Friday, December 28, 2012

భంగ్యా భుక్యా రచన "నిజాం పాలనలో లంబాడాలు" పై జనవరి 5 న లామకాన్ లొ చర్చా గోష్టి ...

భంగ్యా భుక్యా రచన "నిజాం పాలనలో లంబాడాలు" పై జనవరి 5 న లామకాన్ లొ చర్చా గోష్టి



Hyderabad Book Trust
welcomes you to the book release of Nizam Palanalo Lambadalu.


Dr. Bhangya Bhukya ‘s much acclaimed book, Subjugated Nomads: The Lambadas under the rule of the Nizams is now brought out in Telugu as Nizam Palanalo Lambadalu.

While tracing the social history of the Lambada community, the book has interesting discussions on the deployment of colonial political rationality, introduction of new market, land enclosure, criminalisation of bodies, rule of property and emergence of a new community consciousness in Hyderabad State.

The book will be released on the occasion and followed by a discussion by  
Prof. I. Tirumali of Delhi University,  
Prof. Kalpana Kannabiran, Council for Social Development, Hyderabad,  
K. Srinivas, Editor Andhra Jyoti and
Tejawath Bellaiah Naik, social activist.

    
January 05, 2013 
5:30 PM 
Saturday
at Lamakaan, 

Rd No 1, Banjara Hills, 
lane opp GVK Mall (ph 9642731329)





బిభూతి భూషణ్ బంధోపాధ్యాయ రచనలపై కందుకూరి సెలవు సమీక్ష

బిభూతి భూషణ్‌ బంధోపాధ్యాయ రాసిన ''పథేర్‌ పాంచాలి'', ''అపరాజితుడు'' నవలల్ని చదివిన కందుకూరి రమేష్‌ బాబు గారి కుమార్తె 'సెలవు' వాటిపై తన స్పందనను అక్షరబద్ధం చేసింది. మీరూ చదవండి:

ప్రస్తుతం సెలవు (పేరు విలక్షణంగా వుంది కదూ) తొమ్మిదో తరగతి చదువుతోంది. తను మంచి సాహిత్యాభిమానే కాదు అద్భుతమైన ఆర్టిస్ట్ కూడా. ఇటీవల 'మంచి పుస్తకం' వాళ్లు ప్రచురించిన పిల్లల పుస్తకాలకు కొన్ని బొమ్మలను, ముఖచిత్రాలను వేసింది.

హైదరాబాద్‌ బుక్‌ ట్రస్ట్‌ పుస్తకాలపై మీరు కూడా సమీక్షలు రాసి పంపిస్తే మా బ్లాగులో పొందుపరుస్తాం. అందరికీ ఇదే మా ఆహ్వానం. 
 

పథేర్‌ పాంచాలి:
ఒక రెండు పసి హృదయాలు ఈ లోకాన్ని ఎలాంటి దృక్పథంతో చూసారో తెలిపేదే ఈ రచన. వాళ్లు పచ్చని పొలాలలో ఎలా ఆడుకున్నారో వివరిస్తుంది. చిన్న చిన్న వస్తువులనే ఆశ్చర్యంతో చూసే చిన్న పిల్లలు ఒక వింత వస్తువు, భూమి మీద ఎన్నడూ లేని వస్తువు వాళ్ల కళ్లముందుకు వస్తే ఎలా ఎదుర్కొన్నారో ఈ రచనలో చెప్పారు. ఇళ్లు గడవడానికి తల్లిదండ్రులు ఎంతో శ్రమపడుతుంటారు. చిన్న చిన్న దొంగతనాలతో సరిపెట్టుకునే పసి హృదయం. అ లాంటి సంఘటనలు. ఆ పసివాడు తన సోదరి చావును ఎలా ఎదుర్కొన్నాడో దాన్ని ఎలా జీర్ణించుకున్నాడో తెలిపేది. తన ఊరిని వదిలి వెళ్లలేకపోవడం. ఆ పొలాలతో చెట్లతో పుట్టలతో తనకు ఏర్పడిన అనబంధం. వేరే ఊరికి వెళ్లికూడా తనలో తన ఊరికి వున్న స్థానం ఎన్నటికీ చెరిగిపోనిది. క్రమంగా వాళ్ల నాన్న ఆరోగ్యం క్షీణిస్తుంది. తర్వాత ఆయన మరణిస్తాడు. తన తల్లి ఆ అబ్బాయిని ఎలా పెంచిందో... తను పడ్డ కష్టాలు చెప్పలేనివి. తన తల్లితో మాట్లాడటానికి తపించిపోయే ఆ పసిహృదయం... తనలోని ఆలోచనలు... అ లాంటి హృదయానికి ఊరట ఇంకో పసిహదయం. అది తనపై చూపిన ప్రేమ, కరుణ లెక్కలేనిది. ఇలాంటి పరిసరాలనుండి మళ్లీ మరొక పల్లెకు వెళ్లడం... ఇలాంటి దృక్పథంతో సాగుతుంది ఈ కథ. దాని తరువాత భాగం అపరాజితుడు.

అపరాజితుడు:
ఆ బాలుడు చదువుకునే వయస్సులో ఎలా పురోహితుడిగా మారాడో, ఏ పరిస్థితుల్లో అ లా చేయవలసి వచ్చిందో, మళ్లీ తల్లిని ఒప్పించి బడిలో చేరి స్కాలర్‌షిప్పు ఎలా సంపాదించాడో, దానితో పై చదువుకు కలకత్తా వచ్చి తన చదువును ఎలా కొనసాగించాడో తెలిపేదే ఈ రచన. ఒక్కపూట భోజనంతో, చాలీ చాలని డబ్బుతో జీవితం గడుపుతాడు. అప్పుడప్పుడు తన తల్లిని చూసివస్తూ మళ్లీ అదే జీవనంలోకి అడుగుపెడ్తుంటాడు. తన స్నేహితుడి మరణం, తన తల్లి మరణం అతని హృదయంలో ఒక మచ్చలాగా తయారయ్యింది. అనుకోకుండా అతనికి పెళ్లి అవుతుంది. తన భార్య తనకిచ్చిన ఆనందం మళ్లీ ఆమె చావుతో పోతుంది. తన నెలల కొడుకుని చూసి వచ్చి మళ్లీ తన ప్రయాణం కొనసాగిస్తాడు. తిరిగి కొడుకు దగ్గరకు వచ్చి తనతోపాటు తీసుకుని వెళ్తాడు. మళ్లీ నిశ్చిందపురానికి వెళ్లడం అక్కడ తను అనుభవించిన అనుభూతి తన కొడుకు కూడా అనుభవించాలనుకుంటాడు. వాడు కూడా తండ్రిలాగా బాల్యాన్ని ఆనందిస్తూ వాళ్ల పూర్వీకుల ఊర్లో ఎలా ఉన్నాడో వివరించేదే ఈ రచన.
.............................................................................................................................................-సెలవు
........................................................................................................................................26 12 2012



Thursday, December 13, 2012

పంచతంత్రం (నవల) రచన: బొజ్జా తారకం ...

పంచతంత్రం (నవల)  రచన: బొజ్జా తారకం ...

కారంచేడు (1985) నుంచి లక్ష్మింపేట (2012) వరకూ దళిత ఉద్యమాలలో కీలకపాత్రవహిస్తూ న్యాయపోరాటాలు చేస్తూ రాజకీయ సామాజిక రంగాలను ప్రభావితం చేస్తున్న రచయిత బొజ్జా తారకం కలం నుంచి రూపుదిద్దుకున్న ఈ నవల అట్టడుగు వర్గాల బాధామయ జీవితాలకు దర్పణం పడుతుంది.

కారంచేడులో అగ్రవర్ణాలవారు దళితులపై సాగించిన అమానుష మారణకాండకు నిరసనగా 1984లోనే బొజ్జాతారకం గారు హైకోర్టులో గవర్నమెంట్‌ ప్లీడర్‌ ఉద్యోగానికి రాజినామా చేశారు. ఆ తరువాత ఆంధ్రప్రదేశ్‌ దళిత మహాసభ సహవ్యవస్థాపకుడిగా దళితుల నిరసనోద్యమానికి దశాబ్దకాలంపాటు వెన్నుదన్నుగా నిలిచారు. అగ్రకుల దౌష్ట్యానికీ, వర్గ దోపిడీకీ గురయ్యే ప్రజల పక్షాన రాజీలేని పోరాటం సాగించే ఆయన ఇప్పటికీ దళితులను సంఘటితపరిచే కార్యక్రమాలకే తన పూర్తికాలాన్ని వెచ్చిస్తున్నారు.

భారత రిపబ్లికన్‌ పార్టీకి రాష్ట్ర అధ్యక్షులుగా కూడా పనిచేస్తున్నారు. మానవ హక్కుల ఉద్యమాల్లో ఎంతో క్రియాశీలంగా పాల్గొంటున్నారు. రాజకీయ నాయకుడిగానే కాకుండా రచయితగా కూడా ఆయనకు మంచి పేరుంది. వీరి రచనల్లో ''పోలీసులు అరెస్టు చేస్తే'', ''కులం-వర్గం'', ''నది పుట్టిన గొంతుక'', ''నేల నాగలి మూడెద్దులు'', ''దళితులు-రాజ్యం'' ప్రముఖమైనవి.

పంచతంత్రం నవల గురించి రచయిత మాటల్లోనే ...

'' ఈనవల ఇలా సాగుతుందని నేనెప్పుడూ అనుకోలేదు. ఇలా రాయాలనీ అనుకోలేదు. ఈయీ పాత్రలు, ఈయీ సన్నివేశాలు ఉండాలనీ అనుకోలేదు. ముగింపు ఇలా ఉండాలనీ అనుకోలేదు. వరదపొంగులా అది అ లా సాగిపోయింది. నవల ఇలా మొదలుపెట్టాలని మాత్రం అనుకున్నాను. అంతే. ఆ తర్వాత నా చేతుల్లో లేపోయింది.

పాత్రలు, సన్నివేశాలు, అ లా అ లా అనుకోకుండా సాగిపోయాయి. హఠాత్తుగా తెరమీదికి అనుకోని వ్యక్తులు వచ్చినట్టు చాలా పాత్రలు నవలలోకి వచ్చేశాయి. చెప్పాపెట్టకుండా బంధువులు ఇంటికి వచ్చినట్టు, తలుపు తోసుకుని లోపలికి వచ్చినట్టు ఈ పాత్రలు వచ్చేశాయి. నాకే ఆశ్చర్యం వేసింది, ఎలా వచ్చాయా అని. అయితే అన్నీ నాకు తెలిసిన పాత్రలే కాబట్టి వాళ్ల చుట్టూ, వాళ్లతో కథ అ ల్లుకుపోయాను. ఒక జీవితానికి సంబంధించిన కథ కాదిది. వేలాది, లక్షలాది జీవితాలకు సంబంధించిన గాధ, వేదన, ఆవేశం, ఆకాంక్ష. నలభై ఏళ్లుగా రాయాలనుకున్న నవల....

ఇందులోని సంఘటనలు అన్నీ గొప్పవి. సన్నివేశాలూ పాత్రలూ అంతే. అయితే వాటిని నేను పూర్తిగా చిత్రీకరించలేకపోతే లోపం నాది, పాత్రలది కాదు. ఈ పాత్రలన్నీ మనముందే తిరుగుతున్నాయి. ...''



పంచతంత్రం (నవల)
రచన: బొజ్జా తారకం
290 పేజీలు, వెల: రూ.100/-




ప్రతులకు, వివరాలకు:
హైదరాబాద్‌ బుక్‌ ట్రస్ట్‌
ప్లాట్‌ నెం. 85, బాలాజీనగర్‌, గుడిమల్కాపూర్‌,
హైదరాబాద్‌ - 500 006.

