Friday, May 31, 2013

సమాజం విజ్ఞాన శాస్త్రం - డి.డి.కొశాంబి- పునర్ముద్రణ ...

పాఠకుల ఆదరణ రీత్యా డి.డి.కొశాంబి రచన ''సమాజం విజ్ఞాన శాస్త్రం'' ను పునర్ముద్రించాం.

ఇంధన అవసరాలను తీర్చుకోవడానికి ఇండియా వంటి ఉష్ణమండల దేశంలో సౌరశక్తి ఎంత అనువుగా ఉంటుందో తెలియజెప్పిన మొదటి తరానికి చెందినవాడు డి.డి.కొశాంబి.

తౌకగా లభించే శక్తి మనకు అపారంగా అందుబాటులో ఉండగా ప్రమాదకరమైన 'అణుశక్తి' వెంటపడటం వేలంవెర్రి అన్నారాయన.

శాస్త్ర విజ్ఞానానికి విభిన్న సామాజిక అంశాలకు మధ్య అనుసంధానం సాధించడంకోసం ప్రయత్నించిన, శాస్త్రాన్ని సాధారణ ప్రజా సమస్యల కోసం వినియోగించడం ఎలాగో వివరించిన ప్రజా ప్రేమికుడు డి.డి.కొశాంబి. సామాజిక పురోగమన క్రమంలో విజ్ఞానశాస్త్రం అభివృద్ధిని కళ్లకు కట్టినట్లు చిత్రించారాయన.

మతపర మూఢ విశ్వాసాలను శాస్త్రీయంగా అధిగమించేందుకు ఆయన చేసిన సూచనలు ఎంతో విశిష్టమైనవి. శాస్త్రానికీ సమాజానికీ మధ్య ఉన్న, ఉండవలసిన సంబంధాలను విశ్లేషిస్తూ ఆయన రాసిన ఐదు వ్యాసాల సమాహారమే ఈ పుస్తకం.
తప్పక చదవండి.



సమాజం విజ్ఞానశాస్త్రం

డి.డి.కొశాంబి

వెల; రూ. 30/-

No comments:

Post a Comment

హైదరాబాద్‌ బుక్‌ ట్రస్ట్‌