Tuesday, April 28, 2009

ఆదివాసుల పొలికేక - ‘అడవి తల్లి ‘





మీరు చదివారా?
అడవితల్లి జాను పై దుప్పల రవికుమార్ గారి సమీక్ష ......

2003 ఫిబ్రవరి 19వ తేదీన కేరళలో వైనాడ్ జిల్లాలోని ముతాంగ రిజర్వ్ ఫారెస్టులో ఆందోళన చేస్తున్న గిరిజనులపై జరిపిన పోలీసు కాల్పులలో ఒక గిరిజనుడు, ఒక కానిస్టేబుల్ చనిపోయారు. అప్పుడు ఆ ఆందోళనలో ప్రముఖంగా వినిపించిన పేరు సి. కె. జాను. ఎలాంటి సర్టిఫికేట్లు, డిగ్రీలు లేని జాను పాఠశాల చదువుకు చాలా దూరం. కేరళ ప్రభుత్వం చేపట్టిన ‘అక్షరాస్యత’ కార్యక్రమాల్లో చదవడం, రాయడం నేర్చుకున్న జాను ఆ తరువాత ఒక ప్రజా ఉద్యమానికి నయకురాలవడం యాదృచ్చికం కాదు. మూడు పదుల ప్రాయం నిండకుండానే భారతదేశమంతటా పర్యటించి, నాలుగు పదులలోనే ప్రపంచమంతా చుట్టివచ్చి ఆదివాసీల అసలు సిసలు సమస్యల గురించి, పరిష్కారాల గురించి సభలలో, సమావేశాలలో కీలక చర్చలకు పెట్టడం అపురూపమైన విషయం.

అబ్బురపరిచే తన జీవనయానాన్ని సి. కె. జాను మలయాళంలో చెప్పుకుపోతుంటే ఆంగ్లవార పత్రిక ‘ది వీక్’లో చిత్రకారుడు భాస్కరన్ అక్షరరూపమిచ్చారు. దానిని ఎన్. రవిశంకర్ ఇంగ్లిషులోకి అనువాదం చేయగా, ప్రముఖ స్త్రివాద రచయిత్రి పి. సత్యవతి తెలుగు పాఠకులకు అందించారు. ఎంతో సరళంగా, సాఫీగా సాగిన అనువాదం మనలో ఎన్నో ప్రశ్నలను రేకెత్తిస్తుంది..................

దుప్పల రవికుమార్ గారు
అడవి తల్లి జాను పుస్తకం పై చేసిన సమీక్షను పూర్తిగా ఈ కింది లింకులో చదవండి

http://chaduvu.wordpress.com/2009/04/03/adavitalli/


........

No comments:

Post a Comment

హైదరాబాద్‌ బుక్‌ ట్రస్ట్‌