ఫోన్‌ నెం. 040-2352 1849

ఇమెయిల్‌:  hyderabadbooktrust@gmail.com

Wednesday, December 5, 2012

నిర్జన వారధి కాదు నిరంతర జన వారధి - లంకా పాపిరెడ్డి ...


....
మొదట్లో ఈ పుస్తకానికి "నిర్జన వారధి" అని ఎందుకు పేరు పెట్టారు? అనిపించింది. 
మరికొన్ని పేజీలు  చదివిన తరువాత అసలు ఈ పుస్తకానికి "నిరంతర ప్రవాహం" అని పేరు పెట్టాల్సింది అనిపించింది. 
కొండపల్లి కోటేశ్వరమ్మ గారికి సంస్కరణోద్యమం, జాతీయోద్యమం, విప్లవోద్యమంతో సంబంధం ఉండడమే కాదు "నేను ఎప్పుడూ ఉద్యమాలకు దూరంగా ఉండలేదు. ఇక ఉండబోను కూడా అని 92 సంవత్సరాల వయసులో కోటేశ్వరమ్మ చెబుతున్నప్పుడు ఆమె ఆత్మ కథ "నిర్జన వారధి" ఎలా అవుతుంది?

- లంకా పాపిరెడ్డి 
(నమస్తే తెలంగాణా, 05 డిసెంబర్ 2012 సౌజన్యంతో)


Friday, November 30, 2012

వ్యథల గూడు ...


వ్యథల గూడు

అత్యంత సాధారణ భాష, భావజాలంతో ఒక క్రమగతిలో సాగే ఈ పదహారు కథల 'కథలగూడు'లో రచయిత దేవులపల్లి కృష్ణమూర్తి నింపాదిగా, స్థిమితంగా ఉండుండీ జీవితం మారుమూలల్లో దాగిన మానవీయ అంశాలపై అసాధారణ శక్తిగల సెర్చిలైటు వేసి, మస్తిష్కంలో వెలుగులు వెలిగిస్తాడు. ఆయా పాత్రల నిరాడంబరత్వాన్ని సాధారణమైన భాషలో పలికిస్తూ మెరుపులు మెరిపిస్తాడు.

డెబ్బై ఏళ్ళ జీవితంలో తనను వెంటాడిన జ్ఞాపకాలను, మధ్యతరగతి బతుకు వెతలను- ఒక బైరాగి తత్త్వాలను గానం చేసినట్టు కథలుగా పాడి పాఠకులకు వినిపిస్తాడు. ఒక దశలో రచయిత మాయమయ్యి ఒట్టి కథ పాఠకుడిలో అనుభూతై ధ్వనిస్తుంది. కథానంతర వ్యథ పాఠకుడి అంతరంగంలో మిగిలిపోతుంది. విస్తృతమైన రచయిత జీవితానుభవం ఈ కథలగూటిని అల్లే క్రమంలో ఒక మార్మికమైన శైలిని సాధించింది. ఆ శైలే పాఠకుణ్ణి ఈ కథలను చివరిదాకా చదివిస్తుంది. రచయితను సమూహ రచయితల నుంచి విడదీసి విభిన్నంగా నిలబెడుతుంది.

కృష్ణమూర్తి కథలు రెండు, మూడు దశాబ్దాల కాలపు వ్యక్తులనూ, సంఘటనలనూ పాఠకులకు పరిచయం చేస్తాయి. కొన్ని కథల్లో మాత్రం రచయిత వృత్తి అయిన రెవెన్యూ తత్త్వం తొంగి చూసి వాటిని వ్యాసాల్లా మార్చాయి. మొత్తం మీద ఈ సంపుటిలోని కథలన్నీ రచయిత నాస్టాల్జిక్ అనుభూతుల రూపాంతరాలే. దాచేస్తే దాగని చరిత్రకు కథాకృతులే. క్షణక్షణమూ 'సత్యం' చేసుకుంటున్న ఆత్మహత్యకు ఒణికిపోతున్న మానవీయ విషాదాంతాలే.
కేవలం పాఠకులే కాదు, కొత్తగా కథలు రాసే రచయితలూ, పాత రచయితలూ... ముగ్గురూ చదవతగ్గ కథలివి. సంఘటనలను కథలుగా ఎలా మలచాలో చెప్పే గైడ్ ఈ కథల (వ్యథల) గూడు.

- డి. లెనిన్ 

కథల గూడు, దేవులపల్లి కృష్ణమూర్తి
పేజీలు : 122, వెల : రూ. 60
ప్రతులకు : హైదరాబాద్ బుక్ ట్రస్ట్, బాలాజీ నగర్, గుడిమల్కాపూర్, హైదరాబాద్-06

ఆదివారం ఆంద్ర జ్యోతి 25 నవంబర్ 2012 సౌజన్యం తో ) 

Monday, November 19, 2012

ఆప్తమిత్రుల ప్రోద్బలమే 'నిర్జన వారధి' - త్వరలో ఆంగ్ల అనువాదం: కొండపల్లి కోటేశ్వరమ్మ ...


తన జీవితంలో ప్రతి సంఘటనను గుర్తుచేస్తూ రాసిన ''నిర్జన వారధి'' పుస్తకానికి ఎంతో ఆదరణ లభించిదనీ, ఇప్పటికే రెండు సార్లు ముద్రితమై మూడో ముద్రణ త్వరలో విడుదల కాబోతున్నదనీ పీపుల్స్‌వార్‌ అగ్రనేత కొండపల్లి సీతారామయ్య సతీమణి కొండపల్లి కోటేశ్వరమ్మ చెప్పారు.

విశాఖ నగరానికి చెందిన 'రైటర్స్‌ అకాడమీ', 'మహిళా చేతన' సంయుక్తంగా ఆదివారం పౌర గ్రంథాలయంలో ''నిర్జన వారధి'' పుస్తక పరిచయ కార్యక్రమాన్ని నిర్వహించింది. ఈ సందర్భంగా కోటేశ్వరమ్మకు ఆత్మీయ పురస్కారాన్ని ప్రదానం చేశారు.

నిర్జన వారధిపై ఆమె మాట్లాడుతూ, దీనిని ఆంగ్లంలోకి అనువదించడానికి కొంతమంది ముందుకొస్తున్నారని తెలిపారు. జీవితంలో అన్నీ పోగొట్టుకుని ఒంటరిగా ఉన్న సమయంలో ఆప్తమిత్రులు మహీధర రామ్మోహనరావు, పరకాల ప్రభాకర్‌, మానికొండ తదితరులు ఆత్మకథ రాయడానికి ప్రోత్సహించారని గుర్తుచేశారు.

కవియిత్రి విమల మాట్లాడుతూ అరుణ పతాకంపై కోటేశ్వరమ్మకు అచంచలమైన విశ్వాసం ఉందని చెప్పడానికి అనేక సంఘటనలు కళ్లకు కట్టినట్టు రాశారని కొనియాడారు. రచయిత్రి మల్లీశ్వరి మాట్లాడుతూ, నిర్జనవారధి పుస్తకం కోటేశ్వరమ్మ ఆత్మకథ కాదనీ, ఒక చారిత్రక గ్రంథమనీ పేర్కొన్నారు. 'మిత్రసాహితి' వర్మ మాట్లాడుతూ సాధారణంగా వచ్చిన ఆత్మకథలకు భిన్నంగా కోటేశ్వరమ్మ రాసిన 'నిర్జనవారధి' ఉందని అభిప్రాయపడ్డారు.

(ఆంధ్రజ్యోతి, 19-11-2012 సౌజన్యంతో)

Thursday, November 15, 2012

ప్రేమ్‌చంద్‌ సతీమణి శ్రీమతి శివరాణీదేవి రచన : '' ఇంట్లో ప్రేమ్‌చంద్‌ '' ...


ఇంట్లో ప్రేమ్‌చంద్‌


అన్ని మానవ సంబధాల్లోకి అతి సన్నిహితమైనదీ, ఎక్కువ కాలం కొనసాగేదీ భార్యాభర్తల అనుబంధం.
భర్త చనిపోయాక భార్య ఆయనతో తను పంచుకున్న జీవితం గురించి నిజాయితీగా రాయటమనేది భారతీయ సాహిత్యంలో చాలా అరుదుగా కనిపించే అంశం.
ఈ పుస్తకంలో శివరాణీదేవి ఆ పని చేసి చూపారు.
సంభాషణల ద్వారానూ, అక్కడక్కడా స్వగతంలాగానూ ఆమె రాసిన విషయాలవల్ల ప్రేమ్‌చంద్‌ తాలూకు గొప్పదనమే కాక, ఆమె గొప్పదనమూ, ప్రేమ్‌చంద్‌ని ఒక్కోసారి ముందుండి నడిపించిన ఆవిడ తెలివితేటలూ, ధైర్యమూ అనుకోకుండానే ఈ పుస్తక,లో మనకి కనిపిస్తాయి.
ప్రేమ్‌చంద్‌ గురించి తెలియని తెలుగు పాఠకులు అరుదు.
ఆయన వ్యక్తిగా ఎటువంటివారో తెలుసుకునేందుకు,
ఇంకా ముఖ్యంగా ఆయన భార్య శివరాణీదేవిలో ఎంత ప్రతిభ ఉందో తెలుసుకునేందుకు అందరూ ఈ పుస్తకాన్ని తప్పక చదవాలి.
..................
పాఠకుల ముందు ఈ పుస్తకాన్ని ఉంచటం వల్ల నాకు నా కర్తవ్యాన్ని నెరవేర్చానన్న తృప్తి కలుగుతోంది. ఈ పుస్తకం రాయటం వెనక ఆ మహా రచయిత కీర్తిని అందరికీ తెలియజేయాలన్నది నా ఉద్దేశం కాదు. చాలా మటుకు జీవిత చరిత్రల్లో జరిగేది అదే. ఈ పుస్తకంలో మీకు మా ఇంట్లో జరిగిన సంఘటనల జ్ఞాపకాలు కనిపిస్తాయి, వాటిలో ఆ మహా రచయిత వ్యక్తితం కనిపిస్తుంది. మానవత్వం దృష్ట్యా కూడా ఆయన ఎంత గొప్పవాడో, ఎంత విశాల హృదయుడో చెప్పేందుకే ఈ పుస్తకం రాశాను. ఇది చెప్పేందుకు నా కన్నా ఎక్కువ హక్కు మరెవరికీ లేదన్నది నా నమ్మకం.
........................................................... - శివరాణీదేవి ప్రేమ్‌చంద్‌
...........................
''ముసలి ఆవుని ముస్లింలు బలి ఇచ్చినప్పుడు రెండు పక్షాలవాళ్లూ కొట్టుకు చస్తారు. కానీ అదే ఇంగ్లీషువాళ్లు వందలకొద్దీ ఆవులనీ, దూడలనీ చంపినప్పుడు హిందువుల రక్తం కోపంతో మరిగిపోదేం? నువ్వే చెప్పు, మేకలని బలివ్వని దేవత గుడి ఉందా మన దేశంలో?
ఏ మతమూ పూర్తిగా మంచిదీ కాదు, చెడ్డదీ కాదు. ఆవుకోసం ప్రాణాలు ఇవ్వటానికి వెనకాడని ఆ హిందువులే తల్లిదండ్రులకి ఒక ముద్ద అన్నం పెట్టలేరు...''
........................................................ - ప్రేమ్‌చంద్‌
.........................................................................................................................
ఈ పుస్తకాన్ని అనువదించిన ఆర్‌. శాంతసుందరి విఖ్యాత రచయిత కొడవటిగంటి కుటుంబరావు కుమార్తె. 1947 ఏప్రిల్‌లో మద్రాసులో పుట్టారు. గత మూడు దశాబ్దాలుగా అనువాద రంగంలో కృషిచేస్తున్నారు. వీరివి ఇంతవరకూ హిందీ, తెలుగుభాషల్లో దాదాపు యాభై పుస్తకాలు ప్రచురణ పొందాయి. కవితలూ, కథలూ, నవలలూ, నాటికలే కాక వ్యక్తిత్వ వికాసానికి సంబంధించిన పుస్తకాలు కూడా అనువదించారు.
అనువాదాలకు గాను, భారతీయ భాషా పరిషద్‌ (న్యూఢిల్లీ), జాతీయ మానవహక్కుల సంస్థ (న్యూఢిల్లీ), పి.ఎస్‌. తెలుగు విశ్వవిద్యాలయం (హైదరాబాద్‌)ల నుంచి పురస్కారాలు అందుకున్నారు. ప్రస్తుతం హైదరాబాద్‌లో వుంటున్నారు.



