Sunday, April 7, 2013

పోలీసు చర్య అనంతరం జరిగిన భయోత్పాతాలను ఎక్కువచేసి చూపించాలన్న కోరిక నాకు లేదు. కాకపోతే..... - మొహమ్మద్‌ హైదర్‌



... పోలీసు చర్య అనంతరం జరిగిన భయోత్పాతాలను ఎక్కువచేసి చూపించాలన్న కోరిక నాకు లేదు. కాకపోతే ఈ విషాద ఘటనలను కచ్చితంగా నివారించివుండవచ్చు. భారత సైన్యం ముందంజ వేస్తున్నప్పుడు చాలా చోట్ల గందరగోళ పరిస్థితులు నెలకొన్నాయి. విజయకేతనం ఎగరేసిన భారత సైన్యం ఛిన్నాభిన్నం చేస్తూ దూసుకువచ్చే బదులు స్థానిక పాలనాయంత్రాంగాలను పునరుద్ధరించడమొ లేదా మిలటరీ యంత్రాంగాలను నెలకొల్పడమో చేసి జాగ్రత్తలు తీసుకుని ఉంటే బాగుండేది. ఆ రెండూ చేయలేదు.

అదే అదనుగా దోపిడీ దొంగలు సరిహద్దులు దాటి వచ్చారు. హింసాయుత ఘటనలు యాదృచ్ఛికంగానే కాదు అవకాశవాదంతో పెట్రేగాయి. దోపిడీ దొంగల్లో సరిహద్దు శిబిరాలకు చెందిన వేలాది మంది యువకులు కలిసిపోయారు. వాళ్లు హింసాయుత దాడుల్లో ... ప్రత్యేకించి ప్రతీకార దాడుల్లో శిక్షణ పొందారు.

అరాచకత్వం కొన్ని వారాలపాటు కొనసాగింది. గుంపులు గుంపులుగా వచ్చిన జనం జైళ్లను పగలకొట్టి ఖైదీలను విడిపించుకుపోయారు ఉస్మానాబాద్‌ తరహాలో. హత్యలు, లూటీలు, గృహదహనాలు కొనసాగాయి. రజాకార్లుగా అనుమానించినవాళ్లను, సైన్యంతో కలిసిమెలసి వున్న గుంపులను దోపిడీ దొంగలు ఊచకోత కోశారు. వేలాది కుటుంబాలు చెల్లాచెదురయ్యాయి.

తల్లిదండ్రుల నుంచి పిల్లల్నీ, భర్తల నుంచి భార్యల్నీ దూరం చేశారు. మహిళలనూ బాలికలనూ వెంటాడి అత్యాచారాలు చేశారు.
ఇలాంటి ఎన్నో సిగ్గుమాలిన దారుణాలు జరిగాయి ఆ రోజుల్లో. వాటి గురించి ఇప్పటికీ నేను రాయలేను.

ఉస్మానాబాద్‌ నుంచి తిరిగి వచ్చిన రోజునుంచీ నా మిత్రులూ బంధువులూ నన్ను పాకిస్తాన్‌ వెళ్లిపోవలసిందిగా ఒత్తిడి చేశారు. పరిస్థితులు రానురానూ మరింత అధ్వాన్నంగా తయారవడంతో
.... .... ...

- మొహమ్మద్‌ హైదర్‌ 
''1948 : హైదరాబాద్‌ పతనం'' పుస్తకం నుంచి
(హైదరాబాద్‌ బుక్‌ ట్రస్ట్‌ ప్రచురణ)

ఈ పుస్తకావిష్కరణ సభ, చర్చ ఈ రోజే హైదరాబాద్‌ సారస్వత పరిషత్‌ హాల్‌ లో ఉదయం 10 గంటలకు జరుగుతుంది. అందరూ ఆహ్వానితులే.


No comments:

Post a Comment

హైదరాబాద్‌ బుక్‌ ట్రస్ట్‌