Tuesday, July 28, 2009

ఆంధ్ర దేశంలో సంఘ సంస్కరణోద్యమాలు ... మూలం : వి. రామకృష్ణ ... అనువాదం: రాచమల్లు రామచంద్రారెడ్డి ...



ఆంధ్ర దేశంలో 19వ శతాబ్దంలో వచ్చిన రాజకీయ, ఆర్థిక, సాంఘిక పరిణామాల నేపధ్యంలో అదే శతాబ్దంలోని ఉత్తరార్థంలో తలెత్తిన సాంఘిక సంస్కరణోద్యమాలకు ఆంధ్రదేశ చరిత్రలో ఎంతో ప్రాముఖ్యం వుంది. అదే కాలంలో భరతదేశంలోని బెంగాల్, మహారాష్త్ర, పంజాబ్ లాంటి ప్రాంతాలలో ఇలాటి ఉద్యమాలు ఎన్నో వచ్చాయి. వాటిలో భాగంగానే అంధ్ర దేశంలోని సంస్కరణలను కూడా గమనించవలసి ఉంటుంది. ఆంధ్ర దెశంలోని ఈ ఉద్యమాలపై ఇంతవరకూ ఒక సమగ్రమైన పరిశోధన జరగలేదు.

ఈ గ్రంధం లో ఆ ప్రయత్నం తొలిసారిగా జరిగింది.
కందుకూరి వీరేశలింగం కేంద్రం గా నడిచిన ఈ ఊద్యమాల చరిత్ర ఈ గ్రంధం లో వీలున్నంత మేరకు సమగ్రంగా కనిపిస్తుంది.
సంస్కరణోద్యమాలు ఆంధ్రదేశ చరిత్రలొ ఆధునిక యుగం ఆవిర్భావానికి ఎలా దోహదం చేశాయో చెబుతూ, అవి ఆ తరువాత రాసాగిన రాజకీయ ఉద్యమాలకు ఏవిధంగా పూర్వ రంగాన్ని సిధ్ధం చేశాయో, నాంది పలికాయో ఈ గ్రంధం వివరిస్తుంది.

సంఘ సంస్కరణల బీజాలు మధ్య యుగాల నుంది ఆంధ్రదేశంలో ఎలా పాదుకుని ఉన్నాయో వివరించి, వీరేశలింగానికి పూర్వం ఉందే సంస్కరణ ధోరణలను కూడా స్పృశిస్తుంది. ఈ గ్రంధం మన సామాజిక ఉద్యమాలను తెలుసుకోవాలని కుతూహలపడే సామాన్య పాఠకులకే గాక భావి పరిశొధకులకు కూడా ఉపకరిస్తుందని మా నమ్మకం.

రచయిత గురించి :

డాక్తర్ వి రామకృష్ణ (1938) ఆధునికాంధ్ర సామాజిక చరిత్రలో విశేషమైన కృషిచేసిన పరిశోధకులు.. జవహర్లాల్ నెహౄ విశ్వవిద్యాలయం చారిత్రక అధ్యయనాల కేంద్రంలో ఆచార్య సర్వేపల్లి గోపాల్ పర్యవేక్షణలో పి.హెచ్.డి. చేసారు.

డా. రామకృష్ణ ఆంధ్రప్రదేష్ చరిత్ర కాంగ్రెస్ సంస్థాపక సభ్యులు. మూడేళ్ళపాటు దాని ప్రధాన కార్యదర్శి. ఇప్పుడు భారతీయ చరిత్ర కాంగ్రెస్ సమ్యుక్త కార్యదర్శి.

ఆంధ్ర సామాజిక చరిత్రపై అనేక వ్యాసాలు రచించదమే కాకుండా ఆంధ్ర సామాజిక చరిత్ర నిర్మాణం ఒక సమ్యక్ దృక్పఠంతో జరగాలని ఆకాక్షించే జిజ్ణాసువు.



ఆంధ్ర దేశంలో సంఘ సంస్కరణోద్యమాలు
మూలం : వి. రామకృష్ణ
అనువాదం: రాచమల్లు రామచంద్రారెడ్డి ...
140 పేజీలు, వెల : రూ.30

No comments:

Post a Comment

హైదరాబాద్‌ బుక్‌ ట్రస్ట్‌