ఇంట్లో ప్రేమ్‌చంద్‌

- శివరాణీదేవి ప్రేమ్‌చంద్‌

హిందీమూలం : ప్రేమ్‌చంద్‌ ఘర్‌మే, రోశనాయి ప్రకాశన్‌

తెలుగు అనువాదం: ఆర్‌. శాంతసుందరి

తొలి ముద్రణ : భూమిక మాస పత్రికలో జనవరి 2009 నుంచి జులై 2012 వరకు సీరియల్ గా.

పుస్తకం గా ప్రధమ ముద్రణ : సెప్టెంబర్ 2012

పేజీలు: 274, వెల: రూ.120/-



ప్రతులకు, వివరాలకు:

హైదరాబాద్‌ బుక్‌ట్రస్ట్‌,

ప్లాట్‌నెం. 85, బాలాజీ నగర్‌,

గుడిమల్కాపూర్‌, హైదరాబాద్‌ - 500006

ఫోన్‌ నెం. 04-23521849

ఇమెయిల్‌ ఐడి: hyderabadbooktrust@gmail.com


.

Monday, November 12, 2012

నిబద్ధ మహిళ జీవిత దర్పణం - తెలకపల్లి రవి - ప్రజాశక్తి ...



విప్లవోత్తేజాన్ని, విషాద గాంభీర్యాన్ని తనలో నిబిడీకృతం చేసుకున్న ఒక మాతృమూర్తి ఆర్ద్రగాధ ఇది.
నిబద్ధతకు మారుపేరుగా నిర్దయాత్మక జీవితానుభవాలను భరించిన నిండుకుండ నిజ జీవిత గాధ ఇది.

నిర్జన వారధి పేరిట వెలువడిన కొండపల్లి కోటేశ్వరమ్మ జ్ఞాపకాలు కళ్లను చెమరింపచేస్తాయి.
అదే సమయంలో పిడికిళ్లు బిగిసేలా చేస్తాయి.
ఆలోచించగలిగిన వారిలో అనేక ప్రశ్నలనూ రగిలిస్తాయి.
మిగిలిస్తాయి.
అందుకే ఇదొక అరుదైన ఆత్మకథ.
అంతు తెలియని వ్యథ.
ఆడవాళ్ల రొద.

కోటేశ్వరమ్మ బాల వితంతువుననే సంగతి తెలియకుండానే పెరిగారు.
తనకు తెలిసిన తర్వాత దీర్ఘంగా విచారించే అవసరం లేకుండా కమ్యూనిస్టు నేతల చొరవతో నాటి కృష్ణా జిల్లా పార్టీ కార్యదర్శి కొండపల్లి సీతారామయ్యను పెళ్లి చేసుకున్నారు.
కుటుంబాల పరమైన ప్రతికూలతలను అధిగమించి ఆశయబద్ధమైన అన్యోన్య జీవితంలో బాబు, పాపలను కన్నారు. ఆయన బలవంతంపైనే ప్రజా కళాకారిణిగా మారారు.
అదే సమయంలో అగ్ని పరీక్షల వంటి నిషేధాలు, నిర్బంధాలను చూశారు.
అతి దుర్భరమైన అజ్ఞాతంలో అష్టకష్టాలు పడుతూ అమ్మలా, అక్కలా అనేకమందిని ఆదుకున్నారు.
ఆడవాళ్లకన్నా మిన్నగా అజ్ఞాతంలో తనకు అనుపమ సేవలు చేసిన అన్నదమ్ములవంటి సహచరుల ఆత్మీయత చవిచూశారు.
అనుకోని రీతిలో సీతారామయ్య ఉద్యమానికే చెందిన మరో మహిళకు దగ్గరై తనకు దూరమవుతుంటే
భరించారు. ఈ క్రమంలో ..............................

మిగతా సమీక్ష .. ఇక్కడ ..చదవండి.

http://www.prajasakti.com/soundofsilence/article-401519

ప్రజాశక్తి దినపత్రిక 4 నవంబర్ 2012కి కృతజ్ఞలతో



.

Monday, November 5, 2012

If the people of Telangana wants... There is nothing wrong in giving a separate state - Kondapalli Koteshwaramma .



THE ETERNAL COMMUNIST
- Maa Sarma (The Hans India)

I was happy to remember and recall the contribution to the nation by my leaders Putchalapalli Sundaraiah and Chandra Rajeswar Rao. On hind sight,  I realised that my life was not a waste and that I contributed my mite meaningfully to the  Independence and communist movement of our country


Kondapalli Koteswaramma, who reminds us of the great women of the yore, is a multi-faceted personality. She fought for the country’s in-dependence from the foreign rule and later joined revolutionary communist movement along with stalwarts of her time for the welfare of the poor and down trodden. She made a mark as a writer and revolutionary leader on her own right, coming out of the shadow her husband, Seeta Ramaiah, the founder member of the Communist Party of India (Marxist-Leninist) who later headed the Peoples War Group. She spoke to the The Hans India exclusively about her travails and tragedies, her joys and sorrows, above all her experiences.

You have rich experience as a freedom fighter and a revolutionary leader after in-dependence. Can you share with us some of your experiences?

I had a happy childhood. I willingly and happily participated in Independ-ence movement and later revolutionary movement. I faced many difficulties and tragedies. I came out of the revolutionary movement and raised my children. But I never gave up on my ideals. My elders like Mahidhara Rammohan Rao, Cherukuri Rama Rao and friends like Parakala Pattabhi Rama Rao and Surya-vathi told me that I should record my ex-periences for the posterity. But I could not venture then as I was overwhelmed by the tears and travails that befell me. Re-cently, my granddaughter Anuradha and her friend Vasantha Lakshmi (senior journalists) persuaded me to write my memoirs as I am in the evening of my life.

You went through many tragedies. How did you feel when you recalled it while writing?

I had mixed feelings when I recalled events in my life. I was happy to remem-ber and recall the contribution to the na-tion by my leaders Putchalapalli Sundaraiah and Chandra Rajeswar Rao. On hind sight, I realised that my life was not a waste and that I contributed my mite meaningfully to the Independence and communist movement of our coun-try. Tears welled in my eyes when I re-called the tragedies and travails I went through. I was sad that my children could not know and appreciate my role in the movements. I cried when I recalled that I could not raise my children due to my pre-occupation with the movements. I experienced poverty and could not make both ends meet. At times, I was pes-simistic and thought that it was a waste to continue to live. I tried a couple of of times unsuccessfully to end my life. Putchalapalli Sundaraiah once told me that the country needed people who would not hurt its interests - “You never did any that harmed the country.” People like you should live until death comes your way. After that pep talk, my pes-simism vanished. With the same inspira-tion I started writing my memoirs at the age of 90.

Tell us about your happiest and beautiful moments in your life.

I was nine years when Mahatma Gandhi came to our village. Many women stood in long lines to give him their gold ornaments and money. I also joined them and removed ornaments from hands and ears and gave them to the Mahatma. I cherish that moment.

H ow was your childhood?

I had doting parents and led a happy, carefree childhood. We were a well-to-do family with servants. I was never required to do any household chores. I was a child widow. My father arranged tutors to teach me music and Puranas. Nagireddy, my paternal uncle, was a freedom fighter and he advised me that I should sing songs written by freedom fighter Garimella Satyanarayana who wrote in-spiring songs about India. I faced tough times only after I entered the freedom movement. Leaders like Sundaraiah and Rajeswara Rao, who were richer than us spent their wealth for the benefit of com-munist movement. I never felt sorry for selling my property and financially help-ing the movement. I always thought so-cialist state would be established and everybody would be happy in that society.

You were very close to Sundaraiah and Rajeswar Rao?

Yes. Rajeswara Rao arranged my mar-riage with Kondapalli Sitaramaiah at his house. Maddukuri Chandrasekhar Rao (Founder Editor of Visalaandhra daily) used treat me as her own sister. He was my literary and music mentor.

Another person who inspired us in those days was Atchamabha (A physi-cian and freedom fighter in Vijayawada. She was later elected as an MP from Vi-jayawada.). She inspired us to break the shackles of social restrictions and join the freedom movement. We used to march in the Vijayawada streets wearing khaki shorts and shirts. Some rowdies used to heckle us but they knew we had the sup-port of Atchamabha and the communist party.

Do you think the ancient Indian literature did not reflect the reality of the society?

Manusmriti did some disservice to the women. But some literature is there which eulogised the women. One exam-ple is Kalidasa’s Shakuntalam. When Vidhyavathi asked Kalidasa to write about Dushyanta, he refused to write as he left his wife in the forests and when she came to his royal court when she was pregnant, he refused to accept her. Then Vidhyavathi told him to write on Shakun-tala, he wrote Abhinava Shakuntalam. This episode was narrated widely. Manu Charithra got prominence and literature that did justice to women was ignored.

Sundaraiah and Rajeswar Rao were your mentors. How did you feel when they went separate ways?

When the Communist Party was split Rajeswara Rao and Sundaraiah headed separate parties. When I asked them about it, they said their differences were temporary and asked me not to bother about it. When Rajeswar Rao’s wife Sav-itrimma was ailing, I went to Sundara-iah’s wife and went to her to enquire about her health. Inspite of their differ-ences, you cannot suspect the motives of Rajeswar Rao and Sundaraiah. You can-not doubt their commitment to the cause of the people. They were noble people. I think good politics started with the com-munist parties.

Do you have any happy memories with Sitaramaiah?

Sitaramaiah inspired me. However, I went through difficulties because of my marriage with him. I never wanted to see him again. Because of him I lost my chil-dren. I lost my property. When he was bed-ridden, some elders like Kalavakuri Narayana Rao, Katragadda Narayana Rao and Mahidhara Ra-mamohan Rao told me that he wanted to see me. I refused. I told them, I cannot see a person who made me undergo un-told miseries. But they said he realised his mistakes and was repenting. I relented and went to see him. He broke down when he saw me. I met him after 20 years. I asked him why he was crying and told him that the tears in my eyes dried up for what he did to me and my chil-dren. I told him he was the main cause for my miseries. He cried again. I cried and made up with him. The element of woman in me may be the reason, I have forgiven him. It might be her strength or weakness, but the instinct of mother in a woman makes her unique.

What were your best moments with him?

He got me out of my house and mar-ried me. He spent happy moments. He sold his family property and spent that for the Party. I also spent the money after selling away my 50 sovereigns of gold I brought from my home. Because he was
good, I loved him and married him. We went through difficulties due to his party work. As long as I lived with him, I un-derwent the difficulties happily for the party and my children.

What led to your break up with him?

