Friday, December 28, 2012

భంగ్యా భుక్యా రచన "నిజాం పాలనలో లంబాడాలు" పై జనవరి 5 న లామకాన్ లొ చర్చా గోష్టి ...

భంగ్యా భుక్యా రచన "నిజాం పాలనలో లంబాడాలు" పై జనవరి 5 న లామకాన్ లొ చర్చా గోష్టి



Hyderabad Book Trust
welcomes you to the book release of Nizam Palanalo Lambadalu.


Dr. Bhangya Bhukya ‘s much acclaimed book, Subjugated Nomads: The Lambadas under the rule of the Nizams is now brought out in Telugu as Nizam Palanalo Lambadalu.

While tracing the social history of the Lambada community, the book has interesting discussions on the deployment of colonial political rationality, introduction of new market, land enclosure, criminalisation of bodies, rule of property and emergence of a new community consciousness in Hyderabad State.

The book will be released on the occasion and followed by a discussion by  
Prof. I. Tirumali of Delhi University,  
Prof. Kalpana Kannabiran, Council for Social Development, Hyderabad,  
K. Srinivas, Editor Andhra Jyoti and
Tejawath Bellaiah Naik, social activist.

    
January 05, 2013 
5:30 PM 
Saturday
at Lamakaan, 

Rd No 1, Banjara Hills, 
lane opp GVK Mall (ph 9642731329)





బిభూతి భూషణ్ బంధోపాధ్యాయ రచనలపై కందుకూరి సెలవు సమీక్ష

బిభూతి భూషణ్‌ బంధోపాధ్యాయ రాసిన ''పథేర్‌ పాంచాలి'', ''అపరాజితుడు'' నవలల్ని చదివిన కందుకూరి రమేష్‌ బాబు గారి కుమార్తె 'సెలవు' వాటిపై తన స్పందనను అక్షరబద్ధం చేసింది. మీరూ చదవండి:

ప్రస్తుతం సెలవు (పేరు విలక్షణంగా వుంది కదూ) తొమ్మిదో తరగతి చదువుతోంది. తను మంచి సాహిత్యాభిమానే కాదు అద్భుతమైన ఆర్టిస్ట్ కూడా. ఇటీవల 'మంచి పుస్తకం' వాళ్లు ప్రచురించిన పిల్లల పుస్తకాలకు కొన్ని బొమ్మలను, ముఖచిత్రాలను వేసింది.

హైదరాబాద్‌ బుక్‌ ట్రస్ట్‌ పుస్తకాలపై మీరు కూడా సమీక్షలు రాసి పంపిస్తే మా బ్లాగులో పొందుపరుస్తాం. అందరికీ ఇదే మా ఆహ్వానం. 
 

పథేర్‌ పాంచాలి:
ఒక రెండు పసి హృదయాలు ఈ లోకాన్ని ఎలాంటి దృక్పథంతో చూసారో తెలిపేదే ఈ రచన. వాళ్లు పచ్చని పొలాలలో ఎలా ఆడుకున్నారో వివరిస్తుంది. చిన్న చిన్న వస్తువులనే ఆశ్చర్యంతో చూసే చిన్న పిల్లలు ఒక వింత వస్తువు, భూమి మీద ఎన్నడూ లేని వస్తువు వాళ్ల కళ్లముందుకు వస్తే ఎలా ఎదుర్కొన్నారో ఈ రచనలో చెప్పారు. ఇళ్లు గడవడానికి తల్లిదండ్రులు ఎంతో శ్రమపడుతుంటారు. చిన్న చిన్న దొంగతనాలతో సరిపెట్టుకునే పసి హృదయం. అ లాంటి సంఘటనలు. ఆ పసివాడు తన సోదరి చావును ఎలా ఎదుర్కొన్నాడో దాన్ని ఎలా జీర్ణించుకున్నాడో తెలిపేది. తన ఊరిని వదిలి వెళ్లలేకపోవడం. ఆ పొలాలతో చెట్లతో పుట్టలతో తనకు ఏర్పడిన అనబంధం. వేరే ఊరికి వెళ్లికూడా తనలో తన ఊరికి వున్న స్థానం ఎన్నటికీ చెరిగిపోనిది. క్రమంగా వాళ్ల నాన్న ఆరోగ్యం క్షీణిస్తుంది. తర్వాత ఆయన మరణిస్తాడు. తన తల్లి ఆ అబ్బాయిని ఎలా పెంచిందో... తను పడ్డ కష్టాలు చెప్పలేనివి. తన తల్లితో మాట్లాడటానికి తపించిపోయే ఆ పసిహృదయం... తనలోని ఆలోచనలు... అ లాంటి హృదయానికి ఊరట ఇంకో పసిహదయం. అది తనపై చూపిన ప్రేమ, కరుణ లెక్కలేనిది. ఇలాంటి పరిసరాలనుండి మళ్లీ మరొక పల్లెకు వెళ్లడం... ఇలాంటి దృక్పథంతో సాగుతుంది ఈ కథ. దాని తరువాత భాగం అపరాజితుడు.

