Wednesday, May 27, 2009

అమ్ముడుపోతున్న వ్యవసాయం ... బలిపీఠంపై భారత ఆహార భద్రత ...దేవీందర్‌ శర్మ ...



అమ్ముడుపోతున్న వ్యవసాయం
బలిపీఠంపై భారత ఆహార భద్రత
- దేవీందర్‌ శర్మ ...



ప్రపంచ వాణిజ్య సంస్థ తాలూకు వ్యవసాయ ఒప్పందం నేపథ్యంలో మన దేశం యాభైఏళ్లపాటు చెమటోడ్చి సాధించుకున్న ఆహార భద్రతనూ, స్వయం సమృద్ధినీ స్వేచ్ఛా వాణిజ్యం ఏవిధంగా ధ్వంసం చేయబోతోందో వివరిస్తుందీ వ్యాసం.

ప్రస్తుతం మన వ్యవసాయ విధానం ఒక అగమ్యగోచర స్థితిలో వుంది. హరిత విప్లవం తన ఊపును కోల్పోవడం వల్ల పంట దిగుబడులు స్తంభించడమేకాక తగ్గుముఖం పడుతున్నాయి. పెరుగుతున్న జనాభాకి అనుగుణంగా ఆహారోత్పత్తి పెరగక పోవడానికి నేడు దేశంలో కొనసాగుతున్న నిరాశాజనకమైన ఆర్థిక విధానాలే కారణం.

సాంద్ర వ్యవసాయంలో ఉత్పన్నమయ్యే సమస్యలను సరళీకృత విధానాలు తీవ్రం చేశాయి. వ్యవసాయ విధానాల ప్రధాన దృష్టి ఆగ్రోప్రాసెసింగ్‌, విదేశీ పెట్టుబడులు, ఎగుమతులు మొదలైనవాటి మీదకు మళ్లడంతో వ్యవసాయ ఉత్పత్తికీ-ఆహారం అందుబాటుకీ మధ్య వుండే అవినాభావ సంబంధం అ లక్ష్యానికి గురైంది.

ఒకవైపు దేశంలో ఆకలి దప్పులు పెరిగిపోతోంటే మరోవైపు అనేక సారవంతమైన నేలల్లో పండిన ఆహార ధాన్యాలను, మాంసకత్తులను ప్రజల ఆకలిని తీర్చేందుకు కాకుండా విదేశీ మార్కెట్ల కోసం పనికొచ్చే చిరుతిండ్లు, మద్యపానం వంటి వాటి తయారీకి ఉపయోగిస్తున్నారు.

వ్యవసాయం పారిశ్రామికీకరణ చెందుతున్న కొద్దీ చిన్న సన్నకారు రైతులు తమ భూముల్ని కోల్పోతున్నారు. భూమిలేని రైతు కూలీలుగా, పట్టణ ప్రాంతపు నిరుపేదలుగా మారిపోతున్నారు. ప్రత్యేకించి మెట్ట ప్రాంత వ్యవసాయ ఖర్చులు విపరీతంగా పెరిగిపోతున్నాయి. ఎరువులూ పురుగుమందుల విషవలయంలో రైతులు విలవిలాడుతున్నారు. దీనికి తో'డు గిట్టుబాటు ధరలు రాక అప్పుల ఊబిలో కూరుకుపోతున్నారు. అనేకమంది ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు.

వాణిజ్యానికి సంబంధించిన మేధోపరమైన సంపద హక్కుల (టిఆర్‌ఐపిఎస్‌)పై ప్రపంచ వాణిజ్య సంస్థ ఒప్పందం మన దేశ వ్యవసాయ ఉత్పత్తి వ్యవస్థను కొద్దిపాటి బహుళ జాతి సంస్థలు హైజాక్‌ చేయడానికి అవకాశం కల్పిస్తున్నది. భవిష్యత్‌ చిత్రపటం మరింత భీతిగొల్పుతున్నది.

ఈ పుస్తకంలోని అధ్యాయాలు:
1.స్వయం సమృద్ధివైపు 2. భారత వ్యవసాయానికి ప్రమాద ఘంటికలు 3.వ్యవసాయ ఒప్పందం. 4. తిండిగింజలకు బదులు గులాబీలు, 5. నూనెగింజల విప్లవాన్ని కాలదన్నడం 5. ఆహార అభద్రతకు అంకురార్పణ.



అమ్ముడుపోతున్న వ్యవసాయం
బలిపీఠంపై భారత ఆహార భద్రత
- దేవీందర్‌ శర్మ


ఆంగ్ల మూలం: Selling Out: The Cost of Free Trade for Food Security in India, Devider Sharma; The Ecological Foundation, New Delhi, 2000 CopyRight: 2000, UK Food Group

తెలుగు అనువాదం: ప్రభాకర్‌ మందార

పుస్తక సంపాదకుడు: యం. కోదండరామ్‌రెడ్డి
ప్రథమ ముద్రణ: డిసెంబర్‌ 2000
32 పేజీలు, వెల: రూ.12


..................

1 comment:

  1. పాలకులు దేశం మొత్తాన్ని సామ్రాజ్యవాదులకి అమ్మేస్తారు (అసెంబ్లీ, పార్లమెంట్ భవనాలు మరియు మంత్రుల కార్యాలయాలు తప్ప).

    ReplyDelete

హైదరాబాద్‌ బుక్‌ ట్రస్ట్‌