One comrade was killed in police fir-ing. His wife was suffering from epilepsy (fits). Sitaramaiah told me that the doc-tors said if she is looked after well, she will recover. I readily agreed and invited her to live with us. Soon after, I felt that Sitaramaiah developed aversion towards me. As she did not overcome fits, he ac-cused me of not giving adequate care to her, which was not true. One day she and Sitaramaiah said I was responsible for her leaving the house. Soon he started living with her. There were rumours that she was a wealthy women and Sitaramaiah had developed relationship with her. I complained to the party. The party con-ducted an inquiry and suspended him from the membership. I finally left him and started living on my own. He left me for a woman. I left everything came to him. I underwent difficulties along with him. But he thought that woman was more important than the party and me.

Do you think Sitaramaiah is a successful leader?

When he died nobody from his party came. I think life is like that. I went through difficulties and he left me. He spent best part of his life for the party. Three fourths of his life, he spent in jails, forests and underground.

Is there any memorable occasion during your underground life?

I spent underground life in Krishna district, Maharashtra and Orissa. I en-dured difficulties because I thought we were doing it for a cause. When I trav-elled in train, they used to send some am-munition along with my luggage. Of course they never told me.

You read Gurazada and Kandukuri. Have you ever read Chalam?

I read some of it. But we never took Chalam to the people. We used to distrib-ute and sell Gurazada, Kandukuri, Prem-chand, Tagore and Gorky Amma etc., not Chalam. At that time the society was not ready to accept him.

You participated in Telangana Armed struggle. What do you think of it?

I did not go to forests for Telangana armed struggle. But I co-operated from outside. When Sitaramaiah came out from jail after Telangana struggle, I went underground along with him.

Do you support separate Telangana state demand?

If the people of Telangana want it should be given. There is nothing wrong in giving a separate state.



(Courtesy : Sunday Hans, 4 November 2012)
 http://thehansindia.info/

Friday, November 2, 2012

"ఓ మనిషికి జీవితం ఇన్ని పరిక్షలు పెట్ట గలదా?" అనిపించింది ఆమె ఆత్మకథ చదువుతుంటే ..." నెమలి కన్ను " మురళి


నిర్జన వారధి

"ఓ మనిషికి జీవితం ఇన్ని పరిక్షలు పెట్ట గలదా?" అనిపించింది ఆమె ఆత్మకథ చదువుతుంటే. అంతకు మించి, వాటన్నింటినీ తట్టుకుని నిలబడ్డ ఆమె స్థైర్యం ఆశ్చర్యాన్ని కలిగించింది.

పుస్తకం ముగించి పక్కన పెడుతుంటే, తొంభై రెండేళ్ళ కొండపల్లి కోటేశ్వరమ్మ మూర్తి పర్వతమంత ఎత్తున కనిపించింది. మనసులో ఆమెకి నమస్కరించ కుండా ఉండలేక పోయాను.

ఈమధ్య కాలంలో మళ్ళీ మళ్ళీ చదివిన ఆ పుస్తకం పేరు 'నిర్జన వారధి.' లోతైన, బరువైన కథనం.. పుస్తకం పేరులాగే.

'నిర్జన వారధి' చదవక మునుపు నాకు తెలిసిన కోటేశ్వరమ్మ కమ్యూనిస్టు పార్టీ కార్యకర్త.
పార్టీలో కొంతకాలం పనిచేసి, తర్వాత నక్సల్బరీ ఉద్యమంలోకి వెళ్ళిన కొండపల్లి సీతారామయ్య భార్య.
ఈ రెండు పాత్రలూ ఆమె జీవితాన్ని ఎంతగా ప్రభావితం చేసి ఉంటాయో, ఎన్ని పరిక్షలు పెట్టి ఉంటాయో, ఎన్నెన్ని మలుపులు తిప్పి ఉంటాయో అన్న ఆలోచన ఎప్పుడూ కలగలేదు.
అందుకే కావొచ్చు, ఈ పుస్తకం ద్వారా నాకో సరికొత్త కోటేశ్వరమ్మ పరిచయం అయ్యారు.

ఇద్దరు పిల్లలు పుట్టాక, కట్టుకున్న భర్త కారణం చెప్పకుండా వదిలేసినా, ఏ పార్టీ కోసమైతే తను ప్రాణాలకి తెగించి బలవంతపు గర్భ స్రావానికి సిద్ధ పడిందో ఆ పార్టీయే తనని వదులుకునే పరిస్థితులు వచ్చినా, తోడు నిలబడాల్సిన పిల్లలు, అండగా నిలిచిన కన్నతల్లి ఒకరి తర్వాత ఒకరుగా తన కట్టెదుటే లోకాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోయినా...ఇవన్నీ తట్టుకుని నిలబడ్డమే కాదు, తనకంటూ ఓ జీవితాన్ని నిర్మించుకుని నిలదొక్కుకున్న మహిళ ఆమె.

.....

" నెమలి కన్ను " మురళి గారు నిర్జన వారధి పై చేసిన పూర్తి సమీక్ష కోసం ఈ కింది ఇమేజ్ పై క్లిక్ చేయండి. 
మురళి గారికి కృతజ్ఞతలతో ... 






.




Thursday, November 1, 2012

కొండపల్లి కోటేశ్వరమ్మ గారితో హెచ్. ఎం. టీ. వీ.ఇంటర్వ్యూ ...


అంతరంగం .శీర్షికన ..
29 అక్టోబర్ 2012 న ప్రసారమైన 
కొండపల్లి కోటేశ్వరమ్మ గారితో హెచ్. ఎం. టీ. వీ.ఇంటర్వ్యూ ... 
వీక్షించండి 



Sunday, October 21, 2012

మల్లు స్వరాజ్యం గారి ఉపన్యాసం ... కొండపల్లి కోటేశ్వరమ్మ ఆత్మకథ "నిర్జన వారధి " పుస్తక అవిహ్కరణ సభలో ...

మల్లు స్వరాజ్యం గారు 
1946 నాటి నిజాం ప్రభుత్వానికి, జమిందార్లకు, రజాకార్లకు వ్యతిరేకంగా సాగిన  
తెలంగాణా రైతాంగ సాయుధ పోరాటంలో పాల్గొన్నారు. 

ఆమె తలపై ప్రభుత్వం ఆనాడే పదివేల రూపాయల బహుమతిని ప్రకటించింది. 
ఏడు దశాబ్దాలుగా  కమ్యూనిస్ట్ రాజకీయాలతో పెనవేసుకుపోయిన జీవితం అమెది.

ఇటీవల  సెప్టెంబర్ 23 న మల్లు స్వరాజ్యం గారు హైదరాబాద్ లో 
కొండపల్లి కోటేశ్వరమ్మ ఆత్మ కథ "నిర్జన వారధి" పుస్తకాన్ని ఆవిష్కరించిన విషయం విదితమే

కమ్యూనిస్టు ఉద్యమం , స్త్రీల పాత్ర, చీలికలు పేలికలైన కమ్యూనిస్టు పార్టీల  ప్రస్తుత దయనీయ పరిస్థితి
మొదలైన అంశాలపై ఆరోజు  ఆమె ఎంతో ఆవేదనతో మాట్లాడారు.  

సంచలనాత్మకమైన ఆ  ఉపన్యాసం వీడియో ఇప్పుడు యూ ట్యూబ్ లో అందుబాటులో వుంది. 

.... ఇక్కడ ......   చూడండి.



.



Monday, October 15, 2012

వివేకానికో గీటురాయి... రీడింగ్ రూమ్ ...- మందలపర్తి కిషోర్...సాక్షి ...

వివేకానికో గీటురాయి

 బాలగోపాల్ చనిపోయి మూడేళ్ల యింది. ఈ మూడేళ్లలో ఆయన రచనలు - తెలుగులో - ఎనిమిది పుస్తకాలుగా వచ్చాయి. వాటిలో కొన్ని పత్రికలకు రాసిన వ్యాసాలు. కొన్ని కాలమ్స్. కొన్ని ముందుమాటలు. కొన్ని ఉపన్యాసాలు. కొన్ని కరపత్రాలు. కొన్ని సిద్ధాంత పత్రా లు. కొన్ని నివాళులు. కొన్ని జవాబులు. కొన్ని సంపాదకీయాలు. కొన్ని ఇంట ర్వ్యూలు. ఇన్ని ‘రచనా రూపాలు’ ప్రయత్నించిన రచయితలు బాలగోపాల్ సమకాలికుల్లో మరెవరూ లేరేమో! మత తత్వం, రాజ్యం-సంక్షేమం, హక్కుల ఉద్యమం, దళిత సమస్య, సాహిత్య పరామర్శ, మార్క్సిజం సమీక్ష-ఇలాంటి వస్తువులతో రాసినవీ రచనలు. అంటే, రూపంలోనూ సారంలోనూ కూడా బాలగోపాల్ రచనల్లో ఎంతో విస్తృతీ వైవిధ్యం కనిపిస్తుంది.

ఇవి దాదాపు మూడు దశాబ్దాల కాలంలో బాలగోపాల్ చేసిన రచనలు. ఈ కాలంలో ఆయన ఆలోచనల్లో వచ్చిన మార్పులన్నీ ఈ రచనల్లో ప్రతిఫలించాయి. ఈ మార్పుల్లో ైవైరుధ్యంలా అనిపించే వైవిధ్యం కనిపిస్తుంది. ఏకసూత్రతా ఉంది. మొదటినుంచీ ఆయన పనిచేసిన రంగం హక్కుల రంగం. మన దేశంలో ఈ రంగంలో ప్రధానంగా కేంద్రీకరించి పనిచేసినవాళ్లలో ఎక్కువమంది నక్సలైట్ ఉద్యమాన్ని అభిమానించే మేధావులు. ఎప్పుడో 1970 దశకంలోనే బొజ్జా తార కం, ప్రత్తిపాటి వెంకటేశ్వర్లు, కన్నబీరన్ తదితరులు ఈ కృషి మొదలుపెట్టారు. ఎనభయ్ దశకంలో బాలగోపాల్ ఈ రంగంలో మొదలుపెట్టిన కృషి కొత్తపుంతలు తొక్కింది.

చట్టాల ప్రకారం హక్కులను నిర్వచించి విశ్లేషించడం కాకుండా సామా జిక న్యాయం(ఇప్పటి వాడుక అర్థంలో కాదు-దాని అసలు అర్థంలో) ప్రాతిపది కగా బాలగోపాల్ హక్కుల గురించి మాట్లాడారు. దీన్నే తర్వాతి రోజుల్లో హక్కుల ఉద్యమానికి ఉండాల్సిన ‘తాత్విక దృక్పథం’గా ఆయన చెప్తుండేవారు. వ్యక్తిగతం గా-ఒంటరిగా మాత్రం కాదు- బాలగోపాల్ తీసుకొచ్చిన పెద్దమార్పు ఇదేనేమో!

ఇక, సాహిత్యరంగంలో కూడా బాలగోపాల్ చాలానే కృషి చేశారు. ‘సాహి త్యంమీద నేను రాసిన వ్యాసాలు సమగ్రమయిన సాహిత్య విమర్శ అని నేను అనుకోవడం లే’దన్నారు బాలగోపాల్. అంతేకాదు-ఆ వ్యాసాల్లో ఉన్నది ‘సామా జిక ఆర్థిక నేపథ్యంలో సాహిత్యాన్ని పరిశీలించడం’ మాత్రమేనని వివరించి, అదే సమగ్రమయిన మార్క్సిస్టు సాహిత్య విమర్శ కాబోదని కూడా స్పష్టం చేశారు. ఇలా చెప్పడంవల్ల బాలగోపాల్ తన పరిమితులను వెల్లడించడమే కాదు- మార్క్సిస్టు ముద్రాంకిత విమర్శకుల పరిమితులను సైతం బయటపెట్టారు.

