Friday, December 28, 2012

బిభూతి భూషణ్ బంధోపాధ్యాయ రచనలపై కందుకూరి సెలవు సమీక్ష

బిభూతి భూషణ్‌ బంధోపాధ్యాయ రాసిన ''పథేర్‌ పాంచాలి'', ''అపరాజితుడు'' నవలల్ని చదివిన కందుకూరి రమేష్‌ బాబు గారి కుమార్తె 'సెలవు' వాటిపై తన స్పందనను అక్షరబద్ధం చేసింది. మీరూ చదవండి:

ప్రస్తుతం సెలవు (పేరు విలక్షణంగా వుంది కదూ) తొమ్మిదో తరగతి చదువుతోంది. తను మంచి సాహిత్యాభిమానే కాదు అద్భుతమైన ఆర్టిస్ట్ కూడా. ఇటీవల 'మంచి పుస్తకం' వాళ్లు ప్రచురించిన పిల్లల పుస్తకాలకు కొన్ని బొమ్మలను, ముఖచిత్రాలను వేసింది.

హైదరాబాద్‌ బుక్‌ ట్రస్ట్‌ పుస్తకాలపై మీరు కూడా సమీక్షలు రాసి పంపిస్తే మా బ్లాగులో పొందుపరుస్తాం. అందరికీ ఇదే మా ఆహ్వానం. 
 

పథేర్‌ పాంచాలి:
ఒక రెండు పసి హృదయాలు ఈ లోకాన్ని ఎలాంటి దృక్పథంతో చూసారో తెలిపేదే ఈ రచన. వాళ్లు పచ్చని పొలాలలో ఎలా ఆడుకున్నారో వివరిస్తుంది. చిన్న చిన్న వస్తువులనే ఆశ్చర్యంతో చూసే చిన్న పిల్లలు ఒక వింత వస్తువు, భూమి మీద ఎన్నడూ లేని వస్తువు వాళ్ల కళ్లముందుకు వస్తే ఎలా ఎదుర్కొన్నారో ఈ రచనలో చెప్పారు. ఇళ్లు గడవడానికి తల్లిదండ్రులు ఎంతో శ్రమపడుతుంటారు. చిన్న చిన్న దొంగతనాలతో సరిపెట్టుకునే పసి హృదయం. అ లాంటి సంఘటనలు. ఆ పసివాడు తన సోదరి చావును ఎలా ఎదుర్కొన్నాడో దాన్ని ఎలా జీర్ణించుకున్నాడో తెలిపేది. తన ఊరిని వదిలి వెళ్లలేకపోవడం. ఆ పొలాలతో చెట్లతో పుట్టలతో తనకు ఏర్పడిన అనబంధం. వేరే ఊరికి వెళ్లికూడా తనలో తన ఊరికి వున్న స్థానం ఎన్నటికీ చెరిగిపోనిది. క్రమంగా వాళ్ల నాన్న ఆరోగ్యం క్షీణిస్తుంది. తర్వాత ఆయన మరణిస్తాడు. తన తల్లి ఆ అబ్బాయిని ఎలా పెంచిందో... తను పడ్డ కష్టాలు చెప్పలేనివి. తన తల్లితో మాట్లాడటానికి తపించిపోయే ఆ పసిహృదయం... తనలోని ఆలోచనలు... అ లాంటి హృదయానికి ఊరట ఇంకో పసిహదయం. అది తనపై చూపిన ప్రేమ, కరుణ లెక్కలేనిది. ఇలాంటి పరిసరాలనుండి మళ్లీ మరొక పల్లెకు వెళ్లడం... ఇలాంటి దృక్పథంతో సాగుతుంది ఈ కథ. దాని తరువాత భాగం అపరాజితుడు.

అపరాజితుడు:
ఆ బాలుడు చదువుకునే వయస్సులో ఎలా పురోహితుడిగా మారాడో, ఏ పరిస్థితుల్లో అ లా చేయవలసి వచ్చిందో, మళ్లీ తల్లిని ఒప్పించి బడిలో చేరి స్కాలర్‌షిప్పు ఎలా సంపాదించాడో, దానితో పై చదువుకు కలకత్తా వచ్చి తన చదువును ఎలా కొనసాగించాడో తెలిపేదే ఈ రచన. ఒక్కపూట భోజనంతో, చాలీ చాలని డబ్బుతో జీవితం గడుపుతాడు. అప్పుడప్పుడు తన తల్లిని చూసివస్తూ మళ్లీ అదే జీవనంలోకి అడుగుపెడ్తుంటాడు. తన స్నేహితుడి మరణం, తన తల్లి మరణం అతని హృదయంలో ఒక మచ్చలాగా తయారయ్యింది. అనుకోకుండా అతనికి పెళ్లి అవుతుంది. తన భార్య తనకిచ్చిన ఆనందం మళ్లీ ఆమె చావుతో పోతుంది. తన నెలల కొడుకుని చూసి వచ్చి మళ్లీ తన ప్రయాణం కొనసాగిస్తాడు. తిరిగి కొడుకు దగ్గరకు వచ్చి తనతోపాటు తీసుకుని వెళ్తాడు. మళ్లీ నిశ్చిందపురానికి వెళ్లడం అక్కడ తను అనుభవించిన అనుభూతి తన కొడుకు కూడా అనుభవించాలనుకుంటాడు. వాడు కూడా తండ్రిలాగా బాల్యాన్ని ఆనందిస్తూ వాళ్ల పూర్వీకుల ఊర్లో ఎలా ఉన్నాడో వివరించేదే ఈ రచన.
.............................................................................................................................................-సెలవు
........................................................................................................................................26 12 2012



No comments:

Post a Comment

హైదరాబాద్‌ బుక్‌ ట్రస్ట్‌