Sunday, October 31, 2010

మనసున్న మహా గాయని

మనసున్న మహా గాయని

బెంగుళూరు నాగరత్నమ్మ ఓ శతాబ్దం క్రితమే, పురుషాధిక్య సమాజాన్ని ఎదిరించి నిలిచారు.
సంగీత ప్రతిభతో మహామహుల ఆదరం పొందారు.
ఆస్తులు సంపాదించారు.
తంజావూరు పాలకుల ఆస్థాన కవయిత్రి ముద్దుపళని రాసిన రాధికా సాంత్వనము అనే శృంగార కావ్యాన్ని ధైర్యంగా ముద్రించారు.

తిరువయ్యారులో త్యాగరాజు సమాధి శిధిలావస్థలో వుందని తెలిసి ఆ”మె మనసు ద్రవించింది.
వెంటనే బయల్దేరి వెళ్లారు.
ఇక తిరువయ్యారే ఆమె ప్రపంచమైపోయింది.
త్యాగయ్య సమాధే ఆమెకు సర్వస్వమైపోయింది.
తనకున్న ఆస్తులన్నీ కరిగించి ఆలయాన్ని కట్టాంచారు.
త్యాగరాజ ఆరాధనోత్సవాల్లో మహిళలకు ప్రవేశం కల్పించిన ఘనత కూడా నాగరత్నమ్మదే.
కావేరీ తీరంలోని ఆమె సమాధి సంగీతాభిమానుల పుణ్యక్షేత్రం.
 
ఆ సంగీత సామ్రాజ్ఞి జీవితాన్నీ, వ్యక్తిత్వాన్నీ ఈ పుస్తకంలో కళ్లకు కట్టారు వి.శ్రీరాం.
సంగీత ప్రపంచానికి కూడా పెద్దగా తెలియని ఆమె జీవిత విశేషాల్ని సేకరించడానికి రచయిత చాలా కష్టపడ్డారని అడుగడుగునా కనిపించే రెఫరెన్సులు చూస్తేనే అర్థమైపోతుంది.
అనువాదం సరళంగా వుంది.

- వాణి.
ఈనాడు ఆదివారం 31-10-2010




















బెంగుళూరు
నాగరత్నమ్మ 
జీవిత చరిత్ర
శ్రీ రాం.వి
అనువాదం: టి. పద్మిని
ముఖచిత్రం: బత్తుల
పేజీలు 143
వెల: రూ.60/-

ప్రతులకు, వివరాలకు
హైదరాబాద్‌ బుక్‌ ట్రస్ట్‌
ప్లాట్‌ నెం.85, బాలజీ నగర్‌, గుడిమల్కాపూర్‌,
హైదరాబాద్‌-500067
ఫోన్‌: 040 2352 1849 

No comments:

Post a Comment

హైదరాబాద్‌ బుక్‌ ట్రస్ట్‌