కిందటివారం, బాలగోపాల్ వ్యాసాలు కొన్నింటిని ‘మనిషి మార్క్సిజం’ పేరుతో పుస్తకంగా విడుదల చేసింది పర్‌స్పెక్టివ్స్ సంస్థ. ఇందులో, 1993 సెప్టెంబర్ ‘అరుణతార’లో వచ్చిన ‘చరిత్ర, మనిషి, మార్క్సిజం’ అనే వ్యాసం ఉంది. దీన్ని చాలామంది చరిత్రాత్మక వ్యాసంగా పరిగణిస్తారు. కానీ, ఆ వ్యాసంలో బాలగోపాల్ కనిపెట్టి చెప్పిన విషయాలేం లేవు. తను కొత్తగా ఆ విషయాలు చెప్పడమే అందులోని కొత్తదనం. అలాగే, ‘కల్లోల చిత్రాలు’ వ్యాసం లోని విషయాలు కూడా. ఈ వ్యాసాల్లోని విషయాలు -బహుశా బాలగోపాల్ చెప్పిన కారణంగా- అపారమయిన ప్రాముఖ్యం సంతరించుకున్నాయి.
చివరిగా ఓ మాట- మతానికి వ్యతిరేకంగా వచ్చిన చాలా సిద్ధాంతాలు కొత్త మతాలుగా స్థిరపడడం చరిత్రలో చూస్తాం. ఉదాహరణకు బౌద్ధం.

ఇది, సంప్రదాయ విరుద్ధత (నాన్‌కన్‌ఫామిజం), సంప్రదాయ విధేయత (కన్‌ఫా మిజం)గా మారడం మాత్రమే. మార్క్సిజం శాస్త్రమని, దాన్ని విశ్వసించేవాళ్లు చెప్తారు. ఏ శాస్త్రమయినా ప్రశ్నల పునాదిమీద పెరిగిపెద్దవుతుంది. స్వయంగా మార్క్సే అన్నిటినీ ప్రశ్నించమని చెప్పాడట. కానీ, మార్క్సిస్టు ప్రతిపాదనల విషయంలో ఆత్మవిమర్శకు ప్రయత్నించేవారిని మార్క్సిస్టు విశ్వాసులు ప్రశంసించరు. పెపైచ్చు అభిశంసిస్తారు కూడా. బాలగోపాల్ విషయంలో అదే జరిగింది. ఆయన చనిపోయి మూడేళ్లయింది. కానీ, కామన్‌సెన్స్ ప్రాతిపదికగా బాలగోపాల్ లేవనెత్తిన ప్రశ్నలను నక్సలైట్లూ, తదితర గోత్రికులయిన మార్క్సిస్టులు -అప్పట్లో- సరయిన స్పిరిట్‌లో తీసుకున్న దాఖలాలు కనిపించవు. ఇప్పటికయినా ఈ విషయంలో మార్పు వచ్చిందేమో పరిశీలించాలి. ఆ పరిశీలనకు బాలగోపాల్ రచనలు గీటురాళ్లుగా ఉపయోగపడతాయి.

- మందలపర్తి కిషోర్

( సాక్షి దినపత్రిక 15 10 2012 సౌజన్యం తో )





* 1. మనిషి-మార్క్సిజం, పే.168, వెల రూ.100/- దళిత / పే.209, వెల రూ.120/- 

2. రాజ్యం - సంక్షేమం / పే.161, వెల రూ.100/-

పర్‌స్పెక్టివ్, ఫ్లాట్ నం.305, ఇ.నం.2-2-647/182/ఎ3, హిమశివ అపార్ట్‌మెంట్స్ / బాగ్ అంబర్‌పేట, హైదరాబాద్-13.


* 3. సాహిత్యంపై బాలగోపాల్ పే.339, వెల రూ.150/- /

4. మతతత్వంపై బాలగోపాల్ / పే.302, వెల రూ.150/-

 హైదరాబాద్ బుక్‌ట్రస్ట్, ఫ్టాట్ నం.85, బాలాజీ నగర్, గుడిమల్కాపూర్, హైదరాబాద్-67


* 5. నిగాహ్,  పే.407, వెల రూ.200/-

 ప్రజాతంత్ర కార్యాలయం, ఫ్లాట్ నం.1, ఇండస్ట్రియల్ పార్క్, ఐడీఏ, ఉప్పల్, హైదరాబాద్-39


* 6. హక్కుల ఉద్యమం - తాత్విక దృక్పథం / రూ.100/-  / నవోదయ, దిశ.


* 7. ఆ శిక్షే ఒక నేరం /  పే.88, వెల రూ.30/- ప్రజాశక్తి, నవోదయ.


.
  




.

Wednesday, October 10, 2012

అంతరంగం బ్లాగులో "నిర్జన వారధి" పై చరసాల గారి సమీక్ష ...


అయింష్టంగానైనా కొండపల్లి కోటేశ్వరమ్మని కొండపల్లి సీతారామయ్య భార్యగా పరిచయం చేయాల్సి వస్తోంది. 
ఎందుకంటే నాలాంటి వారికి ఆమె తెలియదు. 
ఆమె స్వీయ కథ, నిర్జన వారధిని చదివే ఆసక్తి కలగడానికి ఆమె సీతారామయ్య భార్య కావడమే కారణం. 
కానీ చదవడం మొదలెట్టాకా చివరికంటా చదవడానికి కారణం మాత్రం కోటేశ్వరమ్మే కాదు కాదు కోటేశ్వరవ్వే! 
ఆమె నడుస్తున్న చరిత్ర. తనకు తాను దీపపు వత్తియై, తన్ను తాను వెలిగించు కొని, నమ్మిన సిద్దాంతం కొరకు జీవితాన్ని, పిల్లలనీ, తల్లినీ, తననూ, తన ఆస్తినీ సర్వస్వాన్నీ ధారపోసి, ధారపోసే వారుంటారా అన్న సందేహానికి కోటేశ్వరవ్వ ఒక నిలువెత్తు సాక్ష్యం.
ఆమె ఆమెగానే సర్వ స్వతంత్రంగా బ్రతికిన కోటేశ్వరవ్వని ఇంకొకరి భార్యగా పరిచయం చేయాల్సి రావడం దురదృష్టమనే వుద్దేశ్యంతో నేను అయిష్టమన్నాను. 
నిజానికి కమ్యూనిస్టు వుద్యమానికి పరిచయం చెయ్యడమే సీతారామయ్య ఈ అమ్మకు చేసిన ఉపకారం(?). 
కమ్యూనిస్టు వుద్యమంలో దిగిన రోజునుండి ఈమె తన సర్వస్వాన్నీ పార్టీకి, వుద్యమానికే అర్పించింది.
ఈ కథ రాసిన తీరు, అవ్వ మన పక్కన కూర్చుని తన కథ చెబుతున్నట్లే వుంటుంది. 
చివరి వరకూ ఎక్కడా ఆత్మస్తుతీ, పరనిందా కనిపించవు. 
అలా అని తనతో వుద్యమంలో కలిసి నడిచిన వారి త్యాగాలని ఎక్కడా మెచ్చకుండా వుండదు. అప్పట్లో ఇంత మంచివారు వుండేవారా అని ఆశ్చర్యమనిపిస్తుంది.
.....
పూర్తి సమీక్ష అంతరంగం బ్లాగు లో చదవండి ...

Friday, October 5, 2012

కథలగూడు... దేవులపల్లి కృష్ఞమూర్తి ...




ప్రతి కథా రియలిస్టిక్‌ పెయింటింగే

తెలంగాణా సాయుధ పోరాట జ్ఞాపకాలు మెయిన్‌ స్ట్రీమ్‌ రాజకీయాల నుండి మెల్లగా తప్పుకుంటున్నాయి.
ప్రత్యేక ఉద్యమం, అస్తిత్వ ఉద్యమాలూ తెచ్చిన తక్షణ ఎజెండాలు కూడా కారణం కావచ్చు.
ఇదంతా తాత్కాలికమే ననిపిస్తుంది.

ఇవి వట్టి జ్ఞాపకాలు కావు. వయసు మళ్లిన వాళ్లు ''మా రోజుల్లో'' అంటూ నెమరేసుకునే సంగతులు మాత్రమే కాదు, ఆ పోరాటం ఈ నేల రంగూ రుచీ వాసనని పట్టిచ్చింది. ఈ జనం స్వభావాన్నీ, టెంపర్‌నీ చూపించింది.

చే గువేరా ఏనాడో అరవయ్యో దశకంలో చనిపోతే అదంతా నిన్నో మొన్నో అయినట్టు ఎందుకు తలుచుకుంటుందీ ప్రపంచం. మన స్వతంత్ర పోరాటం గురించీ అంతకు ముందెప్పుడో వందల ఏళ్ల క్రితం వచ్చిన పోర్చుగీసు పాలనా, గోవా ప్రతిఘటన గురించి ఈ రోజుకీ చెప్పుకుంటున్నాం రాస్తున్నాం. సినిమాలు కూడా తీస్తున్నాం. చూస్తున్నాం.

తెలంగాణా సాయుధ పోరాటమూ అంతే.
అది సజీవం.
దాన్ని మన కథలూ నవలలూ, సాహిత్యం మరింత నిత్యనూతనంగా ఉంచుతాయి.
ఉంచుతున్నాయి కూడా.

ఈ అరవైయ్యేళ్లుగా పోరాట సాహిత్యం చాలా వచ్చింది. రావి నారాయణరెడ్డి, బద్దం ఎల్లారెడ్డి, ముఖ్దుం మొహియుద్దీన్‌, రాజ్‌బహదూర్‌ గౌర్‌ లాంటి యోధుల జ్ఞాపకాలు పుస్తకాలుగా వచ్చాయి. ఇందులో చాలా వాటికి అట్టమీది బొమ్మలు గీసింది నేనే.

సుద్దాల హన్మంతు, యాదగిరి పాటలు,
దాశరథి, తెన్నేటి సూరి, సోమసుందర్‌ కవితలు ఒక వరస.
కిషన్‌ చందర్‌, వట్టికోట ఆళ్వారుస్వామి, బొల్లిముంత శివరామకృష్ణ నవలలు మరో వరస.

చిత్త ప్రసాద్‌ బొమ్మలూ, సునీల్‌ జెనా ఫొటోలూ చరిత్రని రికార్డు చేశాయి.
'మా భూమి' లాంటి సినిమాలూ అదే చేశాయి.
ఈ పరంపర ఇంతటితోనే ఆగిపోలేదు.

ఈ మధ్య ప్రత్యేక తెలంగాణ ఉద్యమం ఉధృతమై క్లైమాక్స్‌కు చేరినప్పుడు కూడా హైదరాబాద్‌లో, ఇతర పట్నాల్లో జరిగిన అనేక సభల్లో సాయుధ పోరాట ప్రస్తావన పదే పదే వస్తూనే ఉంది.

దేవులపల్లి కృష్ణమూర్తి కథలకి ఓ విశేషం, ప్రత్యేకతా ఉన్నాయి.
అన్నీ పోరాటకాలం నాటివే.
అన్నీ అసాధారణమైన పోరాట పటిమ చూపిన అన్‌సంగ్‌ హీరో, హీరోయిన్స్‌వే.
పాత్రలన్నీ నిజంగా బతుకులో ఉన్నవే.
కృష్ణమూర్తికి తెలిసినవే.
త్యాగం, పోరాటం, విషాదం, విజయం లాంటివి చెప్పేటప్పుడు పాఠకుణ్ణి కన్నీరు పెట్టించాలనో, పిడికిళ్లు బిగించేట్టు చేయాలనో, మెలో డ్రామాలో ముంచెత్తాలనో రచయితకి అనిపిస్తుంది.