అపరాజితుడు:
ఆ బాలుడు చదువుకునే వయస్సులో ఎలా పురోహితుడిగా మారాడో, ఏ పరిస్థితుల్లో అ లా చేయవలసి వచ్చిందో, మళ్లీ తల్లిని ఒప్పించి బడిలో చేరి స్కాలర్‌షిప్పు ఎలా సంపాదించాడో, దానితో పై చదువుకు కలకత్తా వచ్చి తన చదువును ఎలా కొనసాగించాడో తెలిపేదే ఈ రచన. ఒక్కపూట భోజనంతో, చాలీ చాలని డబ్బుతో జీవితం గడుపుతాడు. అప్పుడప్పుడు తన తల్లిని చూసివస్తూ మళ్లీ అదే జీవనంలోకి అడుగుపెడ్తుంటాడు. తన స్నేహితుడి మరణం, తన తల్లి మరణం అతని హృదయంలో ఒక మచ్చలాగా తయారయ్యింది. అనుకోకుండా అతనికి పెళ్లి అవుతుంది. తన భార్య తనకిచ్చిన ఆనందం మళ్లీ ఆమె చావుతో పోతుంది. తన నెలల కొడుకుని చూసి వచ్చి మళ్లీ తన ప్రయాణం కొనసాగిస్తాడు. తిరిగి కొడుకు దగ్గరకు వచ్చి తనతోపాటు తీసుకుని వెళ్తాడు. మళ్లీ నిశ్చిందపురానికి వెళ్లడం అక్కడ తను అనుభవించిన అనుభూతి తన కొడుకు కూడా అనుభవించాలనుకుంటాడు. వాడు కూడా తండ్రిలాగా బాల్యాన్ని ఆనందిస్తూ వాళ్ల పూర్వీకుల ఊర్లో ఎలా ఉన్నాడో వివరించేదే ఈ రచన.
.............................................................................................................................................-సెలవు
........................................................................................................................................26 12 2012



Thursday, December 13, 2012

పంచతంత్రం (నవల) రచన: బొజ్జా తారకం ...

పంచతంత్రం (నవల)  రచన: బొజ్జా తారకం ...

కారంచేడు (1985) నుంచి లక్ష్మింపేట (2012) వరకూ దళిత ఉద్యమాలలో కీలకపాత్రవహిస్తూ న్యాయపోరాటాలు చేస్తూ రాజకీయ సామాజిక రంగాలను ప్రభావితం చేస్తున్న రచయిత బొజ్జా తారకం కలం నుంచి రూపుదిద్దుకున్న ఈ నవల అట్టడుగు వర్గాల బాధామయ జీవితాలకు దర్పణం పడుతుంది.

కారంచేడులో అగ్రవర్ణాలవారు దళితులపై సాగించిన అమానుష మారణకాండకు నిరసనగా 1984లోనే బొజ్జాతారకం గారు హైకోర్టులో గవర్నమెంట్‌ ప్లీడర్‌ ఉద్యోగానికి రాజినామా చేశారు. ఆ తరువాత ఆంధ్రప్రదేశ్‌ దళిత మహాసభ సహవ్యవస్థాపకుడిగా దళితుల నిరసనోద్యమానికి దశాబ్దకాలంపాటు వెన్నుదన్నుగా నిలిచారు. అగ్రకుల దౌష్ట్యానికీ, వర్గ దోపిడీకీ గురయ్యే ప్రజల పక్షాన రాజీలేని పోరాటం సాగించే ఆయన ఇప్పటికీ దళితులను సంఘటితపరిచే కార్యక్రమాలకే తన పూర్తికాలాన్ని వెచ్చిస్తున్నారు.

