Friday, November 7, 2008

గులాంగిరి - జోతీరావు ఫూలే


భారత దేశంలో కులం గురించిన సిద్ధాంతాన్ని శాస్త్రీయంగా రూపొందించిన తొలి దార్శనికుడు జోతీరావు ఫూలే (1827-1890). దుర్మార్గమైన కులవ్యవస్థ సమూలంగా నిర్మూలించబడాలని ఆయన ప్రగాఢంగా కోరుకున్నారు. ఫూలే ఆలోచనలకూ, విశ్లేషణలకూ ఆయన రాసిన ఈ పుస్తకం అద్దం పడుతుంది.
... ... ...

ఈ పుస్తకం రాయడంలో నా శూద్ర సోదరుల్ని బ్రాహ్మణులు ఎట్లా మోసం చేశారో చెప్పడం ఒక్కటే నా ఉద్దేశం కాదు. ఇంతవరకూ బ్రిటీషు ప్రభుత్వం అనుసరిస్తూ వచ్చిన ఉన్నత విద్యాబోధనా విధానం ఎంత హానికరమో తెలుసుకొనేలాగ ఆ ప్రభుత్వం కళ్లు తెరిపించడం కూడా నా ఉద్దేశం.
...

తోటి శూద్రుల నిజ పరిస్థితిని ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్లడం, బ్రాహ్మణ దాస్యత్వం నుంచి తమని తాము విముక్తి చేసుకోవడం - ఈ రెండూ ఏ కాస్త చదువుకున్న నా శూద్ర సహూదరులందరి ప్రథమ కర్తవ్యం.

ప్రతి గ్రామంలో శూద్రులకు పాఠశాలలు అవశ్యం కావాలి.
కానీ అందులో బ్రాహ్మణ ఉపాధ్యాయులు మాత్రం వుండకూడదు.

దేశం అనే దేహానికి శూద్రులు రక్తనాళాల వంటివారు. అందుచేత ప్రభుత్వం తన ఆర్థిక, రాజకీయ కష్టాలనుంచి గట్టెక్కడానికి ఎప్పుడూ ఆధారపడవలసింది శూద్రుల మీదనే తప్ప బ్రాహ్మణుల మీద కాదు.

- జోతిరావు ఫూలే



గులాంగిరి
-జోతీరావు ఫూలే
తెలుగు అనువాదం : ఏలూరి రామయ్య
102 పేజీలు, వెల: రూ.40/-

No comments:

Post a Comment

హైదరాబాద్‌ బుక్‌ ట్రస్ట్‌