కృష్ణమూర్తి కథలు ఆ పనిచేయలేదు.
పైగా తెలిసిన మనుషులనీ, వాళ్లున్న సందర్భాల్నీ వరుసగా చెప్పుకు పోతాడు.
రియలిస్టిక్‌గా మేటర్‌ ఆఫ్‌ ఫాక్ట్‌గా వినిపిస్తున్నట్టే ఉంటుంది.
ఎక్కడా అతి ఉండదు.
అలాగని ఒక్క దగ్గరా విసుగనిపించదు.
అల్లికలో అందంతో అలనాటి ఊళ్లూ, మనుషులూ, ఘటనలూ కళ్లముందు రూపుకడతాయి.
ప్రతి కథా రియలిస్టిక్‌ పెయింటింగే.
కథలో, నవలలో, సినిమాలో ఒకనాడొచ్చిన ఇటాలియన్‌ నియోరియలిస్టిక్‌ పెయింటింగ్‌ ధోరణిలో కథనం సాగుతుంది.
....
- మోహన్‌
(చిన్నమాట నుంచి)


కథలగూడు
దేవులపల్లి కృష్ఞమూర్తి
ముఖచిత్రం : లక్ష్మణ్‌ ఏలె
122 పేజీలు, వెల: రూ. 60/-

ప్రతులకు, వివరాలకు:

హైదరాబాద్‌ బుక్‌ ట్రస్ట్‌
ప్లాట్‌ నెం. 85, బాలాజీ నగర్‌,
గుడిమల్కాపూర్‌, హైదరాబాద్‌- 500006
ఫోన్‌ నెం. 040 23521849

ఇమెయిల్‌ ఐడి: hyderabadbooktrust@gmail.com



.

కొండపల్లి కోటేశ్వరమ్మ " నిర్జన వారధి " పై జంపాల చౌదరి గారి సమీక్ష .. పుస్తకం డాట్ నెట్ లో ...


నిర్జనవారధి మనుషుల్లేని వంతెన. 
ఈ పుస్తకం గురించి మొదట విన్నప్పుడూ, పుస్తకం చదివాక కూడా, ఈ పేరు గుండెను తొలిచేస్తూ ఉంది. ఈ మాటను తలచుకున్నపుడల్లా ఏదో అస్పష్టమైన విచారం కమ్ముకొస్తుంది. ఒక విషాద దృశ్యం కళ్ళ ముందు పరచుకొంటుంది.
కానీ మనుషులు లేనంత మాత్రాన వంతెన కూలిపోదు. 
స్థిరంగా అలాగే నిలిచి ఉంటుంది తర్వాత రాబోయేవారిని అవతల దరి చేర్చటం కోసం. 
విషాదం వారధిది కాదు; వారధిని వాడుకోలేనివారిది.
మూడు తరాలకు వారధి అయినా ఒంటరిగా మిగిలిపోయిన కోటేశ్వరమ్మగారి స్వీయకథ చదువుతుంటే విషాదం పెళ్ళుకువచ్చేమాట నిజమే అయినా, ఆమె మీద కల్గేది జాలి, సానుభూతి మాత్రమే కాదు, ఆమె సాహసప్రవృత్తి, ఉద్యమ నిబద్ధత, ఆత్మాభిమానాల పట్ల ఆరాధనాభావం. కల్పిత కథ కాని ఒక వ్యక్తి నిజజీవితంలో ఇంత విషాదమూ, ఇంత ధైర్యమూ ఉంటుందంటే నమ్మబుద్ధి కాదు.

..........  పూర్తి సమీక్ష పుస్తకం డాట్ నెట్ లో చదవండి 



Thursday, September 27, 2012

నిర్జన వారధి - కొండపల్లి కోటేశ్వరమ్మ ...


ఇవీ...నేను అనుకున్నవి 

నేను ఒక గొప్ప వ్యక్తినీ, రచయిత్రినీ కాకపోయినప్పటికీ 'నీ జీవితం ఓ కావ్యం లాంటిది. అది పదిమందికీ తెలియడం అవసరం' అని చెపుతుండేవాళ్ళు కొంతమంది పెద్దలూ, మిత్రులూ. 'సామాన్యుని సాహసమెట్టిదో...' చరిత్రలో నమోదు కావాలని మహీధర రామమోహనరావు, చేకూరి రామారావు, స్మైల్‌ వంటివాళ్ళు, పరకాల పట్టాభి రామారావు, మానికొండ సూర్యావతి వంటి మిత్రులు నన్ను ఆత్మకథ రాయమని ప్రోత్సహిస్తుండే వాళ్ళు. 

జ్ఞాపకాలను తట్టి లేపితే కన్నీటి ఊట ఉబికి వచ్చే జీవితం నాది. తడిసిన ఆ అక్షరాలను అర్థవంతంగా కాగితం మీద పెట్టడం నా వల్ల అవుతుందా అనుకున్నాను. అందుకే ఇన్నేళ్ళుగా ఆ ప్రయత్నం చేయలేదు. 

నా మనవరాళ్ళు అనురాధ, సుధ, నన్ను అమ్మమ్మా అని పిలిచే మరో మనవరాలు వసంత (వేమన వసంతలక్ష్మి) 'నీ ఒంట్లో శక్తి తగ్గకముందే నీ జీవితాన్ని కథగా రాయి. ముందు తరాలకు తెలియకుండా దాన్ని మాసిపోనివ్వొద్ద'ని మరీ మరీ చెప్పారు. 

అయినా నా శక్తీ, నా కంటిచూపూ అందుకు సహకరిస్తాయా అని సందేహించాను. 

నీ మిత్రులు ఎందుకు రాయమన్నారో ఆలోచిస్తేనూ, విూరు ఆనాడు ఎందుకు ఉద్యమించారో గుర్తుచేసుకుంటేనూ నీ కన్నీరే కథగా ప్రవహిస్తుంది ప్రారంభించమన్నారు వాళ్ళు. 

అచ్చు ప్రతిని సిద్ధం చేయడంలో అనురాధ, అనురాధ మిత్రులు వాసుగారు, వసంత ఎంతో సహకరించారు. సుందరయ్యగారు, రాజేశ్వరరావు గారిలాంటి వ్యక్తులు నా జీవితంతో ఎంతగానో ముడిపడిపోయిన వ్యక్తులు కాబట్టి సహచర కామ్రేడ్స్‌ మీద రాసిన సంస్మరణ వ్యాసాలను కూడా ఇందులో అనుబంధంగా చేర్చాను. ప్రత్యేకించి అనురాధ అచ్చు ప్రతిని సిద్ధం చేయడంలో చాలా శ్రమ తీసుకుంది. 

స్త్రీ జనాభ్యుదయంపై ప్రేమాభిమానాలున్న ఓల్గాగారు అడగ్గానే ముందుమాట రాయడానికి ఒప్పుకున్నారు. నా కథను పాఠకులు లోతుగా ఆలోచించేటట్లుగా చారిత్రక ఉద్యమాల అవగాహనతో విశ్లేషించారు. 

ఈ పుస్తక ప్రయత్నం గురించి తెలిసి దాన్ని అచ్చువేయడానికి హైదరాబాద్‌ బుక్‌ ట్రస్ట్‌ వారు ముందుకొచ్చారు. 'సంస్కరణోద్యమం, జాతీయోద్యమం, కమ్యూనిస్టు ఉద్యమం, నక్సల్బరీ ఉద్యమం మొత్తం నాలుగు ఉద్యమాలతో సంబంధం ఉన్న జీవితం మీది. కనుక దేన్నీ వదిలిపెట్టకుండా రాయమని' కొన్ని సూచనలిచ్చారు బుక్‌ ట్రస్ట్‌ 
గీత గారు. ఆ ప్రకారం మరికొన్ని అనుభవాలు గుర్తు తెచ్చుకుని రాశాను. మరికొన్నిటిని విమలగార్ని విశాఖపట్నం పంపి రికార్డు చేయించి ఇందులో చేర్చారు. 

ఇందరి సహకారంతో నా జీవిత కథ ఇవ్వాళ నా 92వ యేట పుస్తక రూపంలో రానుంది. వారందరికీ నా హృదయపూర్వక కృతజ్ఞతాభివందనాలు. 

నా జీవిత కథ చదివిన పాఠకులు ఇది సంఘ శ్రేయస్సు కొరకు రాయబడిందను కుంటే సంతోషిస్తాను. నా కథ మనిషిలో మంచిని ఏ కొంచెమైనా పెంచుతుందను కుంటే నా శ్రమ ఫలించిందనుకుంటాను. ఇన్నేళ్ళ నా బ్రతుకు వృథా కాలేదని తెలిసి తృప్తిపడతాను. 


- కొండపల్లి కోటేశ్వరమ్మ
15.8.2012
(నిర్జన వారధి పుస్తకంలోనుండి )

నిర్జన వారధి 

కొండపల్లి కోటేశ్వరమ్మ ఆత్మకథ 

పేజీలు  184 వెల: రూ. 100 /- 




ప్రతులకు:
హైదరాబాద్ బుక్‌ట్రస్ట్, 
ఫ్లాట్ నెం. 85, బాలాజీనగర్, 
గుడిమల్కాపూర్, హైదరాబాద్-6.

Now NIRJANA VAARADHI  is available to the international Telugu reader;
Here is the link to the book:


http://kinige.com/kbook.php?id=1196&name=Nirjana+Vaaradhi

Friday, September 21, 2012

ఆదివారం ఆవిష్కరించబోతున్న "నిర్జన వారధి" పుస్తక ముఖచిత్రం ...

ఆదివారం ఆవిష్కరించబోతున్న "నిర్జన వారధి" పుస్తక ముఖచిత్రం ...




Wednesday, September 12, 2012

కొండపల్లి కోటేశ్వరమ్మ ఆత్మకథ 'నిర్జన వారధి' ఆవిష్కరణ సభ ... సెప్టెంబర్ 23 ఉదయం 10 -30 గంటలకు హిమాయత్ నగర్ ఉర్దూ హాల్ లో ...

ఆహ్వానం


తొంభైరెండు సంవత్సరాల కొండపల్లి కోటేశ్వరమ్మను గౌరవించుకోవడానికి ఇప్పుడొక సందర్భం వచ్చింది.

ఆమె రాసిన ఆత్మకథ 'నిర్జన వారధి' నుంచి కొన్ని భాగాలు చదివి, మాట్లాడేందుకు -

మల్లు స్వరాజ్యం,
 చేకూరి రామారావు, 
ఎ.బి.కె.ప్రసాద్‌, 
రమా మేల్కొటే,  
వోల్గా, 
విమల, 
గుడిపాటి, 
మంజరి 
మొదలైనవాళ్ళంతా వస్తున్నారు. 
మీరూ తప్పక రండి.

23 సెప్టెంబర్‌ 2012 ఆదివారం 
ఉదయం 10-30 గంటలకు
ఉర్దూహాల్‌, హిమాయత్‌ నగర్‌, హైదరాబాద్‌

-హైదరాబాద్‌ బుక్‌ ట్రస్ట్‌
ఫోన్‌ నెం. 040 23521849

నిర్జీవంగా వున్న (కొండపల్లి) సీతారామయ్యను చూస్తే ఎన్నో జ్ఞాపకాలొచ్చాయి.... ఇన్ని సంవత్సరాల జీవితాన్ని ఉద్యమం కోసం, ప్రజల కోసం... ధారపోశాక చూడ్డానికి వాళ్ల పార్టీవాళ్ళెవరూ రాలేదెందుకని? తమ ఉద్యమనేత చనిపోతే విభేదించాడని వదిలేస్తారా? నన్ను... సీతారామయ్య తనకి అనుకూలంగా లేనని చెప్పి ఆనాడు వదిలేశాడు. ఇప్పుడు సీతారామయ్యను వాళ్లు వదిలేశారు. ఇంతేనా జీవితం?
- కొండపల్లి కోటేశ్వరమ్మ

కొండపల్లి కోటేశ్వరమ్మగారు మూడు ఉద్యమాల వారధి. మూడు ఉద్యమాలలోని స్త్రీల పోరాట పటిమకు, వేదనకు కూడా ప్రతినిధి. మూర్తీభవించిన ఉద్యమ రూపం. ఆమె జీవితం చదువుతుంటే ఒక వ్యక్తి జీవితంలో ఇంత దుఃఖం ఉంటుందా అని మనసు ఆర్థ్రమవుతుంది. ఆ దుఃఖం ఎంత వ్యక్తిగతమో అంత సామాజికం, రాజకీయం...
-వోల్గా
(నిర్జన వారధి పుస్తకం ముందుమాట నుండి)




.