భారత రిపబ్లికన్‌ పార్టీకి రాష్ట్ర అధ్యక్షులుగా కూడా పనిచేస్తున్నారు. మానవ హక్కుల ఉద్యమాల్లో ఎంతో క్రియాశీలంగా పాల్గొంటున్నారు. రాజకీయ నాయకుడిగానే కాకుండా రచయితగా కూడా ఆయనకు మంచి పేరుంది. వీరి రచనల్లో ''పోలీసులు అరెస్టు చేస్తే'', ''కులం-వర్గం'', ''నది పుట్టిన గొంతుక'', ''నేల నాగలి మూడెద్దులు'', ''దళితులు-రాజ్యం'' ప్రముఖమైనవి.

పంచతంత్రం నవల గురించి రచయిత మాటల్లోనే ...

'' ఈనవల ఇలా సాగుతుందని నేనెప్పుడూ అనుకోలేదు. ఇలా రాయాలనీ అనుకోలేదు. ఈయీ పాత్రలు, ఈయీ సన్నివేశాలు ఉండాలనీ అనుకోలేదు. ముగింపు ఇలా ఉండాలనీ అనుకోలేదు. వరదపొంగులా అది అ లా సాగిపోయింది. నవల ఇలా మొదలుపెట్టాలని మాత్రం అనుకున్నాను. అంతే. ఆ తర్వాత నా చేతుల్లో లేపోయింది.

పాత్రలు, సన్నివేశాలు, అ లా అ లా అనుకోకుండా సాగిపోయాయి. హఠాత్తుగా తెరమీదికి అనుకోని వ్యక్తులు వచ్చినట్టు చాలా పాత్రలు నవలలోకి వచ్చేశాయి. చెప్పాపెట్టకుండా బంధువులు ఇంటికి వచ్చినట్టు, తలుపు తోసుకుని లోపలికి వచ్చినట్టు ఈ పాత్రలు వచ్చేశాయి. నాకే ఆశ్చర్యం వేసింది, ఎలా వచ్చాయా అని. అయితే అన్నీ నాకు తెలిసిన పాత్రలే కాబట్టి వాళ్ల చుట్టూ, వాళ్లతో కథ అ ల్లుకుపోయాను. ఒక జీవితానికి సంబంధించిన కథ కాదిది. వేలాది, లక్షలాది జీవితాలకు సంబంధించిన గాధ, వేదన, ఆవేశం, ఆకాంక్ష. నలభై ఏళ్లుగా రాయాలనుకున్న నవల....

ఇందులోని సంఘటనలు అన్నీ గొప్పవి. సన్నివేశాలూ పాత్రలూ అంతే. అయితే వాటిని నేను పూర్తిగా చిత్రీకరించలేకపోతే లోపం నాది, పాత్రలది కాదు. ఈ పాత్రలన్నీ మనముందే తిరుగుతున్నాయి. ...''



పంచతంత్రం (నవల)
రచన: బొజ్జా తారకం
290 పేజీలు, వెల: రూ.100/-




ప్రతులకు, వివరాలకు:
హైదరాబాద్‌ బుక్‌ ట్రస్ట్‌
ప్లాట్‌ నెం. 85, బాలాజీనగర్‌, గుడిమల్కాపూర్‌,
హైదరాబాద్‌ - 500 006.

ఫోన్‌ నెం. 040-2352 1849

ఇమెయిల్‌:  hyderabadbooktrust@gmail.com

Wednesday, December 5, 2012

నిర్జన వారధి కాదు నిరంతర జన వారధి - లంకా పాపిరెడ్డి ...


....
మొదట్లో ఈ పుస్తకానికి "నిర్జన వారధి" అని ఎందుకు పేరు పెట్టారు? అనిపించింది. 
మరికొన్ని పేజీలు  చదివిన తరువాత అసలు ఈ పుస్తకానికి "నిరంతర ప్రవాహం" అని పేరు పెట్టాల్సింది అనిపించింది. 
కొండపల్లి కోటేశ్వరమ్మ గారికి సంస్కరణోద్యమం, జాతీయోద్యమం, విప్లవోద్యమంతో సంబంధం ఉండడమే కాదు "నేను ఎప్పుడూ ఉద్యమాలకు దూరంగా ఉండలేదు. ఇక ఉండబోను కూడా అని 92 సంవత్సరాల వయసులో కోటేశ్వరమ్మ చెబుతున్నప్పుడు ఆమె ఆత్మ కథ "నిర్జన వారధి" ఎలా అవుతుంది?

- లంకా పాపిరెడ్డి 
(నమస్తే తెలంగాణా, 05 డిసెంబర్ 2012 సౌజన్యంతో)


హైదరాబాద్‌ బుక్‌ ట్రస్ట్‌