Friday, May 1, 2009

బ్రాహ్మణత్వం పై కంచ ఐలయ్య విమర్శ



నేను హిందువు నెట్లయిత ? ( పుస్తక సమీక్ష )
(విప్లవ తరంగం డాట్ నెట్ సౌజన్యం తో )
http://viplavatarangam.net/?p=10


కంచ ఐలయ్య గారు పశువులు కాసే కురుమ (కురుబ) కులానికి చెందిన కుటుంబంలో పుట్టి పెరిగారు. అతని తల్లి తండ్రులకి కులం పేరు తెలుసు కానీ మతం పేరు తెలియదు. ఒక ప్రాంతంలో రెండు వేర్వేరు మతాల వాళ్ళు ఉండి వాళ్ళు రెండు వేర్వేరు ప్రార్ధనా స్థలాలకి వెళ్ళి ప్రార్ధనలు చేస్తేనే అక్కడి ప్రజలందరికీ తమ మతం పేరు తెలుస్తుంది, వేర్వేరు మత ఐడెంటిటీలు మెయింటెయిన్ చేస్తారు. కంచ ఐలయ్య గారి తల్లి తండ్రులకి మతం గురించి తెలియకపోయినా కులం కట్టుబాట్లు మధ్యనే జీవించారు. కంచ ఐలయ్య గారు చిన్నప్పుడు ఆ వాతావరణంలోనే పెరిగారు. ఆ వాతావరణంలో తాను చూసిన వెనుకబడిన కులాల వారి జీవన విధానం, సంస్కృతి, సంప్రదాయాలు గురించి ఈ పుస్తకంలో వివరంగా వ్రాసారు.
ఈ పుస్తకంలో ఐలయ్య గారు బ్రాహ్మణత్వం పై తన శైలిలో విమర్శలు చేశారు. హిందూ పురాణాలు, స్మృతులు శూద్రులని ఏ విధంగా కించపరిచే విధంగా ఉన్నాయో హిందూ మత గ్రంథాలలోని వ్రాతల ఆధారంగా విమర్శిస్తూ వ్రాశారు. ఇతను హిందూ మత గ్రంథాలలోని పొంతన లేని అంశాలని బయట పెట్టారు, హిందూ మతాన్ని స్త్రీవాద కోణంలో కూడా విమర్శించారు. హిందువులు సరస్వతిని చదువుల తల్లిగా భావిస్తారు కానీ ఒకప్పుడు హిందువులలో బ్రాహ్మణ స్త్రీలకి కూడా చదువుకునే అవకాశం ఉండేది కాదు. శూద్ర స్త్రీలలో ఈ మధ్యే చదువుకునే వారి సంఖ్య పెరిగింది. బ్రాహ్మణ స్త్రీలకి కూడా అన్యాయం చేసిన బ్రాహ్మణులు శూద్రులకి ఏమి న్యాయం చెయ్యగలరు? అని కూడా ప్రశ్నించి బ్రాహ్మణుల పై విరుచుకు పడ్డారు.
ఈ పుస్తకం చదివితే బ్రాహ్మణులకి కోపం రావచ్చు. ఈ విషయం కంచ ఐలయ్య గారికి కూడా తెలుసు. గ్రామీణ ప్రాంతాలలో ఇప్పుడు కూడా కులం కట్టుబాట్లు బలంగా కనిపిస్తున్నాయి. కుల వివక్ష లేని ఆరోగ్యకరమైన సమాజం రావాలనే ఆశతో కంచ ఐలయ్య గారు ఈ పుస్తకం వ్రాశారు. హిందువులు దళితులు కూడా తమ మతం వారేనని చెప్పుకుంటారు. అయినా వీళ్ళు దళితులని అంటరానివాళ్ళ గానే చూస్తారు. దళితులని వెలివేసిన వాళ్ళని చూసినట్టు చూసినా దళితులు వేరే మతంలోకి మారడానికి అగ్రకుల హిందువులు ఒప్పుకోరు, దళితులు హిందువులు గానే ఉండాలంటారు. హిందూ మతం దిగువ కులాలవారికి అన్యాయమే చేసింది కనుక కంచ ఐలయ్య గారు తాను హిందువుని కాను అనే చెప్పుకుంటున్నారు.
ఈ పుస్తకాన్ని 1996లో కంచ ఐలయ్య గారు ఆంగ్లంలో “Why I am not a Hindu” పేరుతో రచించారు. 2000 సంవత్సరంలో తెలుగులోకి అనువదించి “హైదరాబాద్ బుక్ ట్రస్ట్” ద్వారా ప్రచురించారు.

(విప్లవ తరంగం లో వచ్చిన ఈ పుస్తక సమీక్ష గురించి తన కామెంట్ లో ప్రస్తావించిన ప్రవీణ్ గారికి కృతఙ్ఞతలు.
ఇదే పుస్తకం పై ఆంధ్ర భూమి ఎడిటర్ ఎం వి ఆర శాస్త్రి చేసిన సుదీర్ఘ విమర్శను ఆంగ్లం లో ఈ కింది లింకు లో చదవ వచ్చు. ఈ లింకు గురించి తన కామెంట్ ద్వారా తెలియ జేసిన జయహో గారికి ధన్యవాదాలు)


http://vaidikdharm.org/Documents/Why%20I%20am%20not%20a%20hindu-Critic.pdf

From http://en.wikipedia.org/wiki/Kancha_Ilaiah#cite_note-4

1 comment:

  1. భార‌తీయ స్వాతంత్ర పోరాట‌యోధుల జీవిత చ‌రిత్ర‌ల‌లాంటివి ఇక్క‌డ ఉంచ‌గూడ‌దా? కేవ‌లం స‌నాత‌న ధ‌ర్మ వ్య‌తిరేక గ్రంధాల‌కే స్థాన‌మా?

    ReplyDelete

హైదరాబాద్‌ బుక్‌ ట్రస్ట్‌