Sunday, September 9, 2012

సగటుజీవి కథ ...


బెంగాలీ రచయిత బిభూతి భూషణ్‌ బందోపాధ్యాయ తన 'పథేర్‌ పాంచాలి' తర్వాత, రెండో భాగంగా 'అపరాజితో' రచించారు. 

ఈ రెండు నవలలనూ కలిపి విఖ్యాత దర్శకుడు సత్యజిత్‌ రే మూడు చిత్రాలుగా రూపకల్పన చేశారు. 

నవలలోని కథానాయకుడు అపూ కష్టాలూ కన్నీళ్లూ అధిగమిస్తూ ప్రశాంతంగా జీవించాలని తపిస్తాడు. వీలైనంతవరకూ ఇతరులకు 
సాయపడాలన్నది అతని సంకల్పం. చిమ్మచీకట్లో చిరుపీదాన్ని వెతుక్కుంటూ ప్రస్థానం సాగిస్తాడు. పల్లెల నుంచి పట్నాలకు 
వలసలు, ఛిద్రమవుతున్న గ్రామీణ వ్యవస్థ పెరిగిపోతున్న పేదరికం, తరిగిపోతున్న మానవ సంబంధాలను స్పశిస్తూ ప్రతి పాత్రనూ 
హృద్యంగా మనముందుంచారు రచయిత. 

బెంగాలీ సాహిత్యాన్ని అభిమానించే ప్రతి ఒక్కరూ చదివి తీరాల్సిన నవల.

అపరాజితుడు
బెంగాలీ మూలం: బిభూతి భూషణ్‌ బందోపాధ్యాయ
అనువాదం: కాత్యాయని
పేజీలు: 197, వెల: రూ.100/-

ప్రతులకు: 
హైదరాబాద్‌ బుక్‌ ట్రస్ట్‌, ప్లాట్‌ నెం. 85, బాలాజీ నగర్‌, గుడి మల్కాపూర్‌, హైదరాబాద్‌-500006

- కెవియల్లెన్‌
(ఈనాడు ఆదివారం 9-9-2012 సౌజన్యంతో)






Monday, September 3, 2012

అణువుపై ఒకింత అవగాహన...జీవశాస్త్ర విశేషాల సమాహారం ...


 అణువుపై ఒకింత అవగాహన

రచయితల ఊహల్లోని ఆలోచనలను అక్షరబద్ధం చేసేందుకు పెద్దగా శ్రమించాల్సిన అవసరం లేకపోయినా శాస్త్ర సంబంధిత అంశాల విషయంలో మాత్రం జాగ్రత్త అవసరం. ఈ పరిమితి మూలంగా రచనలోని భావధారకు తరచూ బ్రేక్‌పడే అవకాశముంది. కొడవటిగంటి రోహిణీప్రసాద్ రచన ‘అణువుల శక్తి’లో ఈ పరిమితిని చాలా వరకూ అధిగమించారనే చెప్పాలి. ఇటీవలి కాలంలో బహుళ ప్రాచుర్యంలోకి వచ్చిన లార్జ్ హాడ్రాన్ కొలైడర్ ప్రయోగం ప్రస్తావనతో పదార్థ లక్షణాలకు పరిచయం కల్పించడం... అక్కడి నుంచి క్రమేపీ గతంలోకి.. ఆ వెంటనే వర్తమానంలోకి తీసుకొస్తూ రచనను నడపడం హాయిగొలిపింది. పాఠ్యపుస్తకాల్లో కనిపించే గ్రాంధిక భాషను పక్కనబెట్టి వాడుక భాషలోనే అంశాలను వివరించేందుకు చేసిన ప్రయత్నం ఎన్నదగ్గది. అయితే వాడుకలో లేకపోవడం వల్లనో... స్థిరీకరించకపోవడం వల్లనో తెలియదు కానీ... రచయిత వాడిన కొన్ని పదాలు కొంచెం ఇబ్బందిగా అనిపిస్తాయి. కొత్త పదబంధాలను సృష్టించి ఉంటే శాస్త్ర సంబంధ దృగ్విషయా లకు తగిన తెలుగు అనువాదాలు లేకపోవడమన్న లోటును అధిగమించి ఉండవచ్చునన్న భావన కలుగుతుంది.

జీవశాస్త్ర విశేషాల సమాహారం
రచయిత కొడవటిగంటి రోహిణీ ప్రసాద్ తన ముందుమాటలో చెప్పినట్లు సైన్స్ రచయితల బాధ్యతను గుర్తుచేసే సంకలనం ఇది. మార్కుల ప్రాతిపదికన చదువుకునే పాఠ్యపుస్తకాల మాదిరిగా కాకుండా సంక్లిష్టమైన అంశాలకూ సులభగ్రాహ్యంగా ఉందీ రచన. కాబట్టి విద్యార్థులు తరగతి గదుల్లోని చదువుకు మెరుగులు దిద్దేందుకూ ఉపయోగపడుతుంది. పరిణామ సిద్ధాంతాన్ని... మన ఆలోచనాసరళి, వచ్చే వ్యాధులకు ఉన్న జన్యుమూలాలను తెలిపేందుకు చేసిన ప్రయత్నమూ బాగుంది. సంకలనం మొత్తమ్మీద మూఢనమ్మకాలపై రచయితకు ఉన్న సహేతుక వ్యతిరేకత... వాటిని దనుమాడేందుకు చేసిన ప్రయత్నం ప్రస్ఫుటంగా కనిపిస్తుంది.

- గిళియార్ గోపాలకృష్ణ మయ్యా

అణువుల శక్తి, 
పే 192, వెల రూ. 100/-,
జీవశాస్త్ర విజ్ఞానం: సమాజం,
పే 175, వెల రూ 100/- /
రచన: కొడవటిగంటి రోహిణీప్రసాద్/

ప్రతులకు:
 హైదరాబాద్ బుక్‌ట్రస్ట్, ఫ్లాట్ నెం. 85, బాలాజీనగర్, గుడిమల్కాపూర్, హైదరాబాద్-6.

( సాక్షి దినపత్రిక 3 సెప్టెంబర్ 2012 సౌజన్యం తో )


Wednesday, August 29, 2012

సైన్సు సంగతులు ...



రోహిణీ ప్రసాద్‌ తన పుస్తకం 'అణువుల శక్తి'లో అణువు సామర్థ్యం గురించి సామాన్య పాఠకుడికి కూడా అర్థమయ్యేలా వివరించారు. అధునాతన సైన్స్ విశేషాలు పరిచయం చేశారు. 
నానో టెక్నాలజీ సంగతులు ప్రస్తావించారు. రకరకాల అణు రియాక్టర్ల విశేషాలేగాక, అణువిద్యుత్‌ రంగంలో చోటుచేసుకుంటున్న రాజకీయాల గురించి కూడా వివరించారు.

మరో పుస్తకం 'జీవశాస్త్ర విజ్ఞానం - సమాజం'లో జన్యుపరమైన లక్షణాలు ఏవిధంగా జీవరాశి మనుగడకూ ప్రవర్తనకూ మూలాలుగా ఉంటాయో వివరించిన తీరు పాఠకుల చేత చదివింపజేస్తుంది. 
మనిషి ముసలితనానికీ చావుకీ వెనకున్న కారణాలను తెలుసుకోడానికి జరుగుతనన్న పరిశోధనల్ని చక్కగా వివరించారు.

అణువుల శక్తి
పేజీలు 192; వెల: రూ.100/-

జీవశాస్త్ర విజ్ఞానం-సమాజం
పేజీలు: 175; వెల:రూ.100/-

రచన: కొడవటిగంటి రోహిణీ ప్రసాద్‌

ప్రతులకు:
హైదరాబాద్‌ బుక్‌ ట్రస్టు
ప్లాట్‌ నెం.85, బాలాజీ నగర్‌,
గుడిమల్కాపూర్‌, హైదరాబాద్‌- 500006

- సి.వి. సర్వేశ్వర శర్మ
(ఈనాడు ఆదివారం 26-8-2012 సౌజన్యంతో)


,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,

For E Books at Kinige . com Pl. click here:



.

.

HBT Book Club ... హెచ్‌బిటి బుక్‌ క్లబ్‌లో చేరండి... 25% రాయితీ పొందండి !


HBT Book Club
HBT Book club membership helps in maintaining a relationship with us.
It works much like a bank account.
You deposit money in multiples of Rs. 100 with us and take books at 25%.
When your account nears nil balance, you renew it.
If you would like all books to be sent to you, we can do so.
Alternatively, we can call you up every time a new book is released and you can then decide.


హెచ్‌బిటి బుక్‌ క్లబ్‌లో చేరండి... 25% రాయితీ పొందండి !

అభిమాన పాఠకులతో ఆత్మీయ సంబంధాన్ని పెంపొందించుకునే ఉద్దేశంతో హైదరాబాద్‌ బుక్‌ ట్రస్ట్‌ ఎప్పటినుంచో ఒక బుక్‌ క్లబ్‌ను నిర్వహిస్తోంది. 


ఈ క్లబ్‌లో చేరిన పుస్తకాభిమానులకు హైదరాబాద్‌ బుక్‌ ట్రస్ట్‌ ప్రచురించే పుస్తకాలన్నింటిపై 25 శాతం రాయితీ లభిస్తుంది.
హెచ్‌బిటి బుక్‌ క్లబ్‌లో ఎవరైనా, ఎప్పుడైనా కనీసం వంద రూపాయల మొత్తంతో సభ్యులుగా చేరవచ్చు.


ఆ తరువాత మీకు వీలైనప్పుడల్లా వంద, రెండువందలు, మూడువందలు ఇలా వంద డెనామినేషన్‌తో ఎంత మొత్తమైనా మీ ఖాతాలో జమచేసుకుంటూ వుండాలి.
మీరు ఎప్పుడంటే అప్పుడు మీరు కోరిన హెచ్‌బిటి పుస్తకాలను మీ ఖాతాలో వున్న మొత్తం పరిధిలో 25 శాతం రాయితీతో మీకు అందజేయడం జరుగుతుంది.



మీ ఖాతాలో సొమ్ము నిల్వ అయిపోయితే మీరు మళ్లీ వంద రూపాయల చొప్పున జమ చేస్తూ పోవాలి. 

ఒకేసారి ఎక్కువ పుస్తకాలు కావాలనుకుంటే ఆమేరకు మీరు డబ్బును జమ చేయాల్సి వుంటుంది. 

ఈ డబ్బును మీరు స్వయంగా మాకార్యాలయానికి వచ్చిగానీ, మనీఆర్డర్‌ ద్వారా గానీ, హైదరాబాద్‌ బుక్‌ ట్రస్ట్‌ పేరిటి తీసిని డి.డి. రూపంలో గానీ లేదా ఇంటర్‌నెట్‌ బ్యాంకింగ్‌/మనీ ట్రాన్స్‌ఫర్‌ ద్వారా గానీ ఎలాగైనా మీ ఖాతాలో జమ చేసుకుంటూపోవచ్చు.
మనీ ట్రాన్స్‌ఫర్‌ కోసం మా కార్యలయం ను సంప్రదించి మా బ్యాంకు అకౌంట్‌ నెంబర్‌ను తీసుకోవచ్చు. 


