్షలాది మందిని వృక్ష ప్రేమికులుగా మార్చింది. మొక్కలు నాటేలా వారిని ప్రోత్సహించింది. దేశదేశాల్లో అడవుల పునరుద్ధరణ కృషికి గొప్ప ఉత్తేజాన్నిచ్చింది. 

పది పేజీలు కూడా లేని ఈ చిన్న కథలో రచయిత సృష్టించిన 'ఎల్‌జియా బూఫియే' పాత్ర ప్రపంచ సాహిత్య చరిత్రలో సుస్థిర స్థానాన్ని సంపాదించుకుంది. బూఫియే ఇప్పటికీ ఎందరికో స్ఫూర్తినిస్తూనే వున్నాడు, ఎప్పటికీ స్ఫూర్తినిస్తూనే వుంటాడు.

ఈ చిరుపుస్తకాన్ని డా. టి.వి.ఎస్‌.రామన్‌ అనువాదం చేయగా బాలసాహితి, హైదరాబాద్‌ వారు
1996లో తెలుగులో ముద్రించారు. ఆతరువాత 1998లో హైదరాబాద్‌ బుక్‌ ట్రస్ట్‌ ఈ పుస్తకాన్ని
విస్తృత స్థాయిలో జనంలోకి తీసుకెళ్లింది. కాపీలన్నీ ఎప్పుడో అయిపోయాయి. 


అయితే పర్యావరణం పట్ల ప్రజల్లో అప్పటికంటే ఇప్పుడు ఎంతో చైతన్యం పెరిగింది.
గ్లోబల్‌ వార్మింగ్‌ దుష్ఫలితాలను ప్రతీ ఒక్కరూ ప్రత్యక్షంగా అనుభవిస్తున్నారు. ఈ దృష్ట్యా
అనేకమంది అభిమానుల  కోరిక మేరకు 'చెట్లు నాటిని మనిషి'ని హెచ్‌బిటి తిరిగి మీ ముందుకు తెచ్చింది. .
మీరు ఒక్క చెట్టైనా నాటకపోయినా 
కనీసం ఈ 'చెట్లు నాటిని మనిషి'తో కరచాలనం చేయండి. 

ఒంటి చేత్తో ఒక అడవినే సృష్టించిన 'బూఫియే' గొప్ప మనసును, 
మహత్తరమైన అతని కృషిని పదిమందికి పరిచయం చేయండి.  
రండి ఈ పచ్చటి పుస్తకం నీడలో కాసేపు సేద దీరుదాం.

చెట్లు నాటిన మనిషి
రచన: జా జియోనో 

ఆంగ్ల మూలం:  The Man Who Planted Trees- Jean Giono.
తెలుగు అనువాదం: డా. టి.వి.ఎస్‌.రామన్‌
16 పేజీలు, ధర: 10 రూపాయలు


ప్రతులకు, వివరాలకు:
హైదరాబాద్‌ బుక్‌ ట్రస్ట్‌,
ప్లాట్‌ నెం. 85, బాలాజీ నగర్‌,
గుడిమల్కాపూర్‌, హైదరాబాద్‌ - 500006

ఫోన్‌ నెం. 040-2352 1849
EMail ID : hyderabadbooktrust@gmail.com

No comments:

Post a Comment

హైదరాబాద్‌ బుక్‌ ట్రస్ట్‌