Tuesday, October 25, 2011

నేను భంగీని


... అవును నేను అంటరానివాన్ని.
నేను ఈ రోజు నా కథని వినిపించాలనుకుంటున్నాను.

నా కథ, నా భాష మీరు ఇంతకు ముందు వినివుండరు.

నా కథని ఎవరూ రాయలేదు.

నేను సమాజపు చిట్టచివరి అంచున వున్నవాణ్ని.
చెత్త కుండీని.

మురికిబట్టిన పనికిరాని చెత్తని ఇందులో విసిరివేస్తారు.
మూగవానిగా, కాళ్ల కింది గడపగా మార్చబడిన ఈ సమాజంలోని మనిషిని.
ప్రతి మనిషీ నాపై అడుగులేసి ఇంట్లోకి వెళ్తాడు. కానీ నాకు మాత్రం ఇంట్లోకి ప్రవేశం లేదు. ....
...
ఇదో అంటరానివాడి చరిత్ర
నేను అంటరానివాన్ని.
నేను పాకీవాన్ని.
నేను ఛండాలుడిని.
మ్లేచ్ఛుడిని అని అంటున్నాడు ఈ వ్యక్తి.

ఇతను ఎవరు?

చరిత్ర వున్నవాడు కానీ చరిత్రలో లేనివాడు.

అక్షరాలు తెలియనివాడు. జ్ఞానం లేనివాడు. అచ్చమైన మూలవాసి.

ఆయుధాలు పట్టినవాడు. పోరాటాలు చేసినవాడు. నెత్తురు
పారించినవాడు.
కిరీటాలు మార్చిన వాడు, తలకాయలు కత్తిరించినవాడు.
సామ్రాజ్యాలు స్థాపించినవాడు. పడిపోతున్న సింహాసనాలకి
ప్రాణాలు పోసినవాడు.
రాజ్యాన్ని నిలబెట్టడంలో,
రాజ్యాన్ని పడగొట్టడంలో ప్రధానమైన పనిముట్టు ఇతను.


''నీళ్లు జీవితాన్నిస్తాయి.

కానీ నాకు మాత్రం నీళ్లు బానిస సంకెళ్ళు.

ప్రకృతిలో నీరూ, గాలీ మీద అందరికీ సమాన హక్కులున్నాయంటారు...

కానీ హిందూ సమాజంలో నీళ్లపై హక్కు కూడా నాకు దక్కకుండా చేశారు''
అని అంటున్నాడు ఈ మనిషి.


అశుద్ధాన్ని , మురికిని, పెంటని వీధుల నుండి, గ్రామం నుండి వేరు చేస్తూ... అద్దంలా ఊరిని తయారుచేస్తూ, తాను అశుద్ధ మానవుడుగా
మారి అసహ్యంతో, రోగాలతో, అశుభ్రతతో దగ్గీ దగ్గీ ప్రాణాలు తీసుకుంటున్న అధోజగత్‌ సహూదరుల చరిత్ర ఇది.

అందుకే ఇది అంటరానివారి చరిత్ర.

ఇందులో భగవాన్‌ బుద్ధుడు వస్తాడు.

అనన్య సామాన్యమైన ఆయన బోధనలు వినిపిస్తాయి.
ఈ దేశానికి రాజ్యాంగం రాసిన దిక్సూచి బాబా సాహెబ్‌ డా. అంబేడ్కర్‌ వస్తాడు.
బోధించు, పోరాడు, సమీకరించు, విప్లవించు అనే ఆయన బోధనలు వినిపిస్తాయి.


అంటరానివాడు అంటరానివాడిగానే ఊరిబైట అ లాగే మగ్గాలి అనే దొంగ సాధువులు, మహాత్ములు కనిపిస్తారు.
వారి కపట నాటకాలు
ధర్మప్రభోదాలు వినిపిస్తాయి.
పురుషార్థాన్ని సాధించవచ్చు అంటూ వర్ణవ్యవస్థ జెండాకి జై కొడుతున్న సిగ్గుమాలిన దగుల్భాజీలు కనిపిస్తారు.

బుద్ధ భగవానుని ప్రవచనాల నుండి బాబాసాహెబ్‌ బోధనల వరకు అన్నింటిని వింటూ అక్షర జ్ఞానానికి దూరంగా బలహీనతలతో, అజ్ఞానంతో
బతుకుతున్న అంటరాని, పాకీ సోదరుల ఈ చరిత్రని మనం వీధివీధికి తీసుకెళ్లాలి.
అందుకోసం మనవంతు కర్తవ్యాన్ని మనం నిర్వర్తించాలి
అని చెప్తుంది ఈ పుస్తకం.
అందుకే దీన్ని అందరూ చదవాలి.
...

భగవాన్‌ దాస్‌ (1927-2010)

భారతదేశం తొలితరం దళిత చైతన్యానికి నిలువెత్తు ప్రతీక. కొంతకాలం అంబేద్కర్‌ వద్ద పరిశోధన సహాయకుడిగా పనిచేసిన ఆయన
జీవితాంతం అంబేద్కర్‌ ఆశయాల సాధనకోసమే పాటుపడ్డారు. భంగీ (పాకీ) వృత్తికులంలో జన్మించారు. బౌద్ధాన్ని స్వీకరించిన ఆయన శాంతి కోసం ప్రపంచ మతాల సమ్మేళనం (క్యోటో, 1970) ఏర్పాటు చేయడంలో కీలక పాత్ర పోషించారు. 1983లో అంటరానితనం, దాని అమానుషాల గురించి ఐక్య రాజ్య సమితి వేదిక మీద ప్రసంగించారు.
డా. జి.వి.రత్నాకర్‌
తెలుగులో మట్టిపలక, లట్లేటి అ లం కవిగా సుపరిచితుడు. హిందీ నుండి తెలుగులోకి 25 పుస్తకాలను అనువదించారు. సాక్షి మానవ హక్కుల నిఘా పత్రికకు సంపాదకులుగా పనిచేశారు. ప్రస్తుతం హైదరాబాద్‌లోని మౌలానా ఆజాద్‌ నేషనల్‌ ఉర్దూ యూనివర్శిటీ హిందీ డిపార్ట్‌మెంట్‌లో అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌గా పనిచేస్తున్నారు. ...

నేను భంగీని

రచన: భగవాన్‌ దాస్‌

తెలుగు: డా. జి.వి.రత్నాకర్‌

128 పేజీలు, వెల: రూ. 80/-


ప్రతులకు, వివరాలకు:

హైదరాబాద్‌ బుక్‌ ట్రస్ట్‌

ప్లాట్‌ నెం. 85, బాలాజీ నగర్‌,

గుడిమల్కాపూర్‌, హైదరాబాద్‌-500 067

ఫోన్‌: 040-23521849
ఇమెయిల్‌ : hyderabadbooktrust@gmail.com

..

No comments:

Post a Comment

హైదరాబాద్‌ బుక్‌ ట్రస్ట్‌