Tuesday, November 22, 2011

"వీరనారి ఝాన్సీ ఝల్కారీ బాయి" సౌదా అరుణ వ్యాసం


...
మన దేశం లో అగ్ర కుల రచయితలూ, చరిత్ర కారులూ రాజుల మెప్పుకోసం పాకులాడారే తప్ప ప్రజా జీవితాన్నీ, ప్రజా చరిత్రనూ వాస్తవిక రీతిలో చిత్రించేందుకు ఎన్నడూ ప్రయత్నించలేదు. దళిత వీరుల వీరనారీమనుల వైపు కన్నెత్తి చూసిన పాపాన కూడా పోలేదు. అందుకే బుందేల్ ఖండ్ (ఉత్తర ప్రదేశ్ కు ) చెందిన దళిత వీరనారి ఝాన్సీ ఝల్కారీ బాయి (1830 -1890 ) సాహస గాధ చరిత్ర పుటలకెక్కకుండా పోయింది.

దళిత అంశాలపై హిందీలో విస్తృతంగా రచనలు చేస్తున్న మోహన్ దాస్ నైమిష్ రాయ్ ఇటీవల ఎంతో పరిశోధించి ఆమె జీవిత చరిత్రను గ్రంధస్తం చేసారు. డా. జీ. వీ. రత్నాకర్ అనువదించిన పుస్తకాన్ని హైదరాబాద్ బుక్ ట్రస్ట్ "వీరనారి ఝాన్సీ ఝల్కారీ బాయి" పేరిట ప్రచురించిన విషయం విదితమే.

ఈ పుస్తకం తెలుగు పాఠకులను కూడా విశేషంగా ఆకట్టుకుంటోంది. మరుగునపడ్డ ఝల్కారీ బాయి జీవిత చరిత్ర పై దేశ వ్యాప్తంగా విస్తృతంగా చర్చ జరుగుతోంది.

ఈ క్రమంలో " సమాంతర వాయిస్ " మాస పత్రిక నవంబర్ 2011 సంచికలో సౌదా అరుణ గారు ఒక వ్యాసం రాసారు.
సమాంతర సౌజన్యంతో ఆ వ్యాసం పీ డీ ఎఫ్ ఫైలు రూపం లో ఇక్కడ పొందు పరుస్తున్నాము.
దిగువ టైటిల్ పై క్లిక్ చేయండి.
:

సమాంతర పత్రిక కోసం ఈ కింది చిరునామాలో సంప్రదించవచ్చు :
Samaantara Voice, 11-6-868/10, First Floor, Lakdikapool, Hyderabad - 500004
Phone: 040 23303397

వీరనారి ఝాన్సీ ఝల్‌కారీ బాయి
రచన: మోహన్‌ దాస్‌ నైమిశ్‌ రాయ్‌

తెలుగు: డా. జి.వి. రత్నాకర్‌

బొమ్మలు: పైడిరాజు
24 పేజీలు, వెల: రూ.30/-

ప్రతులకు, వివరాలకు:
హైదరాబాద్‌ బుక్‌ ట్రస్ట్‌,
ప్లాట్‌ నెం.85, బాలాజీ నగర్‌, గుడిమల్కాపూర్‌,
హైదరాబాద్‌ - 500067
ఫోన్‌ నెం. 040 2352 1849

ఇమెయిల్‌: hyderabadbooktrust@gmail.com

..


No comments:

Post a Comment

హైదరాబాద్‌ బుక్‌ ట్రస్ట్‌