Wednesday, February 6, 2013

తిరగబడ్డ తెలంగాణా పై పుస్తకం డాట్ నెట్ లో అసూర్యం పశ్య సమీక్ష

కొంతకాలం క్రితం ఆర్.నారాయణమూర్తి గారి “వీర తెలంగాణ” చిత్రం చూశాక తెలంగాణా సాయుధ పోరాటం సంఘటనలు నన్ను వెంటాడాయి. అప్పట్లో బైరంపల్లి ఘటన పై రాసిన ఒక చిరుపుస్తకమూ (ఈ పుస్తకం ఒకప్పుడు ఇక్కడ ఆన్లైన్లో ఉచితంగా చదువుకునేందుకు ఉండేది. ఇప్పుడు లేదుమరి! ఇక్కడ జరిగిన మారణహోమాన్ని జలియన్వాలాబాఘ్ ఉదంతంతో పోలుస్తారు.), ఈ సాయుధ పోరాటం గురించి పుచ్చలపల్లి సుందరయ్య రాసిన పుస్తకమూ -రెంటినీ పైపైన తిరగేసినా కూడా, ముందుకు సాగలేదు నా చదువు. ఈ నేపథ్యంలో మొన్నామధ్య హైదరాబాద్ బుక్ ట్రస్ట్ వారిని కలిసినప్పుడు ఈ పుస్తకం గురించి తెలిసింది. ఒక చరిత్ర పరిశోధకుడు రాసిన థీసిస్ అనగానే భయం వేసింది. ఇది నాకర్థం కాదులే అనుకుంటూ ఉన్నా, స్ట్రాంగ్ రికమెందేషన్ మూలాన చదవడం మొదలుపెట్టాను.
తెలంగాణ సాయుధ పోరాటంపై రచయిత రాసిన పీ.హెచ్.డీ థీసిస్ కు ఒక కొనసాగింపులా సాగిన పరిశోధనకు తెలుగు అనువాదం ఈ పుస్తకం. నల్గొండ, వరంగల్ జిల్లాలలో ఉద్యమం మొదలై, కొనసాగిన తీరును ఆవిష్కరించడం ఈ పుస్తకం లక్ష్యం (ఇప్పటి ఖమ్మం జిల్లా అప్పటి వరంగల్ జిల్లాలో భాగం). చారిత్రక, సామాజిక నేపథ్యాలను వివరించడంతో మొదలుపెట్టి, 1948 దాకా వచ్చి ముగుస్తుంది ఈ పుస్తకం. సాధారణంగా ఈ సాయుధ పోరాటం గురించి వివరించే రచనలన్నీ కమ్యూనిస్టు పార్టీ దృక్పథం నుండి, పార్టీని కేంద్రంగా చేసుకుని సాగిన రచనలు (ఈ ముక్కనేను కాదు అంటున్నది. పుస్తకంలో కూడా రాసారు. ఈ విషయమై నేను ఏదన్నా తెలుసుకోజూసిన ప్రతిసారీ కమ్యూనిస్టుల రచనలే నాకు కనబడ్డాయి అన్నది వేరే విషయం!). అయితే, ఈ రచనలో 1940ల నాటి తెలంగాణా పోరాటాల్లో ప్రజల భాగాన్ని అధ్యయనం చేయడం ముఖ్య లక్ష్యమని రచయిత ఉపోద్ఘాతంలోనే స్పష్టం చేశారు. పుస్తకం కవర్ పేజీ – “మా భూమి” అన్న చిత్రం లోనిదట. వ్యక్తిగతంగా ఈ సినిమాలో అసలు కథ కన్నా కమ్యూనిస్టు ప్రాపగండా ఎక్కువని నాకు అనిపించింది ఆ మధ్య ఈ సినిమా చూసినప్పుడు. మరి ముఖచిత్రంగా దాన్ని పెట్టారేం? అనుకున్నాను.
***
పుస్తకంలో ఎనిమిది ప్రధాన అధ్యాయాలు (ముందుమాట, అనుబంధాలు కాక). వీటిలో మొదటి రెండు అధ్యాయాలు ఉద్యమానికి వెనుక చారిత్రక నేపథ్యం, ఉద్యమానికి దారితీసిన భూస్వామ్య పరిస్థితులు, “దొర” దొర గా తయారైన వైనాన్ని విశ్లేషిస్తాయి. తరువాత రెండు అధ్యాయాలు “చిల్లరోళ్ళు” అని పిలువబడే వృత్తి కులాల వారు, రైతులూ ఈ దొరలపై తిరుగుబాట్లు చేయడాన్ని గురించి విశ్లేషిస్తాయి. తక్కిన అధ్యాయాల్లో ఆంధ్రమహాసభ/కమ్యూనిస్టు పార్టీ వీళ్ళని సంఘటిత పరచడం, నిజాం/దొర లకు వ్యతిరేక సాయుధ పోరాటం, కొన్ని ప్రాంతాల్లో సంఘం రాజ్యం ఉండడం – ఈ క్రమాన్ని వివరిస్తూ, విశ్లేషిస్తూ 1948లో భారత ప్రభుత్వం హైదరాబాద్ సంస్థానాన్ని తన పరిధిలో విలీనం చేసుకోవడం దగ్గర ఆపేస్తారు రచయిత. మొదటి రెండు అధ్యాయాలు మినహాయిస్తే, తక్కినవన్నీ తేలిగ్గా అర్థమయ్యే భాషలో ఉన్నాయి........ ....

పూర్తి సమీక్ష ... ఇక్కడ ... చదవండి.
http://pustakam.net/?p=13658

No comments:

Post a Comment

హైదరాబాద్‌ బుక్‌ ట్రస్ట్‌