Monday, November 17, 2008

చరిత్రలో ఏం జరిగింది? ... గార్డన్‌ చైల్డ్‌ .. తెలుగు అనువాదం: వల్లంపాటి వెంకటసుబ్బయ్య




మానవుడు తాను అవతరించిన మంచుయుగం నుంచి రోమన్‌ సామ్రాజ్య పతనం వరకు తన చెమటను చిందించి ప్రపంచ ప్రగతికి పునాదులు వేసిన గొప్ప శ్రమ జీవి.
రాళ్లతో, కుండ పెంకులతో చారిత్రక పూర్వదశలోని మహత్తర మానవేతిహాసాన్ని నిర్మంచిన హృదయమున్న మేధావి.

అటువంటి మానవజాతి వేల సంవత్సరాలుగా సాగిస్తున్న ప్రస్థానాన్ని, మనిషి శ్రమ నైపుణ్యం పనిముట్ల భావజాలాన్ని లీలా సృష్టించాయో, చరిత్రగతిని ఎట్లా మార్చాయో వివరించే
ఈ పుస్తకంతో రచయిత గార్డన్‌ చైల్డ్‌ వేసిన బాట కొత్తది మాత్రమే కాదు... శాశ్వతమైనది కూడా!

ప్రొఫెసర్‌ గార్డన్‌ చైల్డ్‌ (1892-1957) ఆస్ట్రేలియాలోని సిడ్నీలో జన్మించారు. ప్రాక్‌ పురాతత్వ చరిత్ర శాస్త్రజ్ఞుడైన ఈయన అనేక ప్రముఖ పుస్తకాలను రచించారు. వాటిలో చరిత్రలో
ఏం జరిగింది? ఉదయించిన ఐరోపా నాగరికత, అతిప్రాచీన తూర్పు నాగరికత, సామాజిక పరిణామం ప్రముఖమైనవి.

ఇందులో చర్చించిన అంశాలు:
1. పురాతత్వ శాస్త్రం చరిత్ర
2. పాత రాతి యుగం
3. కొత్త రాతి యుగం
4. రాగి యుగం
5. మెసపొటేనియాలో నగర విప్లవం
6. ఈజిప్టు, భారతదేశాల్లో తొలి కంచుయుగం నాగరికత
7. తొలి ఇనుపయుగం
8. ప్రాచీన నాగరికత ఉన్నత దశ
9. ప్రాచీన ప్రపంచం యొక్క పతనం


ఈ పుస్తక అనువాదకులు వల్లంపాటి వెంకటసుబ్బయ్య ప్రఖ్యాత సాహితీ విమర్శకుడు, సృజనాత్మక రచయిత. వీరు అనువాదం చేసిన ప్రపంచ చరిత్ర వంటి పుస్తకాలను లోగడ లోగడ
హైదరాబాద్‌ బుక్‌ ట్రస్ట్‌ ప్రచురించింది. వీరు రాసిన కథాశిల్పం అనే పుస్తకం కేంద్ర సాహిత్య అకాడమీ పురస్కారాన్ని పొందింది. వీరు మదనపల్లిలోని బి.టి.కళాశాలలో లెక్చరర్‌గా
పనిచేశారు.

చరిత్రలో ఏం జరిగింది?
గార్డన్‌ చైల్డ్‌
ఆంగ్లమూలం: వాట్‌ హాపెన్డ్‌ ఇన్‌ హిస్టరీ, పెంగ్విన్‌.

తెలుగు అనువాదం: వల్లంపాటి వెంకటసుబ్బయ్య
188 పేజీలు, వెల: రూ.40

No comments:

Post a Comment

హైదరాబాద్‌ బుక్‌ ట్రస్ట్‌