మీరు హెచ్‌బిటి బుక్‌ క్లబ్‌లో చేరగానే మీకు మీ క్లబ్‌ మెంబర్‌షిప్‌ ఖాతా నెంబర్‌ను, మా క్యాటలాగ్‌ను పంపిస్తాము.
మీరు కోరిన హెచ్‌బిటి పుస్తకాలను విపిపి ద్వారా మీకు బట్వాడా చేయడం జరుగుతుంది. 


విపిపి చార్జీలో కేవలం 1/3వ వంతు ఛార్జీని మాత్రమే మీరు భరించవలసి వుంటుంది. ఇది సాధారణంగా ఐదు, పది రూపాయలు మించదు. మిగతా ఖర్చును హెచ్‌బిటియే భరిస్తుంది.  


రండి,
హెచ్‌బిటి బుక్‌ క్లబ్‌లో చేరండి.
మంచి పుస్తకాల ప్రచురణలో మీరూ భాగస్వాములవండి.


మా చిరునామా:
హైదరాబాద్‌ బుక్‌ ట్రస్ట్‌
ప్లాట్‌ నెం. 85, బాలాజీ నగర్‌,
గుడి మల్కాపూర్‌, హైదరాబాద్‌ - 500 006

ఫోన్‌ నెం. 040 - 2352 1849
ఇమెయిల్‌:
   hyderabadbooktrust@gmail.com



.

Tuesday, August 28, 2012

అపూ విజయం...




తెలుగు సాహిత్యంలో అనువాద రచనలకు ఎప్పుడూ ఒక ప్రత్యేకమైన స్థానం ఉంటూ వచ్చింది. అందునా బెంగాలీ నుండి అనువదించబడిన కథలకు, నవలలకు మరింత విశిష్టత ఉంది. 


ఠాగూర్ (1861-1941), శరత్ (1876-1938)ల రచనల అనువాదాలను క్షుణ్ణంగా చదివి జీర్ణించుకున్న ఒక తరం తెలుగు వాళ్ళున్నారు. శరత్ తెలుగువాడే కాదని తరువాతెప్పుడో తెలుసుకుని నిర్ఘాంతపోయిన వాళ్ళున్నారు. 

ఒకప్పుడు తెలుగువారి సాహిత్యంపైనే కాకుండా సినిమాపైన కూడా బెంగాలీ రచనల ప్రభావం ఉండేది. అయితే ఆ బంధం అక్కడితో తెగిపోయినట్లుంది. అందుకే శరత్ తర్వాత తరానికి చెందిన బిభూతిభూషణ్ బందోపాధ్యాయ (1894-1950) మొదలుకొని సమకాలీన బెంగాలీ సాహిత్యం వరకు తెలుగు అనువాదాలు రావాల్సిన మేరకు రాలేదు. ఈ లోటుని పూరించేందుకు కాత్యాయని గారి ఈ అనువాదం ఎంతగానో దోహదం చేస్తుంది.

బిభూతి భూషణ్ రచించిన 'పథేర్ పాంచాలి', 'అపరాజిత' అనే రెండు నవలల్ని మూడు సినిమాలుగా మలిచిన సత్యజిత్ రే, అంతర్జాతీయ సినిమా రంగంలోనే కాక అటు ప్రపంచ సాహిత్యంలోనూ వాటికి మహోన్నత స్థానాన్ని సుస్థిరం చేశాడు. 


నిజానికి ఈ రెండు నవలలూ బిభూతిభూషణ్ తన స్వీయానుభవాల ఆధారంగా రచించినవే. గొప్ప రచనలన్నిటిలోనూ గోచరించే ఆత్మకథా వస్తు విశేషం వీటిల్లోనూ దాగి ఉంది. అందుకే అవి ఎంతో నిజాయితీతో కూడిన నమ్మశక్యమైన మానవీయ గాథలుగా చదువరుల హృదయాలకు హత్తుకుపోయాయి.

ఎన్నో తరాలబాటు స్వయంపోషకంగా ఉండిన గ్రామీణ వ్యవస్థ శిథిలం కావడం, వ్యవసాయ ఆదాయం ఇగిరిపోవడం, నడ్డివిరిచే రుణభారం, పట్టణాలకు వలసపోవడంలోని విషాదం, 
వలస వెళ్ళిన చోట ఇమడలేకపోవడం, గతించిన రోజుల్ని తలచుకుంటూనే కొత్త పరిసరాల్లో కొత్త స్నేహాల్ని సంబంధాల్ని సృష్టించుకోవడం, నగర జీవనానికి అవసరమైన నైపుణ్యాలను, మానసిక స్థితినీ ఏర్పరచుకునే ప్రయత్నాలూ ఇవన్నీ ఈ నవలలో కనిపిస్తాయి. 

ఈ మేరకు నవలలో పేర్కొన్న సంఘటనలు- కాస్త అటుఇటుగా మొత్తం భారతదేశంలో (మరికొన్ని దేశాల్లోనూ ఎక్కడైనా జరిగి ఉండవచ్చు. సర్వజయ, దుర్గ, హరిహరుడు, అపూ, ఇంకా ఇతర పాత్రలు సమకాలీన రూపాల్లో మనకు సులభంగానే తారసపడతారు. రథచక్రపుటిరుసులలో పడి నలిగి లక్షలాదిమంది నశించిపోగా అపూ లాంటి అపరాజితులు అక్కడక్కడా నిలదొక్కుకున్నారు.

అపూ లేదా బిభూతి భూషణ్ రచయిత గనక ఈ క్రమాన్ని నమోదు చెయ్యగలిగాడు. ఇక్కడికి వచ్చేసరికి పాత్రకీ, దాని సృష్టికర్తకూ మధ్య ఉన్న హద్దులు చెరిగిపోతాయి. నిజజీవితంలో కూడా బిభూతి భూషణ్ తన చిన్ననాటి ప్రదేశానికే వెళ్ళి స్థిరపడ్డాడు. అయితే ఈ విధమైన తిరుగు ప్రయాణం అందరికీ ఇవాళ సాధ్యం అవుతుందా?...

కాత్యాయని గారి అనువాదం ఈ నవలకు, అందులోని భావుకతకు, ఆర్ద్రతకు, మార్మికతకు, ప్రకృతి వర్ణనలకు పూర్తి న్యాయం చేకూర్చే విధంగా ఉంది. నిజానికి మూల రచన చదువుతున్నామనే భావనే కలిగిస్తూ అత్యంత సాఫీగా సాగిపోయింది. 

హైదరాబాద్ బుక్ ట్రస్టు వారు తమ ప్రమాణాలకు అనుగుణంగా చక్కగా ముద్రించారు. 
ఎంతో ఆలస్యంగా తెలుగు పాఠకులకు అందిన అపురూపమైన కానుక ఈ పుస్తకం.
- ఉణుదుర్తి సుధాకర్
(ఆంధ్ర జ్యోతి ఆదివారం 26 8 2012 సౌజన్యం తో )

అపరాజితుడు,
బిభూతి భూషణ్ బందోపాధ్యాయ
పేజీలు : 200, వెల : రూ. 100

Friday, August 24, 2012

హెచ్‌బిటి పుస్తకాలను పొందేందుకు ఐదు పద్ధతులు:





హైదరాబాద్‌ బుక్‌ ట్రస్ట్‌ పుస్తకాలను ఇప్పుడు పలు రకాలుగా పొందవచ్చు.
 

1.
(నేరుగా హైదరాబాద్‌ బుక్‌ ట్రస్ట్‌ కార్యాలయం ద్వారా) 
 
మా కేటలాగ్‌ లోంచి లేదా బ్లాగు లోంచి మీకు కావలసిన పుస్తకాలను ఎంపిక చేసుకుని వాటి ధరను మాకు ఎంఒ/డిడి/మనీ ట్రాన్సఫర్‌ ద్వారా పంపిస్తే మీరు సూచించిన చిరునామాకు వాటిని మూడు రూపాయల వి.పి.పి. ద్వారా వెంటనే బట్వాడా చేయడం జరుగుతుంది. బ్యాంకు ద్వారా మనీ ట్రాన్స్‌ఫర్‌ చేయదలచిన వారు మాకు లెటర్‌ రాసి లేదా ఇమెయిల్‌ చేసి మా బ్యాంకు అకౌంట్‌ వివరాలు పొందవచ్చు.

మా పోస్టల్‌ చిరునామా:
హైదరాబాద్‌ బుక్‌ ట్రస్ట్‌,
ప్లాట్‌ నెం.85, బాలాజీ నగర్‌,
గుడిమల్కాపూర్‌, హైదరాబాద్‌ - 500006.
ఫోన్‌ నెం. 040-23521849
మా ఇ మెయిల్‌ ఐడి: hyderabadbooktrust@gmail.com
,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,

2.
(మీ సమీపంలోని విశాలాంధ్ర, ప్రజాశక్తి, దిశ తదితర పుస్తకాల షాపుల ద్వారా)
 
మీకు దగ్గరలోని విశాలాంధ్ర, ప్రజాశక్తి, దిశ తదితర పుస్తకాల షాపులను సంప్రదించి వారి ద్వారా నేరుగా మా పుస్తకాలను కొనుగోలు చేయవచ్చు.
,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,


3.
(ఫ్లిప్‌ కార్ట్‌ డాట్‌ కామ్‌ వారి ద్వారా)

భారత దేశంలో ఎక్కడ వున్నవారైనా ఇప్పుడు ఫ్లిప్‌ కార్ట్‌ డాట్‌ కాం వారి ద్వారా హైదరాబాద్‌ బుక్‌ ట్రస్ట్‌ పుస్తకాలను నేరుగా ఇంటికే తెప్పించుకోవచ్చు. ఎలాంటి అదనపు పోస్టల్‌ ఖర్చు కూడా లేకుండా మీరు ఆర్డర్‌ చేసిన వారం రోజుల్లో మీరు కోరిన పుస్తకం మీ ఇంటికి వచ్చేస్తుంది. పూర్తివివరాలకు దిగువన క్లిక్‌ చేయండి:


ఫ్లిప్‌ కార్ట్‌ డాట్‌ కాం
,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,


4.
(ఎవికెఎఫ్‌ బుక్‌ లింక్‌ ద్వారా)

దేశదేశాలలోని తెలుగువారికి లాభాపేక్షలేకుండా విశిష్ట సేవలు అందిస్తున్న ''అప్పాజోస్యుల, విష్ణుభొట్ల కందాళం ఫౌండేషన్‌ ఆఫ్‌ అమెరికా'' (ఎవికెఎఫ్‌) వారిని సంప్రదించి అదనపు ఖర్చులు లేకుండానే హైదరాబాద్‌ బుక్‌ ట్రస్ట్‌ పుస్తకాలను పొందవచ్చు. వివరాలకు దిగువ క్లిక్‌ చేయండి:


ఎవికెఎఫ్‌ బుక్‌ లింక్‌
,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,


5.
(కినిగె డాట్‌ కామ్‌ వారి ద్వారా ఇ బుక్స్‌) 


 

కినిగె డాట్‌ కామ్‌ వారు ప్రస్తుతం హైదరాబాద్‌ బుక్‌ ట్రస్ట్‌ పుస్తకాలను ఇ బుక్స్‌ రూపంలో అందిస్తున్నారు. పది శాతం వరకు రాయితీ సౌకర్యం కూడా కల్పిస్తున్నారు. పూర్తివివరాలకు దిగువ క్లిక్‌ చేయండిః


కినిగె డాట్‌ కామ్‌
,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,

' చినిగిన చొక్కా అయినా తొడుక్కో... కానీ ఒక మంచి పుస్తకం కొనుక్కో...! '
,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,, 


.

హైదరాబాద్‌ బుక్‌ ట్రస్ట్‌